Double Ismart : రిలీజ్కు రెండు రోజులు.. ఎటూ తెగని డబుల్ ఇస్మార్ట్ పంచాయతీ..?
- ఆగస్టు 15న గ్రాండ్ రిలీజ్ కానున్న డబుల్ ఇస్మార్ట్
- రామ్ - పూరిల లేటెస్ట్ డబుల్ ఇస్మార్ట్
- నైజాం వ్యవహారంలో నడుస్తున్న తకరారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డబుల్ ఇస్మార్ట్ మరో రెండు రోజుల్లో రిలీజ్ కు రెడీ గా ఉంది. కానీ ఇప్పటికి లైగర్ నష్టాల వ్యవహారం ఇంకా ఎటూ తేలలేదు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అసలు ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ అవుతుందా అన్న సందేహం వస్తోంది. దాదాపు రెండు వారాల క్రితం మొదలైన పంచాయతీ డైలీ సీరియల్ లా కొనసాగుతూనే ఉంది తప్ప కొలిక్కి రావట్లేదు. లైగర్ నష్టపరిహారం విషయమై అప్పట్లో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం వెళ్తే సాఫీగా జరిగిపోయేది ఈ వ్యవహారం. కానీ ఆలా కాకుండా అనేక మెలికలు పెడుతున్నారు అనేది డిస్ట్రిబ్యూటర్ల వాదన.
Also Read: Tollywood : నిర్మాతలందరికి ఆ హీరోనే కావాలి.. అంత ప్రత్యేకత ఏంటో.. ?
Also Read
- Nikhil : స్వయంభు కోసం 45 రోజుల కఠినమైన శిక్షణ తీసుకున్న హీరో నిఖిల్
- Kollywood : రూట్ మార్చిన కోలీవుడ్ స్టార్స్.. మళ్లీ కమర్షియల్ జోన్లోకి సూర్య, విక్రమ్, ధనుష్, శివకార్తికేయన్!
- Peddi Inside Talk : 'పెద్ది' ఇన్ సైడ్ రిపోర్ట్.. ఫస్టాఫ్ అదిరింది..సెకండాఫ్ కొంచం?
- Peddi Breakeven Target : రామ్ చరణ్ 'పెద్ది' ప్రీ రిలీజ్ బిజినెస్.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
నిన్నటి వరకు జరిగిన సెటిల్ మెంట్ ప్రకారం లైగర్ ను నైజాంలో పంపిణీ చేసిన బయ్యర్స్ కు 40 శాతం నష్టాలు భరించేందుకు ముందుకు వచ్చారు ఆ సినిమా నిర్మాతలైన ఛార్మి, పూరి జగన్నాధ్. ఇండస్ట్రీ పెద్దలు కూడా ఇందుకు ఇరువురిని ఒప్పించారు. కానీ చివరి నిమిషంలో నిర్మాతలు వెనక్కితగ్గారని తెలిసింది. పర్సెంటేజ్ ప్రకారం కాకుండా రూ. 6 కోట్లు ఇస్తామని ఛార్మి మరో మాట చెప్పినట్టు వినిపిస్తోంది. ఎవరో ఒకరు ఎక్కడో అక్కడో తగ్గితే ఈ డీల్ తెగుతుంది కానీ ఎవరికీ వారు మొండిపట్టు పట్టారు. మాకు ఇస్తామని చెప్పింది ఇవ్వకుంటే డబుల్ ఇస్మార్ట్ ను నైజాం లో బాయ్ కాట్ చేస్తామని చిన్నపాటి హెచ్చరిక జారీ చేసారు నైజాం డిస్ట్రిబ్యూటర్లు.
Also Read: Megastar: ఇంద్ర రీరిలీజ్ కష్టమేనా..? సమస్య ఏంటంటే ..?
అదే జరిగితే డబుల్ ఇస్మార్ట్ నిండా మునిగిపోతుంది. వాస్తవానికి డబుల్ ఇస్మార్ట్ నైజాం థియేట్రికల్ రైట్స్ ను కొనుగోలు చేసి, డిస్ట్రిబ్యూషన్ కోసం మైత్రీ దగ్గర ఉంచారు హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి. జరుగుతున్న రచ్చ చూసి మైత్రీ మనకెందుకు అన్నట్టు ఉంది. ఈ రోజు ఫిల్మ్ ఛాంబర్ లో సినీపెద్దల సమక్షంలో జరగబోయే భేటీలో ఏదో ఒకటి ఫిక్స్ అవుతుందని ఎదురుచూస్తున్నారు. కాగా డబుల్ ఇస్మార్ట్ ను నైఙాం ఏరియాలో ఆసియన్ సురేష్ సంస్థ పంపిణీ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆసియన్ సురేష్ థియేటర్స్ లో డబుల్ ఇస్మార్ట్ వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజావార్తలు
-
RUPEE vs DOLLAR: క్షణాల్లో ఫుడ్ బుక్ చేసుకోకపోతే పస్తులుండాల్సిందే.. విదేశాల్లో దయనీయ దుస్థితిలో భారతీయ విద్యార్థులు.. కారణాలు ఇవే!
-
Bihar: 1992 నాటి కేసు.. 34 ఏళ్ల తర్వాత తీర్పు.. 84 ఏళ్ల వృద్ధుడిని దోషిగా తేల్చిన కోర్టు
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
Psychology Facts: ప్రతి పనికీ 10నిమిషాలు ముందుగా వచ్చే వ్యక్తులు గురించి షాకింగ్ ఫ్యాక్ట్.. తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు!
-
Nikhil : స్వయంభు కోసం 45 రోజుల కఠినమైన శిక్షణ తీసుకున్న హీరో నిఖిల్
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!