Double Ismart : రిలీజ్కు రెండు రోజులు.. ఎటూ తెగని డబుల్ ఇస్మార్ట్ పంచాయతీ..?
- ఆగస్టు 15న గ్రాండ్ రిలీజ్ కానున్న డబుల్ ఇస్మార్ట్
- రామ్ - పూరిల లేటెస్ట్ డబుల్ ఇస్మార్ట్
- నైజాం వ్యవహారంలో నడుస్తున్న తకరారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డబుల్ ఇస్మార్ట్ మరో రెండు రోజుల్లో రిలీజ్ కు రెడీ గా ఉంది. కానీ ఇప్పటికి లైగర్ నష్టాల వ్యవహారం ఇంకా ఎటూ తేలలేదు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అసలు ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ అవుతుందా అన్న సందేహం వస్తోంది. దాదాపు రెండు వారాల క్రితం మొదలైన పంచాయతీ డైలీ సీరియల్ లా కొనసాగుతూనే ఉంది తప్ప కొలిక్కి రావట్లేదు. లైగర్ నష్టపరిహారం విషయమై అప్పట్లో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం వెళ్తే సాఫీగా జరిగిపోయేది ఈ వ్యవహారం. కానీ ఆలా కాకుండా అనేక మెలికలు పెడుతున్నారు అనేది డిస్ట్రిబ్యూటర్ల వాదన.
Also Read: Tollywood : నిర్మాతలందరికి ఆ హీరోనే కావాలి.. అంత ప్రత్యేకత ఏంటో.. ?
Also Read
- The Paradise Rights : ప్యారడైజ్ రైట్స్ కోసం రూ. 110 కోట్లు అఫర్ చేసిన దిల్ రాజు.. పుకార్లు నమ్మొద్దన్న నిర్మాత
- Dhanush - Anirudh : ధనుష్ - అనిరుధ్ మధ్య ఫ్రెండ్షిప్ చెడిందా..?
- AP Movie Ticket Prices: టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నిర్మాతలకే పూర్తి స్వేచ్ఛ ?
- Vrushakarma OTT Deal: థియేటర్లకు ముందే 'వృషకర్మ' సంచలనం.. నాగ చైతన్య కెరీర్లోనే అతిపెద్ద డీల్ ఇదేనా?
నిన్నటి వరకు జరిగిన సెటిల్ మెంట్ ప్రకారం లైగర్ ను నైజాంలో పంపిణీ చేసిన బయ్యర్స్ కు 40 శాతం నష్టాలు భరించేందుకు ముందుకు వచ్చారు ఆ సినిమా నిర్మాతలైన ఛార్మి, పూరి జగన్నాధ్. ఇండస్ట్రీ పెద్దలు కూడా ఇందుకు ఇరువురిని ఒప్పించారు. కానీ చివరి నిమిషంలో నిర్మాతలు వెనక్కితగ్గారని తెలిసింది. పర్సెంటేజ్ ప్రకారం కాకుండా రూ. 6 కోట్లు ఇస్తామని ఛార్మి మరో మాట చెప్పినట్టు వినిపిస్తోంది. ఎవరో ఒకరు ఎక్కడో అక్కడో తగ్గితే ఈ డీల్ తెగుతుంది కానీ ఎవరికీ వారు మొండిపట్టు పట్టారు. మాకు ఇస్తామని చెప్పింది ఇవ్వకుంటే డబుల్ ఇస్మార్ట్ ను నైజాం లో బాయ్ కాట్ చేస్తామని చిన్నపాటి హెచ్చరిక జారీ చేసారు నైజాం డిస్ట్రిబ్యూటర్లు.
Also Read: Megastar: ఇంద్ర రీరిలీజ్ కష్టమేనా..? సమస్య ఏంటంటే ..?
అదే జరిగితే డబుల్ ఇస్మార్ట్ నిండా మునిగిపోతుంది. వాస్తవానికి డబుల్ ఇస్మార్ట్ నైజాం థియేట్రికల్ రైట్స్ ను కొనుగోలు చేసి, డిస్ట్రిబ్యూషన్ కోసం మైత్రీ దగ్గర ఉంచారు హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి. జరుగుతున్న రచ్చ చూసి మైత్రీ మనకెందుకు అన్నట్టు ఉంది. ఈ రోజు ఫిల్మ్ ఛాంబర్ లో సినీపెద్దల సమక్షంలో జరగబోయే భేటీలో ఏదో ఒకటి ఫిక్స్ అవుతుందని ఎదురుచూస్తున్నారు. కాగా డబుల్ ఇస్మార్ట్ ను నైఙాం ఏరియాలో ఆసియన్ సురేష్ సంస్థ పంపిణీ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆసియన్ సురేష్ థియేటర్స్ లో డబుల్ ఇస్మార్ట్ వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజావార్తలు
-
The Paradise Rights : ప్యారడైజ్ రైట్స్ కోసం రూ. 110 కోట్లు అఫర్ చేసిన దిల్ రాజు.. పుకార్లు నమ్మొద్దన్న నిర్మాత
-
Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
-
Dhanush – Anirudh : ధనుష్ – అనిరుధ్ మధ్య ఫ్రెండ్షిప్ చెడిందా..?
-
Kia Syros EV: 526KM రేంజ్, లెవెల్-2 ADAS భద్రతా ఫీచర్లతో.. కియా సైరోస్ EV భారత్ లో విడుదల
-
IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!