గాయనిగా కెరీర్ ప్రారంభించిన ఆండ్రియా ఆ తర్వాత నటిగా మారిన సంగతి తెలిసిందే. ‘యుగానికి ఒక్కడు’ ‘తడాఖా’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. కాగా ఇటీవలే ఆండ్రియాకు కరోనా సోకింది. రెండు వారాల తరువాత ఆమె కోలుకున్నారు. అయితే కరోనా బారినపడే వారికి ఆమె కొన్ని సూచనలు చేస్తున్నారు. కరోనా అనే భయం మనస్సులో నాటుకుపోతే మరింతగా కుంగదీస్తున్నారు. భయం అనే పదానికి చోటివ్వరాదని ఆమె సూచించారు. కరోనా వైరస్ గురించి వచ్చే నెగిటివ్ వార్తలను చూడటం మానుకోని కంటినిండా నిద్రపోవాలని ఆండ్రియా తెలిపారు.