ధురంధర్2 అనుకున్నట్లే ర్యాంపేజ్ వసూళ్లతో బాలీవుడ్ బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ప్రీ బుకింగ్స్ నుండే నియర్లీ 150 కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసిన ధురంధర్ ద రివేంజ్.. ఓపెనింగ్స్లో భారీ వసూళ్లను రాబట్టుకుంది. తొలి రోజే బాలీవుడ్ పేరిట ఉన్న రికార్డ్స్ చెరిపేసింది. ఈ మూవీతో రణవీర్ ఖాతాలో మరో హిట్ పడితే.. కెప్టెన్ ఆఫ్ ది షిప్ ఆదిత్య ధర్ హ్యాట్రిక్ హిట్ నమోదు చేశాడు.
ఉరితో దర్శకుడిగా ఇంట్రడ్యూసైన ఆదిత్యధర్.. ధురంధర్తో ఆల్ ఇండస్ట్రీ అటెన్షన్ గ్రాబ్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు సీక్వెల్తో అతడి ఇమేజ్ డబుల్ కాదు ట్రిపుల్ అయ్యింది. బాలీవుడ్కు దొరికిన మరో వర్త్ బుల్ దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఇక బాలీవుడ్డే కాదు.. అతడి మేకింగ్ అండ్ టేకింగ్ స్టైల్ టాలీవుడ్ కూడా ఫిదా అవుతోంది. ఇప్పటికే ధురంధర్2ని చూసిన టాలీవుడ్ సినీ ప్రముఖులు.. సినిమాను పొగడ్తలతో ముంచేస్తూ ట్వీట్ చేశారు. హ్యాట్రిక్ హిట్ తర్వాత ఆదిత్యధర్ ఎవరిని డీల్ చేయబోతున్నాడని క్యూరియాసిటీ మొదలైంది. అయితే ధురంధర్2ని ప్రశంసించిన తారక్, బన్నీతో మూవీ ఉండొచ్చన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. చెప్పాలంటే బన్నీకి ఎప్పుడో ఇమ్మోర్టల్ అశ్వత్థామ స్టోరీని నెరేట్ చేశాడు ఆదిత్య. కానీ ఎందుకో వర్కౌట్ కాలేదు. అయితే ధురంధర్ సక్సెస్ చూశాక మళ్లీ ఐకాన్ స్టార్ చర్చలు మొదలు పెట్టనున్నాడని సమాచారం. అలాగే తారక్తో కలిసి ఆదిత్యధర్ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడని రూమర్స్ ఊపందుకున్నాయి. తారక్- బన్నీ- ఆదిత్యధర్ కలిస్తే బాక్సాఫీస్ తగలబడిపోవడం ఖాయమే. అయితే ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందా లేదా అనేదే డౌట్.