కోలీవుడ్ దర్శకులు ఒక్కొక్కరుగా బీటౌన్పై దండ యాత్ర చేస్తున్నారు. అట్లీ జవాన్తో షారూఖ్ ఖాన్కు బిగ్గెస్ట్ హిట్ నివ్వడంతో సల్మాన్ను డీల్ చేసే ఛాన్స్ కొల్లగొట్టాడు. కానీ బడ్జెట్ ఇష్యూ వల్ల ఆ ప్రాజెక్ట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చెంతకు చేరింది. ఇప్పటికే ముంబయిలో సైలెంట్లీ మూవీ స్టార్టైందని సమాచారం. బాలీవుడ్, సౌత్ హీరోలతో అట్లీ కొలబరేట్ అవుతుంటే తన సత్తా చూపించేందుకు ప్రిపేర్ అవుతున్నాడు లోకేశ్ కనగరాజ్.
Also Read : NANI : మే1న నానిపై ముప్పేట దాడి.. తట్టుకోగలడా
షారూఖ్ ను అట్లీ డీల్ చేస్తే, సల్మాన్ ఖాన్ను మురుగుదాస్ డీల్ చేసాడు. దాంతో మిస్టర్ ఫర్ఫెక్షనిస్టును లైన్లో పెట్టాడు లోకేశ్ కనగరాజ్. అమీర్ ఖాన్తో ఓ పాన్ ఇండియా ఫిల్మ్ రెడీ చేస్తున్నాడట. ఇది ఓ సూపర్ హీరో మూవీగా రాబోతుందని సమాచారం. లోకేష్ రీసెంట్లీ ముంబయి వెళ్లి అమీర్తో మీట్ అయి ఓ సూపర్ హీరో స్టోరీని నానేరేట్ చేసినట్టు చెప్తున్నారు. త్వరలో ఇందుకు సంబంధించి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజెంట్ రజనీతో కూలీని కంప్లీట్ చేశాడు లోకేశ్. ఇందులో అమీర్ ఖాన్ గెస్ట్ గా నటించారు. ఆగస్టు 14న థియేటర్లలోకి రిలీజ్ కాబోతుంది కూలీ. అయితే నెక్ట్స్ ఎవరితో లోకీ సినిమా చేస్తున్నాడన్న చర్చ నడుస్తోన్నటైమ్ లో టాలీవుడ్ నుండి కోలీవుడ్ వరకు చాలా పేర్లే వినిపించాయి కానీ. చివరకు బాలీవుడ్ హీరో అమీర్ ఫిక్స్ అయ్యాడట. అమీర్ నటించిన సితారా జమీన్ పర్ జూన్ 20న థియేటర్లలోకి రాబోతుంది. ఆ తర్వాత లోకీ ప్రాజెక్ట్ పట్టాలెక్కించే ఛాన్స్ ఉన్నట్లు బజ్ నడుస్తోంది. కానీ అఫీషియల్ అనాన్స్ మెంట్ వచ్చే వరకు ఇవాన్నీ జస్ట్ రూమర్స్ గానే ఉంటాయి.