2002లో ‘జయం’ సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు నితిన్. పంపిణీదారుడు సుధాకర్ రెడ్డి కుమారుడైన నితిన్ ని హీరోగా పెట్టి చిత్రం మూవీస్ పతాకంపై దర్శకుడు తేజ స్వయంగా ‘జయం’ సినిమాను నిర్మించాడు. సదా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో గోపీచంద్ విలన్ గా నటించాడు. పట్నాయక్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా మ్యూజికల్ గా హిట్ అయి ఘన విజయం సాధించింది. జూన్ 14, 2002న ‘జయం’ విడుదలైంది. అంటే హీరోగా నితిన్ కెరీర్ కి కూడా 19 ఏళ్ళు అన్నమాట. ఈ 19 సంవత్సరాలతో దాదాపు 30 సినిమాలలో నటించాడు నితిన్. వాటిలో ‘జయం’, ‘దిల్’, ‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయిందే’, ‘ఆఆ’, ‘బీష్మ’ వంటి హిట్స్ ఉన్నాయి. ఇక పరాజయాలకు కొదవే లేదు. ప్రస్తుతం ‘మాస్ర్టో’ సినిమాతో బిజీగా ఉన్నాడు నితిన్.