టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ “సేనాపతి”గా ఓటిటి స్పేస్లోకి ఎంట్రీ ఇచ్చారు. నరేష్ అగస్త్య, జ్ఞానేశ్వరి కాండ్రేగుల, హర్షవర్ధన్, రాకేందు మౌళి కీలక పాత్రల్లో నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ లో ‘సేనాపతి’గా రాజేంద్ర ప్రసాద్ విభిన్నమైన లుక్ లో కనిపించారు. గతంలో ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘సావిత్రి’ చిత్రాలకు దర్శకత్వం వహించిన పవన్ సాదినేని ఈ వెబ్ ఫిలింకు దర్శకత్వం వహించగా ఈ చిత్రాన్ని గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుస్మిత కొణిదెల మరియు విష్ణు ప్రసాద్ నిర్మించారు. డిసెంబర్ 31న విడుదలైన ఆహా ప్లాట్ఫామ్లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా సినిమాను వీక్షించిన మెగాస్టార్ చిరంజీవి ‘సేనాపతి’పై ప్రశంసల వర్షం కురిపించారు. అనుక్షణం ఉత్కంఠభరితం, వినూత్న ప్రయత్నం అంటూ మెగా స్టార్ ‘సేనాపతి’పై చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
Read Also : మీకు, మీ డ్రైవర్ కు తేడా లేదా ?… పేర్ని నానికి ఆర్జీవీ కౌంటర్