“ఆచార్య” పోస్ట్ పోన్… అసలు కారణం ఇదే !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం “ఆచార్య” చిత్రం ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని మెగా ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే సినిమా విడుదల తేదీ విషయంలో మాత్రం ఇంకా సస్పెన్స్ నెలకొంది. ముందుగా ఈ సినిమా దసరా బరిలో నిలుస్తుందని అన్నారు. ఆ తరువాత సంక్రాంతి అని రూమర్స్ మొదలయ్యాయి. కానీ ఇప్పటికే సంక్రాంతికి ఇద్దరు పెద్ద సినిమాలు రేసులో ఉన్నాయి. మరి ‘ఆచార్య’ కూడా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చే సాహసం చేస్తాడా ? అంటూ పలు అనుమానాలు లేవనెత్తుతున్నారు ప్రేక్షకులు. అంతేకాదు ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ఇంకా ఎందుకు ప్రకటించడం లేదు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.
Read Also : కనికరించండి… ఏపీ సీఎంకు చిరు రిక్వెస్ట్
Also Read
- Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
- Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
- Krrish 4 : 'క్రిష్ 4' ఆలస్యానికి కారణం అదే?
- LGBT - A Legal Battle: 'ఎల్జీబీటీ'ల ఆక్రందనలపై సినిమా.. జూన్ 19న విడుదల!
నిన్న రాత్రి “లవ్ స్టోరీ” ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి సినిమా ఇండస్ట్రీలోని సమస్యల గురించి మాట్లాడుతూరెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దయచేసికనికరించి సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలంటూ కోరారు. ఈ నేపథ్యంలోనే ‘ఆచార్య’ సినిమా ఇంకా ఎందుకు విడుదల కాలేదు అనే విషయాన్ని వెల్లడించారు. “సినిమాలు పూరయ్యి కూడా విడుదల చేయాలా వద్దా అనే సందిగ్ధంలో పడిపోయాము. ‘ఆచార్య’ విషయానికొస్తే… సినిమా పూరైయిపోయింది. కానీ ఎప్పుడు రిలీజ్ చేయాలి ? ఎలా రిలీజ్ చేయాలి ? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం టార్గెట్ ను రీచ్ అవ్వగలమా ? రిలీజ్ చేస్తే రెవెన్యూ వస్తుందా రాదా? ఇప్పుడిప్పుడే జనం థియేటర్లకు వస్తారా అనే భయం పోయి నెమ్మదిగా ధైర్యం వస్తోంది. ఇలాంటి యంగ్ స్టర్స్ ‘లవ్ స్టోరీ’ సినిమా చేస్తే జనాలు చూడడానికి ఖచ్చితంగా వస్తారు. అయితే సినిమా విడుదలయ్యాక రెవెన్యూ వస్తుందా ? అనేది మాత్రం మనము ఆలోచించాలి. ఆ ధైర్యం, వెసులుబాటు ప్రభుత్వాలు మనకు ఇవ్వాలి. మా కోరికను మీకు విన్నవించాము. దానికి సానుకూలంగా స్పందించి ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యను పరిష్కరిస్తారని కోరుకుంటున్నాము” అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఏపీలో టిక్కెట్టు ధర లేనందుకే “ఆచార్య” రిలీజ్ కు వెనకడుగు వేస్తున్నాడని స్పష్టం అయ్యింది.
తాజావార్తలు
-
Gold ETF Outflows 2026: గోల్డ్ ఈటీఎఫ్లకు గుడ్బై చెబుతున్న ఇన్వెస్టర్లు.. కారణాలివే
-
Astrology: కెరీర్లో నెమ్మదిగా ఎదిగినా.. చివరికి పెద్ద స్థాయికి చేరుకునే 3 రాశులు ఇవేనా?
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!