బిగ్ అనౌన్స్.. చిరుతో రాజమౌళి.. మరి త్రివిక్రమ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ఆచార్యకు రంగం సిద్దమైంది. మరో ఐదారు రోజుల్లో థియేటర్లోకి రాబోతోంది ఆచార్య. ఇప్పటికే ఈ రోజు సాయంత్రం జరగబోయే ప్రి రిలీజ్ ఈవెంట్తో హల్ చల్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఇక ఈ ఈవెంట్కు చీప్ గెస్ట్గా ఎవరు రాబోతున్నారనేది సస్పెన్స్గా మారింది. ముందు నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చీప్ గెస్ట్గా రాబోతున్నారని వినిపిస్తోంది. ఇక ఆ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళితో పాటు మహేష్ బాబు, ఎన్టీఆర్ రాబోతున్నారని ప్రచారంలోకి వచ్చింది. అయినా ఇప్పటి వరకు ఈ విషయంలో క్లారిటీ లేదు. స్టార్ హీరోల సంగతేమోగానీ.. రాజమౌళి రావడం పక్కా అని తెలుస్తోంది. అంతేకాదు.. ఆచార్య వేదిక పై బిగ్ అనౌన్స్మెంట్ ఇవ్వబోతున్నారనే వార్త వైరల్గా మారింది. రాజమౌళి దర్శకత్వంలో మెగాస్టార్ ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నారని.. ఆ కొత్త సినిమాను ఆచార్య ఈవెంట్లో ప్రకటించబోతున్నట్టు టాక్. అయితే ఈ ప్రాజెక్టు క్రేజీగానే ఉన్నప్పటికీ.. అసలు కార్యరూపం దాలుస్తుందా అనేది సందేహంగా మారింది.
Watch Acharya Pre release Event Live :
Also Read
- Nandini Reddy: "నా పక్కన లేనిది మొగుడు ఒక్కడే.! మిగతావన్నీ ఉన్నాయి.." పెళ్లి, ఒంటరితనంపై ఓపెన్ అయిన లేడి డైరెక్టర్.!
- Nandini Reddy: "అన్నం పెట్టే చెయ్యిని నరుకుతారా..?" రెమ్యునరేషన్లు పెంచే దర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్!
- Jailer 2 Release: హుకుం.. రజనీకాంత్ ఫ్యాన్స్కు పండుగ.. ‘జైలర్ 2’ రిలీజ్ డేట్ కన్ఫామ్.!
- Dhruv Vikram: మైత్రీ మూవీ మేకర్స్ 4వ తమిళ సినిమాలో హీరోగా ధృవ్ విక్రమ్
ఎందుకంటే గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా ప్రకటించారు చిరంజీవి. రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ ఈవెంట్లో.. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు మెగాస్టార్. ఆ వేదికపై త్రివిక్రమ్ చేయి పట్టుకొని మరీ ఎంతో ఎగ్జైటింగ్గా ప్రకటన చేశారు చిరు. త్రివిక్రమ్ కూడా ఓకే అన్నట్టు సిగ్నల్ ఇచ్చాడు. దాంతో ఈ క్రేజీ కాంబినేషన్ ఫిక్స్ అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఆ ప్రాజెక్టుపై ఎలాంటి అప్ డేట్ లేదు. త్రివిక్రమ్ కూడా ఈ ప్రాజెక్ట్ పై మాట దాటేస్తూ వస్తున్నాడు.. కానీ ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఇప్పుడు రాజమౌళితో కూడా.. ఆచార్య వేదికపై చిరు కొత్త సినిమా అనౌన్స్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్లాగే రాజమౌళి ప్రాజెక్ట్ కూడా ప్రకటనకే పరిమితం కానుందా.. అనే సందేహాలు వెలువడుతున్నాయి. పైగా రాజమౌళితో సినిమా అంటే ఏళ్లకేళ్లు టైం కేటాయించాల్సిందే. ట్రిపుల్ ఆర్ తర్వాత మహేష్తో ఓ సినిమా చేయబోతున్నారు జక్కన్న. ఇక చిరంజీవి ఇప్పటికే నాలుగు సినిమాలను లైన్లో పెట్టారు. దాంతో ఈ కాంబినేషన్ ఈవెంట్ ఎగ్జైట్మెంట్ కోసమేనని.. ఇప్పట్లో తెరపైకి రావడం కష్టమేనని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అందుకు ఉదాహరణగా చిరు-త్రివిక్రమ్ అనౌన్స్మెంటేనని చెప్పొచ్చు. అయితే అసలు ఈ క్రేజీ కాంబినేషన్ ప్రకటన ఉంటుందో లేదో.. మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!