బిగ్ అనౌన్స్.. చిరుతో రాజమౌళి.. మరి త్రివిక్రమ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ఆచార్యకు రంగం సిద్దమైంది. మరో ఐదారు రోజుల్లో థియేటర్లోకి రాబోతోంది ఆచార్య. ఇప్పటికే ఈ రోజు సాయంత్రం జరగబోయే ప్రి రిలీజ్ ఈవెంట్తో హల్ చల్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఇక ఈ ఈవెంట్కు చీప్ గెస్ట్గా ఎవరు రాబోతున్నారనేది సస్పెన్స్గా మారింది. ముందు నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చీప్ గెస్ట్గా రాబోతున్నారని వినిపిస్తోంది. ఇక ఆ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళితో పాటు మహేష్ బాబు, ఎన్టీఆర్ రాబోతున్నారని ప్రచారంలోకి వచ్చింది. అయినా ఇప్పటి వరకు ఈ విషయంలో క్లారిటీ లేదు. స్టార్ హీరోల సంగతేమోగానీ.. రాజమౌళి రావడం పక్కా అని తెలుస్తోంది. అంతేకాదు.. ఆచార్య వేదిక పై బిగ్ అనౌన్స్మెంట్ ఇవ్వబోతున్నారనే వార్త వైరల్గా మారింది. రాజమౌళి దర్శకత్వంలో మెగాస్టార్ ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నారని.. ఆ కొత్త సినిమాను ఆచార్య ఈవెంట్లో ప్రకటించబోతున్నట్టు టాక్. అయితే ఈ ప్రాజెక్టు క్రేజీగానే ఉన్నప్పటికీ.. అసలు కార్యరూపం దాలుస్తుందా అనేది సందేహంగా మారింది.
Watch Acharya Pre release Event Live :
Also Read
- Director VV Vinayak: వడ్డే నవీన్ సినిమా వల్లే ఎన్టీఆర్తో పరిచయం.. 'ఆది' మూవీ జ్ఞాపకాలను పంచుకున్న డైరెక్టర్!
- Rao Bahadur Teaser: లాస్ట్లో ఆ డైలాగ్ నెక్స్ట్ లెవెల్.. సత్యదేవ్ ‘రావు బహదూర్’ టీజర్ చూశారా!
- Gopichand34: గోపీచంద్ సినిమాతో మెగా ఫోన్ పట్టుకున్న యాక్షన్ కొరియోగ్రాఫర్! మూవీ టైటిల్ ఇదే..
- VenkyAnil5: నువ్వు మామూలోడివి కాదయ్య అనిల్.. మ్యూజిక్ డైరెక్టర్కు క్రేజీ వెల్కమ్! వీడియో చూశారా?
ఎందుకంటే గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా ప్రకటించారు చిరంజీవి. రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ ఈవెంట్లో.. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు మెగాస్టార్. ఆ వేదికపై త్రివిక్రమ్ చేయి పట్టుకొని మరీ ఎంతో ఎగ్జైటింగ్గా ప్రకటన చేశారు చిరు. త్రివిక్రమ్ కూడా ఓకే అన్నట్టు సిగ్నల్ ఇచ్చాడు. దాంతో ఈ క్రేజీ కాంబినేషన్ ఫిక్స్ అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఆ ప్రాజెక్టుపై ఎలాంటి అప్ డేట్ లేదు. త్రివిక్రమ్ కూడా ఈ ప్రాజెక్ట్ పై మాట దాటేస్తూ వస్తున్నాడు.. కానీ ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఇప్పుడు రాజమౌళితో కూడా.. ఆచార్య వేదికపై చిరు కొత్త సినిమా అనౌన్స్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్లాగే రాజమౌళి ప్రాజెక్ట్ కూడా ప్రకటనకే పరిమితం కానుందా.. అనే సందేహాలు వెలువడుతున్నాయి. పైగా రాజమౌళితో సినిమా అంటే ఏళ్లకేళ్లు టైం కేటాయించాల్సిందే. ట్రిపుల్ ఆర్ తర్వాత మహేష్తో ఓ సినిమా చేయబోతున్నారు జక్కన్న. ఇక చిరంజీవి ఇప్పటికే నాలుగు సినిమాలను లైన్లో పెట్టారు. దాంతో ఈ కాంబినేషన్ ఈవెంట్ ఎగ్జైట్మెంట్ కోసమేనని.. ఇప్పట్లో తెరపైకి రావడం కష్టమేనని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అందుకు ఉదాహరణగా చిరు-త్రివిక్రమ్ అనౌన్స్మెంటేనని చెప్పొచ్చు. అయితే అసలు ఈ క్రేజీ కాంబినేషన్ ప్రకటన ఉంటుందో లేదో.. మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
-
Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్గా మారిన తండ్రి
-
TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
-
Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
-
Netanyahu: నేను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వస్త్రంగా మారదు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!