aravind swamy : విలక్షణమైన అందగాడు … అరవింద్ స్వామి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆరడగుల అందం, పసిమిఛాయ, చూడగానే ఆకట్టుకొనే రూపం, విలక్షణమైన చిరునవ్వు అరవింద్ స్వామి సొంతం. తెరపై అరవింద్ స్వామిని చూడగానే ఎందరో ముద్దుగుమ్మలు మనసు పారేసుకున్నారు. శ్రీదేవి లాంటి అందగత్తె సైతం ఈ అరవిందుని చేయి అందుకోవాలని ఒకానొక సమయంలో ఉవ్విళ్ళూరింది. దీనిని బట్టే అప్పట్లో అరవింద స్వామి క్రేజ్ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం తన వయసుకు తగ్గ పాత్రలు పోషిస్తూ సాగుతున్నారు అరవింద్ స్వామి.
అరవింద్ స్వామి 1970 జూన్ 18న చెన్నైలో జన్మించారు. ఆయన తండ్రి వి.డి.స్వామి తమిళనాట పేరు మోసిన వ్యాపారవేత్త. తల్లి భరతనాట్యంలో ఎంతో ప్రావీణ్యం సంపాదించిన వసంత. మద్రాసు లయోలా కాలేజ్ లో బి.కామ్, చదివి పై చదువుల కోసం అమెరికా వెళ్ళిన అరవింద్ స్వామి అక్కడ కొన్ని యాడ్ ఫిలిమ్స్ లో నటించారు. ఆ యాడ్స్ లో అరవింద్ ను చూసిన మణిరత్నం తన ‘దళపతి’లో ఓ కీలక పాత్రకు ఆయనను ఎంచుకున్నారు. ఓ వైపు రజనీకాంత్, మరోవైపు మమ్ముట్టి మధ్యలో అరవింద్ అయినా ‘దళపతి’లో నటునిగా మార్కులు సంపాదించారు. ఆ పై మణిరత్నం తెరకెక్కించిన ‘రోజా’తో అరవింద్ హీరో అయిపోయారు. ఈ సినిమా అనువాదమై తెలుగునాట సైతం అలరించింది. అలాగే హిందీవారినీ ఆకట్టుకుంది. ఆ ఒక్క సినిమాతోనే అరవింద్ నటునిగా, ఎ.ఆర్. రహమాన్ సంగీత దర్శకునిగా ఎంతో పాపులర్ అయిపోయారు. మణిరత్నం రూపొందించిన ‘బొంబాయి’ సినిమా సైతం తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విశేషంగా మురిపించింది. ఈ సినిమా తరువాత అరవింద్ కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. అప్పుడే శ్రీదేవి మనసు కూడా అరవింద్ వైపు సాగింది. ప్రముఖ మళయాళ దర్శకులు భరతన్ రూపొందించిన ‘దేవరాగం’లో శ్రీదేవి, అరవింద్ కలసి నటించారు. ఆ సినిమా తరువాత వారిద్దరూ పెళ్ళి చేసుకుంటారనీ విశేషంగా వినిపించింది. అప్పటికే అరవింద్ ఓ ఇంటివాడు. అయినా సినిమా రంగంలో ఇలాంటి పుకార్లు షికార్లు చేయడం సహజమేగా!
Also Read
- Mrunal Thakur-Yashasvi Jaiswal Dating: యశస్వితో రిలేషన్షిప్.. మృణాల్ ఠాకూర్ కామెంట్స్ వైరల్.. నిజమెంత?
- Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’...
- Adnan Sami: మూడు పెళ్ళిళ్ళు విఫలమైనా.. పాకిస్తాన్ జనరల్స్ నాపాటకి స్టెప్పులేస్తారు.. అద్నాన్ సమి జీవితంలో ఈ మలుపులేంటి?
- Trivikram: త్రివిక్రమ్తో మా బంధం అలాంటిది.. ఎలాంటి అగ్రిమెంట్లు లేవు: నాగవంశీ
తెలుగులో అరవింద్ స్వామి నేరుగా నటించిన చిత్రం ‘మౌనం’. ఈ చిత్రాన్ని ‘అంకురం’ ఫేమ్ సి.ఉమామహేశ్వరరావు తెరకెక్కించారు. సినిమా ఆశించిన స్థాయిలో అలరించలేక పోయింది. ఆ పై దాదాపు 21 ఏళ్ళ తరువాత రామ్ చరణ్ హీరోగా రూపొందిన’ ధ్రువ’లోనే మళ్ళీ అరవింద్ తెలుగులో నటించారు. ఈ సినిమాలో విలన్ గా అరవింద్ విలక్షణమైన అభినయం జనాన్ని ఆకట్టుకుంది. ప్రస్తుతం “నరగాసురన్, కల్లపార్త్, సతురంగ వేట్టై -2, వనంగముడి, రెండగమ” చిత్రాలలో కథానాయక పాత్రలోనే కనిపించబోతున్నారు అరవింద్. ఈ సినిమాలు తెలుగులోనూ అనువాదమయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రాలతో అరవింద్ ఏ తీరున జనాన్ని మెప్పిస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Hyderabad Traffic : వాహనదారులకు బిగ్ అలర్ట్.. రేపు ఈ రూట్లలో నో ఎంట్రీ.!
-
NDA: డీలిమిటేషన్కు బాదల్ మద్దతు.. బీజేపీ-అకాలీదళ్ పొత్తుకు బీజం..
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
UPI ఛార్జీలపై PhonePe CEO కీలక ప్రకటన.. వినియోగదారులకు గుడ్ న్యూస్!
-
India: చైనా, అమెరికాలకు పోటీగా భారత్.. ఫ్రాన్స్తో కలిసి 6th జనరేషన్ ఫైటర్ జెట్!
ట్రెండింగ్
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!