వరద బాధితులకు అల్లు అర్జున్ భారీ విరాళం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్లో గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షానికి చెరువులు, కట్టలు తెగిపోయి పలు ప్రాంతాలు నీట మునిగాయి. వాహనాలు కొట్టుకుపోయాయి. ఈ వర్షాలు ప్రజలు జీవనోపాధిని కోల్పోయేలా చేశాయి. కొంతమంది అయితే ఏకంగా గూడు, కూడును కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పోలీసులు, విపత్తు ప్రతిస్పందన దళం, మున్సిపాలిటీ కార్మికులు సహాయక చర్యల్లో 24 గంటలు పని చేస్తున్నారు.
Read Also : మహేష్ బాబుకు సర్జరీ… “సర్కారు వారి పాట”కు బ్రేక్ ?
Also Read
వర్షాల కారణంగా ఏపీలో అనేక మంది జీవితాలు దెబ్బతిన్నాయి. ఈ కష్ట సమయాల్లో ప్రజలకు సహాయం చేయడానికి సినీ సెలెబ్రిటీలు ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్ ఆంధ్రాలో వచ్చిన భారీ వరదల కారణంగా ప్రజలు కష్టాల పాలవ్వడం తన మనసుని కలచి వేసిందని, వాళ్లకు తన తరపున సహాయం అందించడానికి ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కి 25 లక్షలు విరాళంగా ఇస్తున్నట్టుగా ప్రకటించారు. ఇక నిన్న చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్ వంటి ప్రముఖులు వరుసగా 25 లక్షల రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్కి విరాళంగా అందించారు. ఆంధ్రప్రదేశ్లో వరద సహాయక చర్యల కోసం భారీ మొత్తాన్ని ప్రకటించిన మొదటి సెలబ్రిటీ జూనియర్ ఎన్టీఆర్. తర్వాత మహేష్, చిరంజీవి ఈ విషయంపై స్పందించారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..