యంగ్హీరో అడివి శేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విలన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో ఆ తరువాత విభిన్నమైన కథలను ఎంచుకొని ఆనతికాలంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన మేజర్ చిత్తరంలో హీరో గా నటిస్తున్నాడు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముంబై తాజ్ హోటల్ మారణహోమంలో ప్రాణాలను వదిలిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథగా ఈ సినిమాను తెరకెకెక్కించాడు దర్శకుడు శశికిరణ్ తిక్కా. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా జూన్ 3 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ వేగాన్ని పెంచేసిన చిత్రబృందం వరుస ఇంటర్వ్యూలతో బిజీగా మారిపోయింది. ఇక తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో అడివి శేష్, పవన్ కళ్యాణ్ వారసుడు అకీరాతో తనకున్న అనుభందం గురించి చెప్పుకొచ్చాడు.
పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా తో మీరేమైనా మల్టీస్టారర్ చేసే అవకాశముందా..? అన్న యాంకర్ ప్రశ్నకు శేష్ మాట్లాడుతూ ” లేదండీ.. మేము ఇద్దరం మంచి ఫ్రెండ్స్.. వారం.. వారం కలుస్తూ ఉంటాం. అకీరా ఇండస్ట్రీకి వస్తాడో లేదో చెప్పలేను.. తనకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం.. తాను పియానో పై వాయించిన రికార్డ్స్ ను వింటాను.. చాలా బాగా వాయిస్తాడు.. అప్పుడప్పుడు తాను కొత్తగా రికార్డ్ చేసిన ట్యూన్స్ ను నాకు పంపిస్తాడు.. వాటిని వింటూ నిద్రపోతాను. ఇక పవన్ కళ్యాణ్ గారంటే పిచ్చి అని చెప్పను కానీ అదొక గౌరవం.. మనసులో నుంచి వచ్చే మర్యాదపూర్వకమైన గౌరవం.. నేను ఆయనతో మాట్లాడింది కూడా ఒక నాలుగైదు సార్లు.. ఎప్పుడైనా బర్త్ డే విషెస్.. అలాంటివి.. అయితే అకీరాతో నేనెప్పుడూ క్లోజ్ గా ఉంటాను” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.