Brahmanandam: సెల్ఫోన్లు పక్కన పెట్టండి ప్లీజ్.. మాట్లాడొద్దంటే వెళ్ళిపోతా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Brahmanandam: విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో ప్రముఖ సినీ నటుడు, హాస్యనటుడు బ్రహ్మానందం అసహనానికి గురయ్యారు. ఆయన ఎన్టీఆర్ గురించి మాట్లాడుతుండగా వేదికపై కొందరు సెల్ ఫోన్లు చూసుకుంటూ కూర్చున్నారు. దీంతో అసహనానికి గురైన బ్రహ్మానందం.. సెల్ ఫోన్లు పక్కన పెట్టమని అభ్యర్థించాడు. అయినా కూడా కొందరు సెల్ఫోన్లో మాట్లాడుతూ, సెల్ ఫోన్ చూస్తూ కూర్చున్నారు. దీంతో బ్రహ్మీ సిరియస్ అయ్యారు. మాట్లాడుతున్నారని, దయచేసి ఆపాలని రెండు చేతులు జోడించి దండం పెట్టారు. మాట్లాడొద్దు అంటే వెళ్లిపోతాను అంటూ అసహనానికి గురయ్యాడు బ్రహ్మి.
నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా గురువారం తుమ్మలపల్లిలోని వారి క్షేత్రయ కళాక్షేత్రంలో ఎక్సరే సాహిత్య సాంస్కృతిక సంస్థాన్ ఆధ్వర్యంలో బ్రహ్మానందంకు ఎన్టీఆర్ శత జయంతి జయంతి ప్రదాన పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బ్రహ్మానందాన్ని సత్కరించి ఆయన చేతికి బంగారు కంకణం అందజేశారు. ఓ అభిమాని కిరీటాన్ని బహూకరించాడు. అయితే కార్యక్రమంలో భాగంగా బ్రహ్మానందం మాట్లాడుతూ ఎన్టీఆర్ గురించి కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఈ సమయంలో వేదికపై గందరగోళ వాతావరణం నెలకొంది. వేదిక పై అందరూ గోల గోల చేస్తూ సెల్ ఫోన్లు చూస్తూ బ్రహ్మీని పట్టించుకోవడం మానేశారు. అంతేకాకుండా.. ఆయన ఎన్టీఆర్ గురించి చెబుతున్న మాటలను సైతం పక్కన పెట్టి కొందరు ప్రముఖులు ఎవరికి వారు సెల్ ఫోన్లు చూస్తూ కూర్చున్నారు. చివరకు బ్రహ్మానందం సెల్ఫోన్ను ఒకరి నుంచి లాక్కున్నాడు.
Also Read
- Save The Tigers 3: జూన్ 19 నుంచి సరికొత్త ట్విస్టులతో ‘సేవ్ ది టైగర్స్ 3’
- Modi - Trump: ప్రపంచ దేశాల కళ్లు ఫ్రాన్స్పైనే.. జీ7 సదస్సులో చేతులు కలిపిన మోడీ - ట్రంప్! వాషింగ్టన్ టు ఢిల్లీ నయా జోష్..
- Arnold Vosloo: టాలీవుడ్లో ‘ది మమ్మీ’ విలన్ రచ్చ.. విజయ్ దేవరకొండ ‘రణబాలి’లో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ!
- Bloody Romeo: న్యాచురల్ స్టార్ నెక్స్ట్ లెవెల్ మేకోవర్.. లండన్లో ‘బ్లడీ రోమియో’ లొకేషన్ వేట మొదలుపెట్టిన సుజీత్!
ఆ తర్వాత ఎన్టీఆర్ గురించి బ్రహ్మానందం మాట్లాడారు. రాముడు, భీముడు, కృష్ణుడు ఏ పాత్రలో నటించినా, వారి వారి పాత్రలను కళ్లకు కట్టినట్లు చూపించేవారు. రాముడు, కృష్ణుడు లాంటి దేవుళ్లు నిజంగా ఇలాగే ఉంటారంటూ బ్రహ్మానందం తన నటనను మెచ్చుకున్నారు. ప్రపంచంలో తెలుగు జాతి ఉన్నంత కాలం ఎన్టీఆర్ పేరు మారుమోగుతుందని అన్నారు. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఆయన స్థానం సజీవంగా ఉందన్నారు. తన శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ అవార్డు రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. కాగా, ఎక్స్ రే కంపెనీ అధ్యక్షుడు కొల్లూరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు, మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా 35 మంది వివిధ రంగాల్లో ప్రముఖులను సత్కరించి అవార్డులు అందజేశారు.
తాజావార్తలు
-
Off The Record: మెట్రో కేంద్రంగా కాంగ్రెస్, బీజేపీ పొలిటికల్ వార్..
-
Honeymoon Mystery: హనీమూన్ మిస్టరీ.. ముస్సోరీలో విశాఖ మహిళ మృతి..
-
Dehradun: నేలరాలిన విద్యాకుసుమం.. 12వ తరగతి టాపర్ ఆత్మహత్య
-
Off The Record: గాంధీ భవన్ను తాకుతున్న పాత-కొత్త గొడవలు..
-
Mumbai: కనిపించని రుతుపవనాల జాడ.. ముంబైలో నీటి సరఫరాపై ఆంక్షలు.. జరిమానా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?