Brahmanandam: సెల్ఫోన్లు పక్కన పెట్టండి ప్లీజ్.. మాట్లాడొద్దంటే వెళ్ళిపోతా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Brahmanandam: విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో ప్రముఖ సినీ నటుడు, హాస్యనటుడు బ్రహ్మానందం అసహనానికి గురయ్యారు. ఆయన ఎన్టీఆర్ గురించి మాట్లాడుతుండగా వేదికపై కొందరు సెల్ ఫోన్లు చూసుకుంటూ కూర్చున్నారు. దీంతో అసహనానికి గురైన బ్రహ్మానందం.. సెల్ ఫోన్లు పక్కన పెట్టమని అభ్యర్థించాడు. అయినా కూడా కొందరు సెల్ఫోన్లో మాట్లాడుతూ, సెల్ ఫోన్ చూస్తూ కూర్చున్నారు. దీంతో బ్రహ్మీ సిరియస్ అయ్యారు. మాట్లాడుతున్నారని, దయచేసి ఆపాలని రెండు చేతులు జోడించి దండం పెట్టారు. మాట్లాడొద్దు అంటే వెళ్లిపోతాను అంటూ అసహనానికి గురయ్యాడు బ్రహ్మి.
నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా గురువారం తుమ్మలపల్లిలోని వారి క్షేత్రయ కళాక్షేత్రంలో ఎక్సరే సాహిత్య సాంస్కృతిక సంస్థాన్ ఆధ్వర్యంలో బ్రహ్మానందంకు ఎన్టీఆర్ శత జయంతి జయంతి ప్రదాన పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బ్రహ్మానందాన్ని సత్కరించి ఆయన చేతికి బంగారు కంకణం అందజేశారు. ఓ అభిమాని కిరీటాన్ని బహూకరించాడు. అయితే కార్యక్రమంలో భాగంగా బ్రహ్మానందం మాట్లాడుతూ ఎన్టీఆర్ గురించి కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఈ సమయంలో వేదికపై గందరగోళ వాతావరణం నెలకొంది. వేదిక పై అందరూ గోల గోల చేస్తూ సెల్ ఫోన్లు చూస్తూ బ్రహ్మీని పట్టించుకోవడం మానేశారు. అంతేకాకుండా.. ఆయన ఎన్టీఆర్ గురించి చెబుతున్న మాటలను సైతం పక్కన పెట్టి కొందరు ప్రముఖులు ఎవరికి వారు సెల్ ఫోన్లు చూస్తూ కూర్చున్నారు. చివరకు బ్రహ్మానందం సెల్ఫోన్ను ఒకరి నుంచి లాక్కున్నాడు.
Also Read
- Nani: నా కెరీర్లోనే అత్యంత కష్టమైన సినిమా ఇదే.. జడల బరువుపై నాని సంచలన వ్యాఖ్యలు!
- Nani: మా డైరెక్టర్ ఎవరినీ కొట్టలేదు.. నాని కీలక వ్యాఖ్యలు
- The Paradise: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి నాని ‘ది ప్యారడైజ్’!
- Hanuman Ansh: త్రివిక్రమ్ చేతుల మీదుగా తెలుగులోకి 'హనుమాన్ అంశ్' - సెప్టెంబర్ 18న గ్రాండ్ రిలీజ్!
ఆ తర్వాత ఎన్టీఆర్ గురించి బ్రహ్మానందం మాట్లాడారు. రాముడు, భీముడు, కృష్ణుడు ఏ పాత్రలో నటించినా, వారి వారి పాత్రలను కళ్లకు కట్టినట్లు చూపించేవారు. రాముడు, కృష్ణుడు లాంటి దేవుళ్లు నిజంగా ఇలాగే ఉంటారంటూ బ్రహ్మానందం తన నటనను మెచ్చుకున్నారు. ప్రపంచంలో తెలుగు జాతి ఉన్నంత కాలం ఎన్టీఆర్ పేరు మారుమోగుతుందని అన్నారు. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఆయన స్థానం సజీవంగా ఉందన్నారు. తన శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ అవార్డు రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. కాగా, ఎక్స్ రే కంపెనీ అధ్యక్షుడు కొల్లూరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు, మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా 35 మంది వివిధ రంగాల్లో ప్రముఖులను సత్కరించి అవార్డులు అందజేశారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?