Brahmanandam: సెల్ఫోన్లు పక్కన పెట్టండి ప్లీజ్.. మాట్లాడొద్దంటే వెళ్ళిపోతా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Brahmanandam: విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో ప్రముఖ సినీ నటుడు, హాస్యనటుడు బ్రహ్మానందం అసహనానికి గురయ్యారు. ఆయన ఎన్టీఆర్ గురించి మాట్లాడుతుండగా వేదికపై కొందరు సెల్ ఫోన్లు చూసుకుంటూ కూర్చున్నారు. దీంతో అసహనానికి గురైన బ్రహ్మానందం.. సెల్ ఫోన్లు పక్కన పెట్టమని అభ్యర్థించాడు. అయినా కూడా కొందరు సెల్ఫోన్లో మాట్లాడుతూ, సెల్ ఫోన్ చూస్తూ కూర్చున్నారు. దీంతో బ్రహ్మీ సిరియస్ అయ్యారు. మాట్లాడుతున్నారని, దయచేసి ఆపాలని రెండు చేతులు జోడించి దండం పెట్టారు. మాట్లాడొద్దు అంటే వెళ్లిపోతాను అంటూ అసహనానికి గురయ్యాడు బ్రహ్మి.
నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా గురువారం తుమ్మలపల్లిలోని వారి క్షేత్రయ కళాక్షేత్రంలో ఎక్సరే సాహిత్య సాంస్కృతిక సంస్థాన్ ఆధ్వర్యంలో బ్రహ్మానందంకు ఎన్టీఆర్ శత జయంతి జయంతి ప్రదాన పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బ్రహ్మానందాన్ని సత్కరించి ఆయన చేతికి బంగారు కంకణం అందజేశారు. ఓ అభిమాని కిరీటాన్ని బహూకరించాడు. అయితే కార్యక్రమంలో భాగంగా బ్రహ్మానందం మాట్లాడుతూ ఎన్టీఆర్ గురించి కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఈ సమయంలో వేదికపై గందరగోళ వాతావరణం నెలకొంది. వేదిక పై అందరూ గోల గోల చేస్తూ సెల్ ఫోన్లు చూస్తూ బ్రహ్మీని పట్టించుకోవడం మానేశారు. అంతేకాకుండా.. ఆయన ఎన్టీఆర్ గురించి చెబుతున్న మాటలను సైతం పక్కన పెట్టి కొందరు ప్రముఖులు ఎవరికి వారు సెల్ ఫోన్లు చూస్తూ కూర్చున్నారు. చివరకు బ్రహ్మానందం సెల్ఫోన్ను ఒకరి నుంచి లాక్కున్నాడు.
Also Read
- Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం తొలి వెబ్ సిరీస్.. షూటింగ్ పూర్తి, రిలీజ్ కోసం వెయిటింగ్
- Srinivasa Mangapuram: జూలై 30న హిట్ కొడుతున్నాం.. కాన్ఫిడెంట్గా 'శ్రీనివాస మంగాపురం' టీమ్.. జయకృష్ణ నటనపై ప్రశంసలు
- Newtons 3rd Law: పోలీస్ ఆఫీసర్గా సుమంత్.. 'న్యూటన్స్ థర్డ్ లా' ట్రైలర్లో అదిరిపోయిన ట్విస్టులు
- Nara Rohith: వరుస ఫ్లాపుల తర్వాత నారా రోహిత్ స్ట్రాంగ్ కమ్బ్యాక్.. లైనప్ చూస్తే షాకే!
ఆ తర్వాత ఎన్టీఆర్ గురించి బ్రహ్మానందం మాట్లాడారు. రాముడు, భీముడు, కృష్ణుడు ఏ పాత్రలో నటించినా, వారి వారి పాత్రలను కళ్లకు కట్టినట్లు చూపించేవారు. రాముడు, కృష్ణుడు లాంటి దేవుళ్లు నిజంగా ఇలాగే ఉంటారంటూ బ్రహ్మానందం తన నటనను మెచ్చుకున్నారు. ప్రపంచంలో తెలుగు జాతి ఉన్నంత కాలం ఎన్టీఆర్ పేరు మారుమోగుతుందని అన్నారు. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఆయన స్థానం సజీవంగా ఉందన్నారు. తన శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ అవార్డు రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. కాగా, ఎక్స్ రే కంపెనీ అధ్యక్షుడు కొల్లూరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు, మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా 35 మంది వివిధ రంగాల్లో ప్రముఖులను సత్కరించి అవార్డులు అందజేశారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : యువతే గేమ్చేంజర్.. మోడీపై రేవంత్ విమర్శలు
-
Sikandar Raza: ‘త్వరలోనే కొన్ని పరుగులు కొనుక్కుంటా’.. ఓటమిపై సికందర్ రజా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Adilabad Airfield : ఆదిలాబాద్కు ఎయిర్పోర్ట్ బూస్ట్.. ₹2,278 కోట్ల మెగా ప్రాజెక్ట్
-
Shreyas Iyer: ‘నా ఫస్ట్ విన్ క్రెడిట్ అతనికే’.. అయ్యర్ నోటి నుంచి ఊహించని మాట..
-
Abhijeet Dipke: టైమ్ కావాలి, పంజాబ్ పేపర్ లీక్పై స్పందిస్తాము..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!