Brahmanandam: సెల్ఫోన్లు పక్కన పెట్టండి ప్లీజ్.. మాట్లాడొద్దంటే వెళ్ళిపోతా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Brahmanandam: విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో ప్రముఖ సినీ నటుడు, హాస్యనటుడు బ్రహ్మానందం అసహనానికి గురయ్యారు. ఆయన ఎన్టీఆర్ గురించి మాట్లాడుతుండగా వేదికపై కొందరు సెల్ ఫోన్లు చూసుకుంటూ కూర్చున్నారు. దీంతో అసహనానికి గురైన బ్రహ్మానందం.. సెల్ ఫోన్లు పక్కన పెట్టమని అభ్యర్థించాడు. అయినా కూడా కొందరు సెల్ఫోన్లో మాట్లాడుతూ, సెల్ ఫోన్ చూస్తూ కూర్చున్నారు. దీంతో బ్రహ్మీ సిరియస్ అయ్యారు. మాట్లాడుతున్నారని, దయచేసి ఆపాలని రెండు చేతులు జోడించి దండం పెట్టారు. మాట్లాడొద్దు అంటే వెళ్లిపోతాను అంటూ అసహనానికి గురయ్యాడు బ్రహ్మి.
నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా గురువారం తుమ్మలపల్లిలోని వారి క్షేత్రయ కళాక్షేత్రంలో ఎక్సరే సాహిత్య సాంస్కృతిక సంస్థాన్ ఆధ్వర్యంలో బ్రహ్మానందంకు ఎన్టీఆర్ శత జయంతి జయంతి ప్రదాన పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బ్రహ్మానందాన్ని సత్కరించి ఆయన చేతికి బంగారు కంకణం అందజేశారు. ఓ అభిమాని కిరీటాన్ని బహూకరించాడు. అయితే కార్యక్రమంలో భాగంగా బ్రహ్మానందం మాట్లాడుతూ ఎన్టీఆర్ గురించి కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఈ సమయంలో వేదికపై గందరగోళ వాతావరణం నెలకొంది. వేదిక పై అందరూ గోల గోల చేస్తూ సెల్ ఫోన్లు చూస్తూ బ్రహ్మీని పట్టించుకోవడం మానేశారు. అంతేకాకుండా.. ఆయన ఎన్టీఆర్ గురించి చెబుతున్న మాటలను సైతం పక్కన పెట్టి కొందరు ప్రముఖులు ఎవరికి వారు సెల్ ఫోన్లు చూస్తూ కూర్చున్నారు. చివరకు బ్రహ్మానందం సెల్ఫోన్ను ఒకరి నుంచి లాక్కున్నాడు.
Also Read
- Tollywood: షాక్ ఫ్యాక్టర్లు లీక్ ఫ్యాక్టర్లవుతుంటే ఎలా?
- Gudluri Ashok Babu: హీరోగా అవకాశం ఇస్తానంటూ రూ.3.5 కోట్ల మోసం.. 'భాగమతి' డైరెక్టర్పై కేసు నమోదు!
- Lenin : అఖిల్కు మాజీ వదిన కంగ్రాట్స్.. సోషల్ మీడియాలో సామ్ పోస్ట్ వైరల్
- Prabhas : 'ఫౌజీ' బిజినెస్ వేట షురూ.. భారీ రేటుకు నార్త్ ఇండియా, ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్!
ఆ తర్వాత ఎన్టీఆర్ గురించి బ్రహ్మానందం మాట్లాడారు. రాముడు, భీముడు, కృష్ణుడు ఏ పాత్రలో నటించినా, వారి వారి పాత్రలను కళ్లకు కట్టినట్లు చూపించేవారు. రాముడు, కృష్ణుడు లాంటి దేవుళ్లు నిజంగా ఇలాగే ఉంటారంటూ బ్రహ్మానందం తన నటనను మెచ్చుకున్నారు. ప్రపంచంలో తెలుగు జాతి ఉన్నంత కాలం ఎన్టీఆర్ పేరు మారుమోగుతుందని అన్నారు. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఆయన స్థానం సజీవంగా ఉందన్నారు. తన శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ అవార్డు రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. కాగా, ఎక్స్ రే కంపెనీ అధ్యక్షుడు కొల్లూరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు, మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా 35 మంది వివిధ రంగాల్లో ప్రముఖులను సత్కరించి అవార్డులు అందజేశారు.
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ఎలా నడుస్తోంది..? ఓటర్ల సాధకబాధకాలేంటి..?
-
OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
-
MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
-
Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
-
Donald Trump: ఇరాన్తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!