‘అల వైకుంఠపురములో’ హిందీ డబ్బింగ్ ఆపటానికి 9 కోట్లు!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘పుష్ప’ బాలీవుడ్ సక్సెస్ అరవింద్ కి 9 కోట్ల నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఎలాగంటారా!? ‘పుష్ప’ సూపర్ హిట్ కావటంతో బాలీవుడ్ లోనూ అల్లు అర్జున్ మేనియా మొదలైంది. పుష్ప పాటలు టిక్ టాక్ రూపంలో వైరల్ కావడంతో పాటు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి. దీంతో బన్నీ నంటించిన ‘అల వైకుంఠపురములో’ హిందీ డబ్బింగ్ ను థియేటర్లలో విడుదల చేయటానికి రెడీ అయ్యాడు గోల్డ్ మైన్ టెలిఫిలిమ్స్ అధినేత మనీశ్. తెలుగు సినిమాల హిందీ డబ్బింగ్, శాటిలైట్ హక్కులు పొందటంలో ముందుండే మనీశ్ తెలుగు ‘అల వైకుంఠపురములో’ హిందీ డబ్బింగ్, రీమేక్ తో పాటు శాటిలైట్ హక్కులను 18 నుంచి 20 కోట్లకు విడుదలకు ముందే కొనుగోలు చేశాడు. సినిమా విడుదలై సూపర్ హిట్ కావటతో మనీశ్ పంట పండింది. యూ ట్యూబ్ లో విడుదల చేసిన హిందీ డబ్బింగ్ కూడా మనీశ్ కి గోల్డ్ మైన్ గా మారింది. ఇదిలా ఉంటే ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయాలనుకున్న అల్లు అరవింద్ హిందీ రీమేక్ హక్కులను మనీశ్ నుంచి దాదాపు 8 కోట్లకు కొనుగోలు చేశాడు. అంతే కాదు తను కార్తీక్ ఆర్యన్ తో ‘అల వైకుంఠపురములో’ హిందీ రీమేక్ గా తీస్తున్న ‘షెహజాదా’ శాటిలైల్ హక్కులు కూడా మనీశ్ కే ఇచ్చేటల్లు ఒప్పందం కుదుర్చుకున్నాడు.
Read Also : హీరోయిన్ తో వైష్ణవ్ తేజ్ బటర్ ఫ్లై కిస్… రొమాంటిక్ వీడియో
Also Read
ప్రస్తుతానికి వస్తే ‘పుష్ప’ సక్సెస్ అంతా తలక్రిందులు చేసింది. మనీశ్ తన వద్ద ఉన్న ‘అల వైకుంఠపురములో’ డబ్బింగ్ వెర్షన్ ను థియేటర్లలలో రిలీజ్ చేయాలని సంకల్పించాడు. అందుకు జనవరి 26ను రిలీజ్ డేట్ గా ఫిక్స్ చేశాడు. దీంతో అల్లు అరవింద్ కి కంగారు మొదలైంది. తను కార్తీక్ ఆర్యన్ తో తీస్తున్న ‘షెహజాదా’ సినిమాకు దెబ్బపడనుందని గ్రహించి వెంటనే ముంబై వెళ్ళి మనీశ్ ముందు వాలిపోయాడు. డబ్బింగ్ విడుదల చేయవద్దంటూ అడ్డుపుల్ల వేశాడు. మనీశ్ కి టాలీవుడ్ పెద్ద బిజినెస్. అరవింద్ ని సితార ఎంటర్ టైన్ మెంట్స్ ను, దిల్ రాజు ను కాదని ముందుకు వెళితే ఇక్కడ బిజినెస్ పరంగా పెద్ద దెబ్బ పడుతుంది. దాంతో చేసేదేమి లేక కాళ్ళబేరానికి వచ్చాడు. బేరసారాలకు దిగాడు. తన నష్టం ఇంతంటూ కాకి లెక్కలు వేశాడు. 25 కోట్ల నుంచి బేరం మొదలు పెట్టాడు. చివరకు 9 కోట్లకు వ్యవహారం సెటిల్ అయింది. సో హిందీ రీమేక్ హక్కులు కానీ, ఇప్పుడు డబ్బింగ్ సినిమా ఆపినందుకు గానీ మనీశ్ కి దాదాపు 17 కోట్ల వరకూ గిట్టుబాటు అయిందన్న మాట. అంటే ‘అల వైకుంఠపురములో’ సినిమా హిందీ డబ్బింగ్ హక్కులు మనీశ్ కు పైసా లేకుండా గిట్టుబాటు అయినట్లన్నమాట. సో మనీశ్ లక్ అరవింద్ అండ్ కో బ్యాడ్ లక్ అన్నమాట.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!