‘అల వైకుంఠపురములో’ హిందీ డబ్బింగ్ ఆపటానికి 9 కోట్లు!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘పుష్ప’ బాలీవుడ్ సక్సెస్ అరవింద్ కి 9 కోట్ల నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఎలాగంటారా!? ‘పుష్ప’ సూపర్ హిట్ కావటంతో బాలీవుడ్ లోనూ అల్లు అర్జున్ మేనియా మొదలైంది. పుష్ప పాటలు టిక్ టాక్ రూపంలో వైరల్ కావడంతో పాటు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి. దీంతో బన్నీ నంటించిన ‘అల వైకుంఠపురములో’ హిందీ డబ్బింగ్ ను థియేటర్లలో విడుదల చేయటానికి రెడీ అయ్యాడు గోల్డ్ మైన్ టెలిఫిలిమ్స్ అధినేత మనీశ్. తెలుగు సినిమాల హిందీ డబ్బింగ్, శాటిలైట్ హక్కులు పొందటంలో ముందుండే మనీశ్ తెలుగు ‘అల వైకుంఠపురములో’ హిందీ డబ్బింగ్, రీమేక్ తో పాటు శాటిలైట్ హక్కులను 18 నుంచి 20 కోట్లకు విడుదలకు ముందే కొనుగోలు చేశాడు. సినిమా విడుదలై సూపర్ హిట్ కావటతో మనీశ్ పంట పండింది. యూ ట్యూబ్ లో విడుదల చేసిన హిందీ డబ్బింగ్ కూడా మనీశ్ కి గోల్డ్ మైన్ గా మారింది. ఇదిలా ఉంటే ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయాలనుకున్న అల్లు అరవింద్ హిందీ రీమేక్ హక్కులను మనీశ్ నుంచి దాదాపు 8 కోట్లకు కొనుగోలు చేశాడు. అంతే కాదు తను కార్తీక్ ఆర్యన్ తో ‘అల వైకుంఠపురములో’ హిందీ రీమేక్ గా తీస్తున్న ‘షెహజాదా’ శాటిలైల్ హక్కులు కూడా మనీశ్ కే ఇచ్చేటల్లు ఒప్పందం కుదుర్చుకున్నాడు.
Read Also : హీరోయిన్ తో వైష్ణవ్ తేజ్ బటర్ ఫ్లై కిస్… రొమాంటిక్ వీడియో
Also Read
ప్రస్తుతానికి వస్తే ‘పుష్ప’ సక్సెస్ అంతా తలక్రిందులు చేసింది. మనీశ్ తన వద్ద ఉన్న ‘అల వైకుంఠపురములో’ డబ్బింగ్ వెర్షన్ ను థియేటర్లలలో రిలీజ్ చేయాలని సంకల్పించాడు. అందుకు జనవరి 26ను రిలీజ్ డేట్ గా ఫిక్స్ చేశాడు. దీంతో అల్లు అరవింద్ కి కంగారు మొదలైంది. తను కార్తీక్ ఆర్యన్ తో తీస్తున్న ‘షెహజాదా’ సినిమాకు దెబ్బపడనుందని గ్రహించి వెంటనే ముంబై వెళ్ళి మనీశ్ ముందు వాలిపోయాడు. డబ్బింగ్ విడుదల చేయవద్దంటూ అడ్డుపుల్ల వేశాడు. మనీశ్ కి టాలీవుడ్ పెద్ద బిజినెస్. అరవింద్ ని సితార ఎంటర్ టైన్ మెంట్స్ ను, దిల్ రాజు ను కాదని ముందుకు వెళితే ఇక్కడ బిజినెస్ పరంగా పెద్ద దెబ్బ పడుతుంది. దాంతో చేసేదేమి లేక కాళ్ళబేరానికి వచ్చాడు. బేరసారాలకు దిగాడు. తన నష్టం ఇంతంటూ కాకి లెక్కలు వేశాడు. 25 కోట్ల నుంచి బేరం మొదలు పెట్టాడు. చివరకు 9 కోట్లకు వ్యవహారం సెటిల్ అయింది. సో హిందీ రీమేక్ హక్కులు కానీ, ఇప్పుడు డబ్బింగ్ సినిమా ఆపినందుకు గానీ మనీశ్ కి దాదాపు 17 కోట్ల వరకూ గిట్టుబాటు అయిందన్న మాట. అంటే ‘అల వైకుంఠపురములో’ సినిమా హిందీ డబ్బింగ్ హక్కులు మనీశ్ కు పైసా లేకుండా గిట్టుబాటు అయినట్లన్నమాట. సో మనీశ్ లక్ అరవింద్ అండ్ కో బ్యాడ్ లక్ అన్నమాట.
తాజావార్తలు
-
CM Revanth Reddy : బండి భగీరథ్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రియాక్షన్..
-
RG Kar Case: ఆర్జీకర్ కేసులో ట్విస్ట్.. మళ్లీ దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం
-
GT vs CSK: టాస్ గెలిచిన రుతురాజ్ గైక్వాడ్.. గిల్ సేనకు మొదట బ్యాటింగ్ సవాల్..
-
Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో అత్త గారికి ప్రభుత్వం షాక్.. కీలక పదవి నుంచి తొలగింపు
-
Summer Tips: ఎండ నుంచి వచ్చాక వెంటనే ఐస్ వాటర్ తాగుతున్నారా? ప్రమాదం ఇదే
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!