40 ఏళ్ళ ‘రాధాకళ్యాణం’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చిత్రసీమలో బాపు తీతకు, ముళ్ళపూడి వెంకటరమణ రాతకు విశేషస్థానముంది. వారి జోడీ సాంఘికం తీసినా, పౌరాణికం తెరకెక్కించినా, రీమేక్స్ అందించినా జనం అభిమానించారు, ఆదరించారు. స్ట్రెయిట్ మూవీస్ తోనే కాదు, పరభాషల్లో విజయం సాధించిన చిత్రాలకు తెలుగుదనం అద్ది అందించడంలోనూ బాపు-రమణ తమదైన బాణీ పలికించారు. అలా వారి అద్దకంలో వెలుగు చూసిన చిత్రాల్లో ‘రాధా కళ్యాణం’ ఒకటి. తమిళంలో భాగ్యరాజా స్వీయదర్శకత్వంలో నటించిన ‘అంద 7 నాట్కల్’ చిత్రం ఆధారంగా ఈ ‘రాధా కళ్యాణం’ తెరకెక్కింది. తెలుగువారినీ ఈ కథ అలరించింది.
‘రాధా కళ్యాణం’ కథ ఏమిటంటే- మన పురాణగాథల్లో రాధ, మాధవుడు ఎంత ప్రేయసీప్రియులైనా వారి మధ్య దూరమే ఉందని విన్నాం. అదే తీరున ఈ కథలోనూ నాయిక రాధకు, నాయకుడు పాల్ఘాట్ మాధవన్ కు మధ్య దూరమే నిలుస్తుంది. అసలు కథలోకి వస్తే – రాధ ఓ సంప్రదాయాల చాటున పెరిగిన అమ్మాయి. ఆమెకు హార్మోనియం పెట్టె పట్టుకొని మహదేవన్ లాగా సినిమా రంగాన్ని ఏలేయాలని కలలు కనే మాధవన్ పరిచయం అవుతాడు. వారిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. కానీ, మాధవన్ ఆర్థిక పరిస్థితి బాగోలేని కారణంగా, వారి ప్రేమ ఫలించదు. రాధను డాక్టర్ ఆనంద్ అనే అతనికి ఇచ్చి పెళ్ళి చేస్తారు.
Also Read
- NTRNeel : ఎన్టీఆర్ బర్త్డే ‘డబుల్ ధమాకా’.. ‘డ్రాగన్’ గ్లింప్స్.. ఇంకా..!
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Jet Lee OTT Release: సడన్ సర్ప్రైజ్.. ‘జెట్ లీ’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
- Manoj Manchu: మంచు మనోజ్ దంపతుల సంచలన నిర్ణయం.. ఐదుగురు పిల్లల దత్తత!
ఆనంద్ భార్య చనిపోయి ఉంటుంది. తల్లి బలవంతంతో రాధ మెడలో తాళి కడతాడు. పెళ్ళయిన రోజు నుంచే రాధ మనసులో ఏదో మదనం దాగుందని ఆనంద్ తెలుసుకుంటాడు. అతనికి తన ప్రేమకథ తెలుపుతుంది రాధ. మంచి మనసున్న ఆనంద్, రాధను ఆమె ప్రియునిదగ్గరకు చేర్చాలని ఆశిస్తాడు. చివరకు మాధవన్ ను పట్టుకొని వస్తాడు. మాధవన్, ఆనంద్ కట్టిన తాళిని తెంచేసి తనతో రమ్మంటాడు. ఆ పనిచేయలేకపోతుంది రాధ. అప్పుడు ఆమెకు మన సంస్కృతీసంప్రదాయాలు గుర్తుకు వస్తాయి. మాంగల్యబలం అర్థమవుతుంది. అప్పుడు రాధ, ఆనంద్ ను ఆనందంగా జీవించమని చెప్పి మాధవన్ వెళ్ళిపోవడంతో కథ ముగుస్తుంది.
ఈ కథలో రాధగా రాధిక, ఆనంద్ గా శరత్ బాబు, మాధవన్ గా చంద్రమోహన్ నటించారు. టి.ఎల్. కాంతారావు, రావి కొండలరావు, పుష్పలత, సాక్షి రంగారావు, రాధాబాయి ఇతర ముఖ్యపాత్రధారులు. ఈ చిత్రాన్ని శ్రీసారథీ స్టూడియోస్ పతాకంపై జి.డి.ప్రసాదరావు, పి.శశిభూషణ్ నిర్మించారు. భాగ్యరాజా కథకు అనువుగా తెలుగుదనం అద్ది ముళ్ళపూడి మాటలు పలికించారు. కేవీ మహదేవన్ సంగీతం సమకూర్చారు. సి.నారాయణరెడ్ది పాటలు రాశారు. ఇందులోని “చిటికెయ్యవే చినదానా…”, “కలనైనా క్షణమైనా మాయనిదీ మన ప్రేమ…”, “చేతికి గాజుల్లా చెంపకు కాటుకలా…” , “బంగారు బాల పిచ్చుక…” వంటి పాటలు అలరించాయి. తెలుగువారికి బాపు ఫ్రేమ్ అంటే ఎంతో అభిమానం. ఈ చిత్రంలో రాధికను అందంగా చూపించడంలో బాపు ఫ్రేమ్ భలేగా ఆకట్టుకుంటుంది. ఇక ఆయన తనదైన పంథాలో చిత్రాన్ని తెరకెక్కించారు. ‘రాధా కళ్యాణం’ అప్పట్లో మంచి విజయం సాధించింది.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..