Foods- Cancer : రోడ్ సైడ్ టిఫెన్ చేస్తున్నారా? అయితే మీకు క్యాన్సర్ తప్పదు..!
- బిజీ లైఫ్లో బయటి ఫుడ్కి అలవాటు పడుతున్న జనాలు
- రోడ్ సైడ్ టిఫెన్ చేస్తున్నారా?
- చాలా ప్రమాదం ఉందన్న నిపుణులు
- క్యాన్సర్ తప్పదని హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం జనాలు అంతా బిజీ లైఫ్ గడుపుతున్నారు. ఈ క్రమంలో ఏదైనా పనిని చేయాలనుకుంటే టైం సరిపోదని చెప్పి, కొన్నిసార్లు ఆహారాన్ని కూడా బయటే తినేస్తున్నారు. ఇలా బయట ఫాస్ట్ ఫుడ్స్, హోటళ్లు, రెస్టారెంట్లు, చిరు బండ్ల వద్ద ఏ టైంలో చూసినా రద్దీగానే ఉంటున్నాయి. కొందరైతే ఇంటి దగ్గర వండు కోవడం మానేస్తున్నారు. అయితే ఇలా బయట బిర్యానీ, ఫ్రైలు అంటూ బాగానే తింటున్నారు. కానీ అవి వేటితో తయారు చేస్తారు? రుచికి ఏం కలుపుతున్నారు? ఇంతకీ అవి తాజావేనా అనే ఆలోచన ఎవరికైనా వచ్చిందా? రోడ్ సైడ్ టిఫెన్ చేసేవాళ్లకు మాత్రం ఓ షాకింగ్ న్యూస్ వెలువడింది. ఈ ఫుడ్స్ వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందట.
READ MORE: IND vs SA: శాంసన్ వీర విహారం.. సిక్సులతోనే డీల్
Also Read
- Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Kitchen Hacks: వంట పనిని సగం తగ్గించే కిచెన్ టిప్స్ .. బిగినర్స్ కోసం స్పెషల్ గైడ్!
- Protein Foods: ఏ ప్రోటీన్ పౌడర్ అవసరం లేదు.. కేవలం రూ.30లోనే ఉత్తమ పోషకాహారం పొందవచ్చు..!
రోడ్ సైడ్ ఫుడ్ను తయారు చేసే పద్ధతి గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ ఆహార తయారీకి ఉపయోగించే నూనె నల్లగా కనిపిస్తుంది. అంటే నూనెను ఎక్కువగా మరిగించడం, అదే నూనెలో నాలగైదు దఫాలుగా వాడటం వల్ల ఆ కలర్ వస్తుంది. దీని వల్ల చాలా ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. ఇంకా ముఖ్యంగా రోడ్సైడ్ ఫుడ్ తయారీ దారులు మినిమం శుభ్రత కూడా పాటించడం లేదు. తక్కువ ధరకు లభించే సరకుల వినియోగించడం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.
READ MORE:Indian Railways: భార్యాభర్తల గొడవతో రైల్వేకి రూ.3కోట్లు నష్టం.. ఏం జరిగిందంటే?
ముఖ్యంగా క్యాన్సర్ మహమ్మారి ముప్పును పెంచుతుందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి వీలైనంత వరకు నూనె పదార్థాలు, బయట ఫుడ్ తీసుకునే విషయంలో అప్రమత్తంగా ఉండడం మంచిదని సూచిస్తున్నారు. ఆయిల్ ను ఎక్కువసార్లు మరిగించడం వల్ల అందులోని టోటల్ పోలార్ కాంపౌండ్స్ (టీపీసీ) ఫ్రీరాడికల్స్గా మారుతాయి. నార్మల్గా వంట నూనెలో పోలార్ కాంపౌండ్స్ 25 శాతానికి మించితే దాన్ని మార్చాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ(ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) నిబంధనలు పేర్కొంటున్నాయి. దాదాపు అన్ని హోటళ్లలో మోతాదుకు మించి హానికరమైన ఫుడ్ కలర్లు, టేస్టింగ్ సాల్ట్, సోయా సాస్లు యూజ్ చేస్తున్నారు. కాబట్టి, రోడ్ సైడ్ ఫుడ్ తీసుకోవడం కారణంగా ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకున్నట్లేనని హెచ్చరిస్తున్నారు.
తాజావార్తలు
-
Jayam Ravi Divorce Case : మళ్ళీ కోర్టు మెట్లెక్కిన జయంరవి భార్య… ఈసారి ఏమైందంటే ?
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Blaupunkt QLED TV: థియేటర్ లాంటి అనుభవం.. Google TV 5.0తో బ్లాపంక్ట్ కొత్త QLED స్మార్ట్ టీవీలు.. చౌక ధరకే
-
RC 17 : సుకుమార్ సినిమాలో చరణ్ ఇలా ఉంటాడా?
-
Arjun Tendulkar: అచ్చు తండ్రి మాదిరే.. అర్జున్ టెండూల్కర్ గొప్ప మనసు.. వీడియో వైరల్!
ట్రెండింగ్
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?