Budda Parakalu Pulusu: తెలంగాణ స్టైల్లో బుడ్డ పరకల పులుసు.. ఈ ఒక్క టిప్ పాటిస్తే రుచి పీక్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Budda Parakalu Pulusu: తెలంగాణ పల్లె వంటకాల్లో చేపల పులుసుకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ముఖ్యంగా చెరువులో తాజాగా పట్టిన బుడ్డ పరకలతో చేసే పులుసు రుచి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అయితే ఈ కర్రీని చేపలు విరిగిపోకుండా, నీసు వాసన రాకుండా సరైన పద్ధతిలో వండడం చాలా ముఖ్యం. తెలంగాణ స్టైల్లో బుడ్డ పరకల పులుసును ఇలా తయారు చేసుకోవచ్చో ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. ముందుగా బుడ్డ పరకలను శుభ్రం చేసుకోవాలి. చిన్న కత్తెరతో ఈకలు, తోకలు తొలగించి, తలకాయలు తీసేయాలి. అనంతరం చేపల పొట్టను శుభ్రంగా తీసి, ఉప్పుతో రుద్ది కడగాలి. ఆ తర్వాత నిమ్మరసం పిండి నీటితో మరోసారి శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చేపలకు ఉండే నీసు వాసన తగ్గుతుంది.
అనంతరం శుభ్రం చేసిన చేపలను ఒక గిన్నెలోకి తీసుకుని రుచికి సరిపడా ఉప్పు, పసుపు, అల్లం, పచ్చి ధనియాల పొడి, కారం, జీలకర్ర – మెంతుల పొడి వేసుకోవాలి. ముందుగా కాల్చుకున్న రెండు ఉల్లిగడ్డలను మెత్తగా ముద్ద చేసి ఈ మిశ్రమంలో కలపాలి. అనంతరం చేపలకు మసాలా బాగా పట్టేలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇక ముందుగా నానబెట్టుకున్న చింతపండుతో రసం తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పొయ్యిపై గిన్నె పెట్టి నూనె పోసి బాగా వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు వేసి వేయించాలి. అనంతరం పసుపు వేసి కలపాలి. ఇప్పుడు మసాలా పట్టించిన బుడ్డ పరకలను ఒక్కొక్కటిగా నూనెలో వేయాలి. పకోడీలు వేయించినట్లు చేపలను ఒకేసారి ముద్దగా వేయకూడదు. చిన్న మంటపై ఉంచి గిన్నెకు మూత పెట్టాలి. ఈ కర్రీ చేసేటప్పుడు ముఖ్యంగా చేపలను గరిటెతో కలపకూడదు. అలా చేస్తే చేపలు విరిగి కూరంతా ముద్దగా మారే అవకాశం ఉంటుంది.
Also Read
- Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
- Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే "పనీర్ భుర్జీ"తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
- Healthy Lifestyle: ఎక్కువ కాలం ఆరోగ్యంగా బతకాలని ఉందా.. ఈ టైమ్లోనే బ్రేక్ఫాస్ట్, డిన్నర్ చేయండి!
- Food Facts : పప్పులో తెల్లటి నురుగు.. మురికేనా.? అసలు నిజం ఇదే.!
చేపలు విరగకుండా ఉండేందుకు గిన్నెను రెండు చేతులతో పట్టుకుని నెమ్మదిగా గుండ్రంగా తిప్పుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల చేపలు కిందికి, పైకి కదులుతాయి. అనంతరం సిద్ధం చేసుకున్న చింతపండు రసాన్ని మొత్తం పోసి చిన్న మంటపై ఉడికించాలి. కూరలో ఉప్పు, కారం, పులుపు సరిపోతున్నాయో చూసుకుని అవసరమైతే సర్దుబాటు చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసి మూత పెట్టి కొద్దిసేపు ఉడికించాలి. పులుసు బాగా మరిగి చిక్కగా మారే వరకు చిన్న మంటపైనే ఉంచాలి. చివరగా దించే ముందు మసాలా పొడి వేసి మరోసారి మరిగిస్తే రుచికరమైన బుడ్డ పరకల పులుసు రెడీ అవుతుంది. పులుసు చిక్కగా మారి పైకి నూనె తేలినప్పుడు కూర సిద్ధం అయినట్టే. అన్నంలో కలుపుకుని తింటే ఈ తెలంగాణ స్టైల్ బుడ్డ పరకల పులుసు రుచి అదిరిపోతుంది. కుదిరితే మీరు కూడా మీ ఇంట్లో ప్రయత్నించి చూడండి.
తాజావార్తలు
-
Sanju Samson: ప్రపంచకప్ గెలవాలనే ఆ ఒక్క నిర్ణయం శామ్సన్ కెరీర్ను మార్చేసిందా..? అసలు ఏం జరిగిందంటే..
-
Reservation row: కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం.. మంట పెట్టిన ‘‘రిజర్వేషన్’’ అంశం..
-
Haryana: ప్రముఖ రెజ్లర్ గ్రేట్ ఖలీ కారుకు ప్రమాదం.. దెబ్బతిన్న వాహనం
-
TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
-
Aadarsha Kutumbam Postponed: వెంకీ మామా ‘ఆదర్శ కుటుంబం’ పోస్ట్పోన్.. కొత్త డేట్ ఇదేనా?
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!