Healthy Lifestyle: ఎక్కువ కాలం ఆరోగ్యంగా బతకాలని ఉందా.. ఈ టైమ్లోనే బ్రేక్ఫాస్ట్, డిన్నర్ చేయండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Healthy Lifestyle: మన ఆరోగ్యంపై ఆహారం మాత్రమే కాదు.. ఆహారం తీసుకునే సమయం కూడా ప్రభావం చూపుతుందా? అంటే అవుననే అంటున్నారు వైద్యులు. ఉదయం బ్రేక్ఫాస్ట్ ఆలస్యంగా చేయడం, రాత్రి చాలా ఆలస్యంగా డిన్నర్ చేయడం వంటివి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశోధనల్లో వెలుగు చూసినట్లు తెలిపారు. అమెరికాలో 40 ఏళ్లు పైబడిన 31 వేల మందికి పైగా వ్యక్తుల డేటాను పరిశీలించి ఈ అధ్యయనం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. 1999 నుంచి 2018 మధ్య వారి ఆహారం తీసుకునే సమయాలను నమోదు చేసి, అనంతరం వారి డెత్ రికార్డులతో పోల్చినట్లు వెల్లడించారు. సుమారు 8.6 ఏళ్ల ఫాలోఅప్లో 7,129 మంది మరణించినట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధన European Journal of Clinical Nutrition లో ప్రచురితమైంది.
బ్రేక్ఫాస్ట్కు ఇదే సరైన సమయమా?
తాజా అధ్యయనం ప్రకారం.. ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం మంచిదని సూచించింది. ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య మొదటి భోజనం చేసేవారిలో ఏ కారణంతోనైనా మరణించే ప్రమాదం 10 శాతం ఎక్కువగా కనిపించిందని చెప్పారు. 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య భోజనం చేసేవారిలో ఈ ప్రమాదం 19 శాతంగా నమోదైంది. ఇక మధ్యాహ్నం 12 గంటల తర్వాత రోజులో మొదటి భోజనం చేసేవారిలో ఈ ప్రమాదం 29 శాతం ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనలో తేలింది. 50 ఏళ్ల వయసులో మధ్యాహ్నం తర్వాత భోజనం చేసేవారిలో సగటు ఆయుర్దాయం సుమారు 2.46 ఏళ్లు తక్కువగా ఉన్నట్లు డేటా సూచించింది.
Also Read
- Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
- Jowar Roti to Ragi Roti: రొట్టెల్లో వెరైటీ కావాలా?.. జొన్న నుంచి రాగి వరకు.. ఆరోగ్యకరమైన 6 రకాల రొట్టెలు ఇవే!
- Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్లోకి అదిరిపోయే "మసాలా గుత్తివంకాయ" చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
- Assam Magic Rice: "మ్యాజిక్ బియ్యం".. మంట అవసరం లేదు.. రైస్ కుక్కర్తో పనిలేదు.. చల్లటి నీళ్లతో క్షణాల్లో అన్నం రెడీ..
డిన్నర్ కూడా..
రాత్రి చాలా ఆలస్యంగా, ముఖ్యంగా అర్ధరాత్రి తర్వాత భోజనం చేసేవారిలో మరణించే ప్రమాదం 27 శాతం ఎక్కువగా కనిపించింది. వారి సగటు ఆయుర్దాయం కూడా 2.35 ఏళ్లు తక్కువగా ఉన్నట్లు అధ్యయనం పేర్కొంది. అయితే సాయంత్రం 7 గంటల కంటే ముందే డిన్నర్ చేసేవారిలోనూ ప్రమాదం 13 శాతం ఎక్కువగా కనిపించింది. అత్యల్ప ప్రమాదం మాత్రం రాత్రి 8 గంటల సమయంలో చివరి భోజనం చేసేవారిలో నమోదైంది. అయితే ఆలస్యంగా తినడం వల్లే ఆయుష్షు తగ్గుతుందని ఈ అధ్యయనం నిరూపించలేదు. వయసు, బరువు, ఆహారం, వ్యాయామం, స్మోకింగ్, తాగుడు, ఇప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యలు వంటి అనేక అంశాలు కూడా ప్రభావం చూపుతాయని పరిశోధకులు స్పష్టం చేశారు. అందువల్ల భోజన సమయంతో పాటు మొత్తం జీవనశైలిపై కూడా దృష్టి పెట్టడం ముఖ్యమని సూచించారు.
తాజావార్తలు
-
Bigg Boss Telugu 10: ‘బిగ్ బాస్ తెలుగు 10’లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
-
US Open 2026: సబాలెంకాను ఓడించి ఎలెనా రిబాకినా చరిత్ర.. తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల వసూళ్లు.. ఆ ఒక్క పొరపాటుతో ఆస్కార్ ఛాన్స్ మిస్
-
Jana Sena : ఖమ్మంలో ఇవాళ జనసేన తెలంగాణ శంఖారావం.. భారీగా నేతలు, కార్యకర్తల రాక
-
BRICS Summit 2026: BRICSకి 20 ఏళ్లు.. ప్రత్యేక స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన భారత్.. వీటి ప్రత్యేకత ఇదే
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!