Health Tips: నీరు ఎక్కువ తాగుతున్నారా.. ? అయితే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నీళ్లు ఎంత తాగితే అంత మంచిది ఇది మనం ఎప్పుడు అందినోట వినే మాట. దాని వల్ల చాలా అనారోగ్యాల నుంచి బయట పడవచ్చనీ మనకు తెలుసు. కానీ, తగిన మోతాదుకు మించి నీళ్లు తాగడం అన్నది అనారోగ్యం నుంచి బయట పడొచ్చని మనందరికి తెలుసు కానీ.. మోతాదుకు మించి నీళ్లు తాగడం అన్నది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఓవర్హైడ్రేషన్ వల్ల శరీరం రకరకాల ఇబ్బందులకు గురి అవుతుంది.
మనిషికి జీవించేందుకు నీరు అత్యవసరం. సరైన మోతాదులో నీళ్లు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత సమతులంగా ఉంటుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఒత్తిడి, ఆందోళనలు దూరం అవుతాయి. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే అవకాశం తగ్గుతుంది. ముఖ్యంగా రక్తపోటు అదుపులో ఉంటుంది. మంచినీళ్లను తీసుకోవడం వల్ల ఇలా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అయితే, నీళ్లు తాగడం మంచిదన్నారు కదా అని, నిరంతరం అదే పనిలో ఉండకూడదు. అధిక మోతాదులో నీళ్లు తాగడం వల్ల చెడు పరిణామాలు ఎదుర్కోవాల్సి రావచ్చు.
Also Read
- Jowar Roti: 'జొన్న రొట్టె' విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
- Bhindi Red Chilli Pachadi: వేడి వేడి అన్నంలో 'బెండకాయ పచ్చడి' వేసుకొని తింటే.. అబ్బో రుచి అదుర్స్ అంతే.!
- Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
- Chandipura virus: 22 మంది చిన్నారులు మృతి.. ఏమిటి చండీపుర వైరస్.? మెదడుపై ఎలా దాడి చేస్తుంది.?
అతిగా నీళ్లు తాగడం వల్ల ఆ నీటిని వడబోసే శక్తిగానీ, నిల్వ ఉంచుకునే సామర్థ్యం గానీ కిడ్నీలకు ఉండదు. అప్పుడు అధికమైన ఆ నీరు రక్తంలో కలిసిపోతుంది. ఫలితంగా రక్తంలో ఉండే సోడియం సహా ఎలక్ట్రోలైట్ల శాతం తరిగిపోతుంది. శరీరంలోని ద్రవాల స్థాయిని సరిగ్గా ఉంచేవీ, ఆమ్ల క్షారాల సమతుల్యతని కాపాడేవీ ఎలక్ట్రోలైట్లే. కండరాలూ, నరాలూ సరిగ్గా పనిచేయాలంటే సోడియం ఎంతో కీలకం. కణాల లోపల నీరు ఎంత ఉండాలన్న నియంత్రణ కూడా సోడియంపైనే.
సోడియం క్షీణించడం వల్ల కణాల్లోకి నీరు చేరి అవి ఉబ్బిపోతాయి. దానివల్ల రక్తపోటు పెరుగుతుంది. హృదయ సమస్యలు వచ్చే అవకాశం అధికం అవుతుంది. తలనొప్పి, తలతిరగడం, డయేరియాలాంటి సమస్యలూ రావచ్చు. మగతగా అనిపించడం, ఒత్తిడి పెరగడం, తికమక పడటం జరగొచ్చు. అంతేకాదు అధిక మోతాదులో నీళ్లు తీసుకోవడం వల్ల మెదడు కూడా ప్రభావితం అవుతుంది. మూర్ఛ రావడం, లేదా కోమాలోకి వెళ్లడంలాంటివి కూడా జరగవచ్చు. కాబట్టి ఆరోగ్య పరిస్థితిని బట్టి కావలసినంత నీరు మాత్రమే తీసుకుంటే చెడు ప్రభావాల నుంచి దూరంగా ఉండొచ్చు.
తాజావార్తలు
-
Meta: ఆల్గోరిథం మార్చాల్సిందే.. మెటాకు నట్లు బిగిస్తున్న భారత్..
-
Cricket Player: బోర్డును బురిడీ కొట్టించాలనుకున్నాడు.. చివరికి కెరీర్ క్లోజ్..
-
Ind Vs SL: ఊహించని రీతిలో రెచ్చిపోయిన శ్రీలంక బ్యాటర్స్.. చేతులెత్తేసిన టీమిండియా ఆటగాళ్లు..
-
Jupally Krishna Rao: ‘రాష్ట్రంలో నీటి కటకట ఉంది.. అంతటా ఎల్నినో ప్రభావం’..
-
Sheikh Hasina: షేక్ హసీనా వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు.. బంగ్లాదేశ్కు స్పష్టం చేసిన భారత్..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!