Kidney Stones Rising in Summer: వేసవిలో కిడ్నీల్లో పెరిగిపోతున్న రాళ్లు.. ఇలా చెక్ పెట్టండి..!
Kidney Stones Rising in Summer: వేసవి కాలం మొదలవడంతో దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. అనేక ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ సమయంలో వడదెబ్బ, డీహైడ్రేషన్ వంటి సమస్యలతో పాటు కిడ్నీ రాళ్ల కేసులు కూడా గణనీయంగా పెరుగుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తీవ్రమైన వేడిలో శరీరం చెమట రూపంలో ఎక్కువ నీటిని కోల్పోతుంది. తగినంత నీరు తాగకపోతే మూత్రం చిక్కగా మారి, అందులోని ఖనిజాలు పేరుకుపోయి క్రమంగా రాళ్లుగా మారే ప్రమాదం పెరుగుతుంది. అందుకే వేసవిలో కిడ్నీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని నిపుణులు చెబుతున్నారు.
డీహైడ్రేషన్ వల్లే ప్రధాన ప్రమాదం
వైద్యుల ప్రకారం వేసవిలో కిడ్నీ రాళ్లకు ప్రధాన కారణం డీహైడ్రేషన్. అధికంగా చెమట పట్టినప్పుడు శరీరం నీటిని కోల్పోతుంది. ఈ పరిస్థితిలో కిడ్నీలు తక్కువ మూత్రాన్ని ఉత్పత్తి చేస్తాయి. దాంతో మూత్రంలో కాల్షియం, ఆక్సలేట్ వంటి పదార్థాల సాంద్రత పెరిగి అవి స్ఫటికాలుగా మారతాయి. ఇవే తర్వాత కిడ్నీ రాళ్లుగా మారుతాయి.
Also Read
- Ragi Puri: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. రాగి పిండితో మెత్తటి పూరీలు.. ఇలా చేస్తే లొట్టలేయాల్సిందే!
- Weight Loss: బరువు తగ్గాలనుకునే వారికి శుభవార్త.. ఇంత వరకు ఎవరూ చెప్పని చిట్కా.. 99 శాతం సక్సెస్..
- Improve Sperm Quality: వీర్యకణాల సమస్యకు నేచురల్ సొల్యూషన్.. వీర్య నాణ్యత పెంచే ఆహారపదార్థాలు ఇవే.!
- Bad Breath Remedies: నోటి దుర్వాసనతో విసిగిపోయారా.? ఈ సింపుల్ చిట్కా ట్రై చేయండి.!
ఈ ఆహారపు పొరపాట్లు ప్రమాదకరం
వేసవిలో చాలామంది చల్లని పానీయాలు, సాఫ్ట్ డ్రింక్స్, ఉప్పు ఎక్కువగా ఉండే స్నాక్స్ ఎక్కువగా తీసుకుంటారు. అయితే అధిక సోడియం శరీరంలో కాల్షియం విసర్జనను పెంచి రాళ్లు ఏర్పడే అవకాశాన్ని పెంచుతుంది. అలాగే ఎర్ర మాంసం, అధిక చక్కెర కలిగిన పానీయాలు, తగినంత నీరు తాగకుండా ఎక్కువ వ్యాయామం చేయడం కూడా కిడ్నీ రాళ్ల ప్రమాదాన్ని రెట్టింపు చేస్తాయి.
ఎలా నివారించాలి?
కిడ్నీ రాళ్లను నివారించడానికి సులభమైన మార్గం తగినంత నీరు తాగడం. రోజుకు కనీసం 2.5 నుంచి 3 లీటర్ల వరకు నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. వేసవిలో బయట ఎక్కువగా తిరిగేవారు ఇంకా ఎక్కువ నీరు తీసుకోవడం మంచిది. నిమ్మరసం కలిపిన నీరు కూడా ఎంతో ఉపయోగకరం. ఇందులో ఉండే సిట్రేట్ పదార్థం రాళ్లు ఏర్పడకుండా సహాయపడుతుంది.
ఆహారంలో జాగ్రత్తలు
ఉప్పు వినియోగాన్ని తగ్గించాలి. తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, కోల్డ్ డ్రింక్స్ తగ్గించాలి. నీరు ఎక్కువగా ఉన్న పుచ్చకాయ, దోసకాయ వంటి పండ్లు తీసుకోవడం మంచిది. అయితే, మూత్రం ముదురు పసుపు రంగులో రావడం, మూత్ర విసర్జనలో మంట, నడుము నొప్పి, కడుపు పక్క భాగంలో నొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ముఖ్యంగా వేసవిలో చిన్న నిర్లక్ష్యమే కిడ్నీ రాళ్లకు కారణమవుతుంది. కాబట్టి తగినంత నీరు తాగడం, సరైన ఆహారం తీసుకోవడం, శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచడం ద్వారా ఈ సమస్యను చాలా వరకు నివారించవచ్చు అని సూచిస్తున్నారు వైద్య నిపుణులు.. అయితే, ఇది అవగాహన కోసమే.. ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే.. వెంటనే వైద్యుడిని సంప్రదించడ ఎంతో అవసరం..
తాజావార్తలు
-
Kidney Stones Rising in Summer: వేసవిలో కిడ్నీల్లో పెరిగిపోతున్న రాళ్లు.. ఇలా చెక్ పెట్టండి..!
-
jyotipoorvaj : పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా తన అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్
-
Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
-
Maro Charitra: ఆ ఒక సినిమా వల్ల.. 20 జంటలు ఆత్మహత్య?
-
OnePlus Nord CE 6 Lite 5G: 7,000mAh బ్యాటరీ + Dimensity 7400 Apex.. వన్ప్లస్ నార్డ్ సిఇ 6 లైట్ ఫీచర్లు వెల్లడి
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!