Kidney Stones Rising in Summer: వేసవిలో కిడ్నీల్లో పెరిగిపోతున్న రాళ్లు.. ఇలా చెక్ పెట్టండి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kidney Stones Rising in Summer: వేసవి కాలం మొదలవడంతో దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. అనేక ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ సమయంలో వడదెబ్బ, డీహైడ్రేషన్ వంటి సమస్యలతో పాటు కిడ్నీ రాళ్ల కేసులు కూడా గణనీయంగా పెరుగుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తీవ్రమైన వేడిలో శరీరం చెమట రూపంలో ఎక్కువ నీటిని కోల్పోతుంది. తగినంత నీరు తాగకపోతే మూత్రం చిక్కగా మారి, అందులోని ఖనిజాలు పేరుకుపోయి క్రమంగా రాళ్లుగా మారే ప్రమాదం పెరుగుతుంది. అందుకే వేసవిలో కిడ్నీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని నిపుణులు చెబుతున్నారు.
డీహైడ్రేషన్ వల్లే ప్రధాన ప్రమాదం
వైద్యుల ప్రకారం వేసవిలో కిడ్నీ రాళ్లకు ప్రధాన కారణం డీహైడ్రేషన్. అధికంగా చెమట పట్టినప్పుడు శరీరం నీటిని కోల్పోతుంది. ఈ పరిస్థితిలో కిడ్నీలు తక్కువ మూత్రాన్ని ఉత్పత్తి చేస్తాయి. దాంతో మూత్రంలో కాల్షియం, ఆక్సలేట్ వంటి పదార్థాల సాంద్రత పెరిగి అవి స్ఫటికాలుగా మారతాయి. ఇవే తర్వాత కిడ్నీ రాళ్లుగా మారుతాయి.
Also Read
- Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ "పన్నీర్ టిక్కా"ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!
- Kitchen Tips: వెల్లుల్లి తొక్క తీయడానికి ఇబ్బంది పడుతున్నారా? ఈ ఈజీ టిఫ్తో సెకన్లలో పని పూర్తి!
- WHO Cancer Report 2026: ఏడాదికి కోటి మంది మృతి..! క్యాన్సర్పై WHO షాకింగ్ నివేదిక..
- Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ 'జీరా రైస్' ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
ఈ ఆహారపు పొరపాట్లు ప్రమాదకరం
వేసవిలో చాలామంది చల్లని పానీయాలు, సాఫ్ట్ డ్రింక్స్, ఉప్పు ఎక్కువగా ఉండే స్నాక్స్ ఎక్కువగా తీసుకుంటారు. అయితే అధిక సోడియం శరీరంలో కాల్షియం విసర్జనను పెంచి రాళ్లు ఏర్పడే అవకాశాన్ని పెంచుతుంది. అలాగే ఎర్ర మాంసం, అధిక చక్కెర కలిగిన పానీయాలు, తగినంత నీరు తాగకుండా ఎక్కువ వ్యాయామం చేయడం కూడా కిడ్నీ రాళ్ల ప్రమాదాన్ని రెట్టింపు చేస్తాయి.
ఎలా నివారించాలి?
కిడ్నీ రాళ్లను నివారించడానికి సులభమైన మార్గం తగినంత నీరు తాగడం. రోజుకు కనీసం 2.5 నుంచి 3 లీటర్ల వరకు నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. వేసవిలో బయట ఎక్కువగా తిరిగేవారు ఇంకా ఎక్కువ నీరు తీసుకోవడం మంచిది. నిమ్మరసం కలిపిన నీరు కూడా ఎంతో ఉపయోగకరం. ఇందులో ఉండే సిట్రేట్ పదార్థం రాళ్లు ఏర్పడకుండా సహాయపడుతుంది.
ఆహారంలో జాగ్రత్తలు
ఉప్పు వినియోగాన్ని తగ్గించాలి. తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, కోల్డ్ డ్రింక్స్ తగ్గించాలి. నీరు ఎక్కువగా ఉన్న పుచ్చకాయ, దోసకాయ వంటి పండ్లు తీసుకోవడం మంచిది. అయితే, మూత్రం ముదురు పసుపు రంగులో రావడం, మూత్ర విసర్జనలో మంట, నడుము నొప్పి, కడుపు పక్క భాగంలో నొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ముఖ్యంగా వేసవిలో చిన్న నిర్లక్ష్యమే కిడ్నీ రాళ్లకు కారణమవుతుంది. కాబట్టి తగినంత నీరు తాగడం, సరైన ఆహారం తీసుకోవడం, శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచడం ద్వారా ఈ సమస్యను చాలా వరకు నివారించవచ్చు అని సూచిస్తున్నారు వైద్య నిపుణులు.. అయితే, ఇది అవగాహన కోసమే.. ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే.. వెంటనే వైద్యుడిని సంప్రదించడ ఎంతో అవసరం..
తాజావార్తలు
-
Nag Chaitanya: ‘ఆ రోజు నుంచే అఖిల్ నా హీరో’.. తమ్ముడిపై నాగచైతన్య ఎమోషనల్ కామెంట్స్!
-
Public Charging: రైల్వే స్టేషన్లో ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారా? జర జాగ్రత్త.. మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావచ్చు!
-
Akhil Akkineni : మూడో రోజుకి బ్రేక్ ఈవెన్ అవ్వడం చాలా చాలా రోజుల తర్వాత జరిగింది
-
Oppo New Mobile: 10,000mAh బ్యాటరీ, 50MP సెల్ఫీ కెమెరా.. లాంచ్కు ముందే లీకైన ఒప్పో A7 ప్రో మాక్స్ ఫీచర్స్ ఇవే..
-
Hamas: హమాస్కు కొత్త బాస్.. ఖలీల్ అల్-హయ్యా చేతుల్లోకి పగ్గాలు!
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!