Kidney Stones Rising in Summer: వేసవిలో కిడ్నీల్లో పెరిగిపోతున్న రాళ్లు.. ఇలా చెక్ పెట్టండి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kidney Stones Rising in Summer: వేసవి కాలం మొదలవడంతో దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. అనేక ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ సమయంలో వడదెబ్బ, డీహైడ్రేషన్ వంటి సమస్యలతో పాటు కిడ్నీ రాళ్ల కేసులు కూడా గణనీయంగా పెరుగుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తీవ్రమైన వేడిలో శరీరం చెమట రూపంలో ఎక్కువ నీటిని కోల్పోతుంది. తగినంత నీరు తాగకపోతే మూత్రం చిక్కగా మారి, అందులోని ఖనిజాలు పేరుకుపోయి క్రమంగా రాళ్లుగా మారే ప్రమాదం పెరుగుతుంది. అందుకే వేసవిలో కిడ్నీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని నిపుణులు చెబుతున్నారు.
డీహైడ్రేషన్ వల్లే ప్రధాన ప్రమాదం
వైద్యుల ప్రకారం వేసవిలో కిడ్నీ రాళ్లకు ప్రధాన కారణం డీహైడ్రేషన్. అధికంగా చెమట పట్టినప్పుడు శరీరం నీటిని కోల్పోతుంది. ఈ పరిస్థితిలో కిడ్నీలు తక్కువ మూత్రాన్ని ఉత్పత్తి చేస్తాయి. దాంతో మూత్రంలో కాల్షియం, ఆక్సలేట్ వంటి పదార్థాల సాంద్రత పెరిగి అవి స్ఫటికాలుగా మారతాయి. ఇవే తర్వాత కిడ్నీ రాళ్లుగా మారుతాయి.
Also Read
- Oil Free Poori: ఒక్క చుక్క నూనె లేకుండా పొంగే పూరీలు.. ఎలాగో చూస్తే షాకవుతారు!
- Eating on Banana Leaves: అరిటాకులో భోజనం.. సంప్రదాయం వెనుక దాగి ఉన్న అద్భుత ఆరోగ్య రహస్యాలు..!
- Cancer Injection: భారత్లో 7 నిమిషాల్లో క్యాన్సర్ ఇంజెక్షన్.. కానీ ధర వింటే షాక్.
- Red Poha Upma: బరువు తగ్గాలని ప్లాన్ చేస్తున్నారా? ఉదయాన్నే కేవలం 10 నిమిషాల్లో తయారయ్యే ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ ట్రై చేయండి!
ఈ ఆహారపు పొరపాట్లు ప్రమాదకరం
వేసవిలో చాలామంది చల్లని పానీయాలు, సాఫ్ట్ డ్రింక్స్, ఉప్పు ఎక్కువగా ఉండే స్నాక్స్ ఎక్కువగా తీసుకుంటారు. అయితే అధిక సోడియం శరీరంలో కాల్షియం విసర్జనను పెంచి రాళ్లు ఏర్పడే అవకాశాన్ని పెంచుతుంది. అలాగే ఎర్ర మాంసం, అధిక చక్కెర కలిగిన పానీయాలు, తగినంత నీరు తాగకుండా ఎక్కువ వ్యాయామం చేయడం కూడా కిడ్నీ రాళ్ల ప్రమాదాన్ని రెట్టింపు చేస్తాయి.
ఎలా నివారించాలి?
కిడ్నీ రాళ్లను నివారించడానికి సులభమైన మార్గం తగినంత నీరు తాగడం. రోజుకు కనీసం 2.5 నుంచి 3 లీటర్ల వరకు నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. వేసవిలో బయట ఎక్కువగా తిరిగేవారు ఇంకా ఎక్కువ నీరు తీసుకోవడం మంచిది. నిమ్మరసం కలిపిన నీరు కూడా ఎంతో ఉపయోగకరం. ఇందులో ఉండే సిట్రేట్ పదార్థం రాళ్లు ఏర్పడకుండా సహాయపడుతుంది.
ఆహారంలో జాగ్రత్తలు
ఉప్పు వినియోగాన్ని తగ్గించాలి. తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, కోల్డ్ డ్రింక్స్ తగ్గించాలి. నీరు ఎక్కువగా ఉన్న పుచ్చకాయ, దోసకాయ వంటి పండ్లు తీసుకోవడం మంచిది. అయితే, మూత్రం ముదురు పసుపు రంగులో రావడం, మూత్ర విసర్జనలో మంట, నడుము నొప్పి, కడుపు పక్క భాగంలో నొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ముఖ్యంగా వేసవిలో చిన్న నిర్లక్ష్యమే కిడ్నీ రాళ్లకు కారణమవుతుంది. కాబట్టి తగినంత నీరు తాగడం, సరైన ఆహారం తీసుకోవడం, శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచడం ద్వారా ఈ సమస్యను చాలా వరకు నివారించవచ్చు అని సూచిస్తున్నారు వైద్య నిపుణులు.. అయితే, ఇది అవగాహన కోసమే.. ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే.. వెంటనే వైద్యుడిని సంప్రదించడ ఎంతో అవసరం..
తాజావార్తలు
-
Team India Players: అఫ్గాన్ సిరీస్కు వన్డే, టెస్ట్ జట్ల ఎంపిక.. ఎవరెవరికి ఛాన్స్ ఇచ్చారంటే..
-
Putin: మరోసారి భారత్ టూర్కు పుతిన్.. ఎప్పుడంటే..!
-
Twisha Sharma Case: ట్విషా శర్మ భర్తపై లుక్ ఔట్ నోటీసులు
-
Manchu Manoj: రాజకీయాల్లోకి మంచు వారి కోడలు! స్పష్టం చేసిన హీరో మనోజ్….
-
PM Modi: ఐస్లాండ్ ప్రధాని క్రిస్ట్రాన్ మ్జోల్తో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
ట్రెండింగ్
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!