I Love My Kidneys: కిడ్నీలు దెబ్బతినకుండా ఉండాలంటే ఇవి తినకండి.. ఎక్స్పర్ట్ వార్నింగ్.!
- కిడ్నీలకు మొదటి శత్రువే ఎనర్జీ డ్రింక్స్
- డిటాక్స్ జ్యూస్లు నిజంగానే మంచివేనా?
- ఫుడ్ కలర్స్ , నమకీన్లలో దాగిన ప్రమాదం
- జ్యూస్ల బదులు పండ్లు తినడమే ఎందుకు ఉత్తమం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి, మనల్ని ఆరోగ్యంగా ఉంచే కిడ్నీల పనితీరు నెమ్మదించినా లేదా దెబ్బతిన్నా అది ప్రాణాంతకమవుతుంది. అందుకే న్యూట్రిషనిస్ట్ అమితా గాడ్్రే తన కిడ్నీల మీద ఉన్న ప్రేమతో, వాటిని కాపాడుకోవడానికి తన దైనందిన ఆహారంలో కొన్ని పదార్థాలను పూర్తిగా నిలిపివేశారు. ఆ ఆరు రకాల ఆహారాలు , పానీయాలు కిడ్నీలపై ఎలా ప్రభావం చూపుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎనర్జీ డ్రింక్స్ , అధిక కెఫీన్
Also Read
- Ragi Burfi Recipe: ఎముకలకు బలం.. రక్తహీనతకు చెక్.. వంటరాని వాళ్లు కూడా ఈజీగా చేసుకునే హెల్తీ స్వీట్!
- Vitamin D Deficiency : విటమిన్ డి లోపం.. కేవలం ఎండలో కూర్చుంటే సరిపోతుందా.?
- Ragi Teepi Kudumulu: అమ్మమ్మల కాలం నాటి టేస్టీ రెసిపీ.. హెల్తీ 'రాగి తీపి కుడుములు' ఇలా ట్రై చేయండి!
- Anemia in Children : చిన్నపిల్లల్లో రక్తహీనత.. తల్లిదండ్రులు గమనించాల్సిన హెచ్చరిక సంకేతాలు, నివారణ మార్గాలు.!
చాలామంది తక్షణ శక్తి కోసం ఎనర్జీ డ్రింక్స్ తాగుతుంటారు. కానీ వీటిలో కేలరీలు , కెఫీన్ మోతాదు చాలా ఎక్కువగా ఉంటుంది. అధిక కెఫీన్ రక్తపోటును పెంచి కిడ్నీలపై భారాన్ని కలిగిస్తుంది. అందుకే అమితా గాడ్్రే వీటికి పూర్తిగా దూరంగా ఉంటారు.
డిటాక్స్ , వెజిటబుల్ జ్యూస్లు
విషతుల్యాలను బయటకు పంపుతాయనే పేరుతో మార్కెట్లో దొరికే డిటాక్స్ డ్రింక్స్ లేదా ప్యాక్ చేసిన వెజిటబుల్ జ్యూస్లకు ఆమె నో చెబుతారు. వీటిలో ఆక్సలేట్ (Oxalate) భారం ఎక్కువగా ఉంటుందని, ఇది కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటానికి కారణమవుతుందని ఆమె హెచ్చరిస్తున్నారు. సహజంగా లభించే పండ్లు, కూరగాయలను ముక్కలుగా తినడమే శ్రేయస్కరం.
కృత్రిమ రంగులు కలిపిన ఆహారాలు
కేకులు, చికెన్ లాంటి పదార్థాల్లో ఆకర్షణ కోసం ఎరుపు లేదా ఆకుపచ్చ రంగులను కలుపుతుంటారు. ఇటువంటి ‘ఫుడ్ కలర్స్’ కిడ్నీల వడపోత సామర్థ్యంపై ప్రభావం చూపుతాయి. కృత్రిమ రంగులు ఉన్న పదార్థాలను ఎప్పుడూ ముట్టుకోనని ఆమె స్పష్టం చేశారు.
నమకీన్ , ప్యాక్ చేసిన స్నాక్స్
చిప్స్, భుజియా, ఫర్సాన్ వంటి నమకీన్లలో ఉప్పు (సోడియం) , ట్రాన్స్ ఫ్యాట్స్ అత్యధికంగా ఉంటాయి. అధిక ఉప్పు రక్తపోటును పెంచి కిడ్నీ నాళాలను దెబ్బతీస్తుంది. గుండె , ధమనుల ఆరోగ్యం కోసం కూడా వీటిని పక్కన పెట్టడం మంచిది.
విప్డ్ క్రీమ్ (Whipped Cream)
కేకులు , డెజర్ట్లపై ఉండే విప్డ్ క్రీమ్ కేవలం పామ్ ఆయిల్ మాత్రమేనని అమితా గాడ్్రే పేర్కొన్నారు. ఇది శరీరంలో కొలెస్ట్రాల్ పెంచడమే కాకుండా కిడ్నీల ఆరోగ్యానికి కూడా ఏమాత్రం మంచిది కాదు.
ఫ్రూట్ జ్యూస్లు
పండ్లను జ్యూస్లా తాగి దానిలోని పీచు పదార్థాన్ని (Fibre) వదిలేయడం కంటే, నేరుగా పండును తినడమే ఉత్తమమని ఆమె అభిప్రాయపడ్డారు. జ్యూస్లలో చక్కెర సాంద్రత ఎక్కువగా ఉండి, శరీరానికి అందాల్సిన పోషకాలు తగ్గిపోతాయి.
కిడ్నీల ఆరోగ్యం మనం తీసుకునే ఆహారంపైనే ఆధారపడి ఉంటుంది. పైన పేర్కొన్న పదార్థాలను నియంత్రించడం వల్ల కిడ్నీల ఆయుష్షును పెంచుకోవచ్చు. తగినంత నీరు తాగుతూ, తాజా కూరగాయలు , పండ్లను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా కిడ్నీలను సురక్షితంగా ఉంచుకోవచ్చు.
తాజావార్తలు
-
SRH: విధ్వంసం స్పష్టించిన కాటేరమ్మ కొడుకులు.. టాప్ లోకి దూసుకెళ్లిన హైదరాబాద్.. పలు రికార్టులు బద్దలు..
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!