Ear buds: ఇయర్బడ్స్ చాలా సమయం వినియోగిస్తున్నారా..? డబ్ల్యూహెచ్వో హెచ్చరిక
- ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వినికిడి లోపం లేదా చెవుడు వచ్చే సమస్య
- గత కొన్ని సంవత్సరాలుగా యువకులలో కూడా పెరుగుతున్న ఈ ప్రమాదం
- ఆందోళన వ్యక్తం చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)
- ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు.. ఇయర్బడ్లు.. హెడ్ఫోన్ల వాడకం పెరుగుతున్నందున..
- వినికిడి లోపం.. చెవుడు కేసులు చాలా ఎక్కువగా ఉన్నాయి- డబ్ల్యూహెచ్వో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వినికిడి లోపం లేదా చెవుడు వచ్చే ప్రమాదం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. వయసు పెరిగే కొద్దీ చెవి వ్యాధులు రావడం సాధారణమని భావిస్తారు. అయితే ఇటీవలి నివేదికల ప్రకారం.. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రమాదం యువకులలో కూడా పెరుగుతోంది. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇటీవలి నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, ఇయర్బడ్లు.. హెడ్ఫోన్ల వాడకం పెరుగుతున్నందున వినికిడి లోపం.. చెవుడు కేసులు చాలా ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. డబ్ల్యూహెచ్వో తన నివేదికలో 12 నుండి 35 సంవత్సరాల వయస్సు గల ఒక బిలియన్ (100 కోట్ల) మందికి పైగా వినికిడి లోపం లేదా చెవుడు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది. దీనికి ప్రధాన కారణం ఇయర్బడ్ల ద్వారా ఎక్కువసేపు సంగీతాన్ని వినడం.. ఎక్కువ శబ్దం వచ్చే ప్రదేశాలలో ఉండటం అని తెలిపింది. ఈ పరికరాలు లోపలి చెవిని దెబ్బతీస్తాయి. ప్రతి ఒక్కరూ ఈ పరికరాలను చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి.
Curd: వర్షాకాలంలో పెరుగు తినడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా..?
Also Read
- Yoga vs Gym: గుండె ఆరోగ్యానికి యోగా బెటారా? జిమ్కు వెళ్లాలా.?
- Red Chili Test: వంటగదిలో వాడే ఎండు మిర్చి కారం నకిలీదా..? అసలుదా..? సింపుల్గా తెలుసుకోండిలా..
- Monsoon Diseases: వర్షాకాలంలో విజృంభించే ప్రమాదకర వ్యాధులు ఇవే... వైద్యుల హెచ్చరిక
- Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ "పెసర గారెలు" చేసేయండి ఇలా.!
భారీ శబ్దం చెవులకు హాని కలిగిస్తోంది..
ఇయర్బడ్లు లేదా హెడ్ఫోన్లతో వ్యక్తిగత మ్యూజిక్ ప్లేయర్ను ఉపయోగించే 65 శాతం మంది వ్యక్తులు 85 (డెసిబెల్) కంటే ఎక్కువ వాల్యూమ్లో నిరంతరం ఉపయోగిస్తున్నారు. అటువంటప్పుడు ఆ తీవ్రత చెవుల లోపలి భాగాలకు చాలా హానికరం అని గుర్తించారు. అలాగే భారీ శబ్దాల వల్ల చెవి లోపల కణాలు కాలక్రమేణా దెబ్బతింటాయి. దాని వల్ల వినికిడి సామర్థ్యం మరింత క్షీణిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా రాబోయే దశాబ్దాలలో మిలియన్ల మంది ప్రజలు ఈ రకమైన సమస్యతో బాధపడే అవకాశం ఉంది.
నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు..
ఈ తీవ్రమైన ముప్పుపై శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని ENT డాక్టర్ డేనియల్ ఫింక్ చెప్పారు. ప్రస్తుతం జనాలు ఇయర్బడ్ల వంటి పరికరాలను ఎక్కువగా ఉపయోగించడం వల్ల 40 ఏళ్ల వయస్సులో తక్కువ వినికిడి లోపానికి దారితీయవచ్చని అన్నారు. వినికిడి లోపం కేవలం చెవి సమస్యలకు మాత్రమే కాదని.. మెదడు సంబంధిత వ్యాధుల ప్రమాదం కూడా గణనీయంగా పెరుగుతుందని తెలిపారు. వినికిడి లోపం ఉన్నవారికి జ్ఞాపకశక్తి కోల్పోవడం వచ్చే ప్రమాదం రెండింతలు ఉన్నట్లు గుర్తించారు. అలాగే.. పూర్తిగా వినలేని, చెవుడు బాధితులైన వ్యక్తులలో జ్ఞాపకశక్తి ప్రమాదం ఐదు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు.
శబ్దాన్ని తక్కువగా ఉంచండి
ఆరోగ్య నిపుణులు ధ్వనిని డెసిబెల్స్ అనే యూనిట్లో కొలుస్తారు. 60-70 డెసిబుల్స్ లేదా అంతకంటే తక్కువ శబ్దం మంచిదేనని చెబుతున్నారు. 85 లేదా అంతకంటే ఎక్కువ శబ్దాలకు ఎక్కువసేపు వినడం వల్ల వినికిడి లోపం ఏర్పడవచ్చు. ఇయర్బడ్లు, హెడ్ఫోన్లు వంటి పరికరాల పరిమాణం 100 కంటే ఎక్కువగా ఉంటుంది. వీటిని కొన్ని గంటలు మాత్రమే ఉపయోగించాలి. లేదంటే.. చెవి కణాలకు హాని కలిగించవచ్చు, వినికిడి సమస్యలను పెంచుతుంది.
తాజావార్తలు
-
IND Vs IRE: పసికూన చేతిలో భారత్ ఘోర ఓటమి.. ఎగిరిగంతేసిన ఐర్లాండ్ అభిమానులు..
-
Kishan Reddy : అసదుద్దీన్ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్
-
Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
-
Buckingham Palace: రూ. 4,600 కోట్లు ఖర్చు పెట్టినా.. బకింహామ్ ప్యాలెస్ను వీడనున్న కింగ్ చార్లెస్!
-
Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!