Health Drinks: గ్యాస్ సమస్యను దూరం చేసే డ్రింక్.. ఒక్కసారి ట్రై చేయండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Health Drinks: మన ఉదయం దినచర్య ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొన్ని హెల్తీ డ్రింక్స్ తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మలబద్ధకం, గ్యాస్ట్రిక్, మధుమేహం వంటి అనేక సమస్యలను నివారిస్తుందని చెప్పారు. ప్రస్తుత కాలంలో చాలా మందికి గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారు. సమయానికి తినకపోవడంతో గ్యాస్ట్రిక్ సమస్య చిన్న పెద్ద అనే తేడాలేకుండా అందరికి వేధిస్తుంది. అయితే ఇటువంటి సమస్యకు సింపుల్ మనం ఇంట్లోనే డ్రింక్స్ చేసుకుని తాగితే మలబద్ధకం, గ్యాస్ట్రిక్, మధుమేహం లాంటి సమస్యలను దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
మలబద్ధకం, గ్యాస్ట్రిక్, మధుమేహం సమస్యలకు డ్రింక్స్ ఇవే…
Also Read
- Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
- Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే 'రాగి మునగాకు రొట్టె' చేసేయండి ఇలా.!
- Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
- Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
మెంతికూరలో ఔషధ గుణాలున్నాయి. మెంతికూరలో రైబోఫ్లావిన్, కాపర్, పొటాషియం, కాల్షియం, ఐరన్, మాంగనీస్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎ, బి6, సి, కె వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు, టైప్-2 మధుమేహం రాకుండా ఉండేందుకు మెంతికూర నానబెట్టిన నీటిని తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. మెంతికూరలో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉన్నాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. ఒక చెంచా మెంతి గింజలను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టండి. ఉదయం ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగండి మరియు మెంతులు మింగండి. ఈ పానీయం ఎసిడిటీని చెక్ చేస్తుంది, కొలెస్ట్రాల్ను కరిగిస్తుంది, పీరియడ్స్ క్రాంప్స్, అధిక బరువు వంటి సమస్యలను దూరం చేస్తుంది.
గ్యాస్ట్రిక్ ఎసిడిటీ అనేది ప్రస్తుత జీవనశైలి కారణంగా చాలా మంది ఎదుర్కొంటున్న సాధారణ సమస్య. కొన్నిసార్లు గ్యాస్ట్రిక్ భయంకరమైన నొప్పిని కలిగిస్తుంది. వేసవి కాలంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యను నివారించడానికి, కొన్ని ఎండుద్రాక్షలను నీటిలో వేసి రాత్రంతా నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం ఆ నీటిని తాగి ఎండుద్రాక్ష తినండి. ఎండుద్రాక్షలో క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ సి ఉంటాయి.. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఉదయాన్నే పరగడుపున ఈ నీటిని తాగితే.. హైపర్ టెన్షన్ అదుపులో ఉంటుంది, రక్తహీనత తగ్గుతుంది, పైల్స్ సమస్య తొలగిపోతుంది, ఎముకలు దృఢంగా మారుతాయి.
Read also: Vidadala Rajini: తప్పిన ప్రమాదం.. లిఫ్టులో చిక్కుకున్న మంత్రి రజనీ, ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్
చియా గింజల్లో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, కరిగే ఫైబర్ మరియు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. చియా గింజల్లో ఉండే కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇది ఆస్టియోపోరోసిస్ సమస్యను నివారిస్తుంది. ఒక చెంచా చియా గింజలను ఒక గ్లాసు నీటిలో నానబెట్టి, ఖాళీ కడుపుతో ఈ నీటిని త్రాగాలి. చియా గింజల్లో ఉండే ఫైబర్, ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. చియా సీడ్ వాటర్ గుండె ఆరోగ్యానికి కూడా మంచిది.
ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ‘ఎ’, విటమిన్ ‘ఇ’ మరియు ఫ్యాటీ యాసిడ్స్ మంచివి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఆలివ్ గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం ఆ నీటిని త్రాగాలి. ఈ నీటిని రోజూ తాగితే ఒత్తిడి తగ్గి సంతానోత్పత్తి పెరుగుతుంది. క్యాన్సర్ చికిత్స పొందుతున్న వారు ఈ నీటిని తాగితే, కీమోథెరపీ వల్ల ఆరోగ్యకరమైన కణజాలాలపై ప్రతికూల ప్రభావం పడకుండా జాగ్రత్తపడవచ్చు. ఎండు నేరేడు పండ్లను నీటిలో నానబెట్టి తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. నేరేడు పండ్లలో పొటాషియం, ఐరన్, బీటా కెరోటిన్, ఫైబర్ మరియు విటమిన్ సి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. నేరేడు పండు శరీరంలో ద్రవ స్థాయిలను నివారిస్తుంది. ఇది మలబద్ధకం వంటి అనేక జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. రక్తహీనత, చర్మ సమస్యలు దూరమవుతాయి.
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
NTA Exam Schedule: పరీక్షల క్యాలెండర్ విడుదల చేసిన NTA.. యూజీసీ నెట్ తేదీలివే..
-
Pakistan: పాక్ ఆర్మీకి అమెరికా డ్రోన్లు.. ట్రంప్ కుమారులతో లింక్.!
-
Trump-Houthi: సౌదీకి ట్రంప్ షాక్! హౌతీలతో రహస్య భేటీ.. అమెరికా సైడ్ అయినట్టేనా?
-
Warangal Cyber Crime : రూ.8 వేల కోసం ఖాతాలు అమ్మేశారు.. 185 సైబర్ కేసుల్లో లింకులు
-
Sanatana Row: తమిళనాడులో ‘‘సనాతన ధర్మం’’పై వివాదం.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!