చాలా మందికి ఎండాకాలంలో సూర్యరశ్మికి గురైన వెంటనే తలనొప్పి ప్రారంభమవుతుంటుంది. దీనిని సాధారణంగా భావించి నిర్లక్ష్యం చేయడం సరైనది కాదు, ఎందుకంటే ఇది శరీరంలో కొన్ని ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు. తల భారంగా అనిపించడం, కళ్లలో మంట, తల తిరగడం, బలహీనత, అధికంగా చెమట పట్టడం వంటి లక్షణాలు దీనికి తోడవ్వచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఎండ వల్ల తలనొప్పి రావడానికి ప్రధాన కారణాలు ఇవి..
శరీర ఉష్ణోగ్రత పెరగడం: తీవ్రమైన ఎండ , వేడి వల్ల శరీర ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పెరుగుతుంది, ఇది తల భారానికి , నొప్పికి దారితీస్తుంది.
Macharla: ఏకాంతంగా ఉన్న జంటలే టార్గెట్.. వీడియోలతో ఏఎస్ఐ అరాచకాలు..!
డీహైడ్రేషన్ : చెమట ద్వారా శరీరంలోని నీరు , ఖనిజాలు బయటకు వెళ్లిపోయినప్పుడు డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. దీనివల్ల తలనొప్పి తీవ్రమవుతుంది.
మెడ/కళ్లపై ఒత్తిడి: తీవ్రమైన వెలుతురు నేరుగా కళ్లపై పడటం వల్ల మైగ్రేన్ సమస్య ఉన్నవారిలో తలనొప్పి త్వరగా ప్రేరేపించబడుతుంది.
ఖాళీ కడుపుతో వెళ్లడం: ఎండలో ఖాళీ కడుపుతో తిరగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గి, తలనొప్పికి కారణమవుతుంది. నిద్రలేమి , అలసట కూడా ఈ సమస్యను మరింత పెంచుతాయి.
ఎవరికి ప్రమాదం ఎక్కువ?
మైగ్రేన్ ఉన్నవారు, త్వరగా డీహైడ్రేషన్ బారిన పడేవారు, ఎక్కువ సమయం ఖాళీ కడుపుతో ఉండేవారు ఈ సమస్యకు ఎక్కువగా గురవుతారు. అలాగే చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు , ఎండలో శారీరక శ్రమ చేసేవారిపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
Home Minister Vangalapudi Anitha: ఆపరేషన్ ట్రేస్లో 900 పిల్లలను రక్షించాం..
నివారణ మార్గాలు:
నీరు ఎక్కువగా తాగాలి: ఎండలోకి వెళ్లే ముందు , వచ్చిన తర్వాత తగినంత నీరు తాగడం చాలా ముఖ్యం.
రక్షణ కవచాలు: బయటకు వెళ్లేటప్పుడు టోపీ, గొడుగు లేదా స్కార్ఫ్ ధరించాలి. కళ్లను రక్షించుకోవడానికి సన్ గ్లాసెస్ వాడటం మంచిది.
సమయం చూసుకోవాలి: వీలైనంత వరకు మధ్యాహ్నం ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు బయటకు వెళ్లడం తగ్గించాలి.
ఆహారం: బయటకు వెళ్లే ముందు ఖాళీ కడుపుతో ఉండకుండా, శరీరాన్ని చల్లబరిచే ఆహారాన్ని కొద్దిగా తీసుకోవాలి.
వస్త్రధారణ: తేలికపాటి , వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది.
ఎండలోకి వెళ్లిన వెంటనే వచ్చే తలనొప్పిని మీ శరీరం ఇస్తున్న హెచ్చరికగా భావించి, సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. సమస్య తీవ్రంగా ఉంటే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.