Macharla: ఏకాంతంగా ఉన్న జంటలే టార్గెట్.. వీడియోలతో ఏఎస్ఐ అరాచకాలు..!
- పల్నాడు జిల్లా మాచర్లలో ఏఎస్ఐ అరాచకాలు
- ఏకాంతంగా ఉన్న ప్రేమజంటలే ప్రధాన టార్గెట్
- ఆటో డ్రైవర్ను ఇన్ఫార్మర్గా ఉపయోగించిన ఏఎస్ఐ
- జంటల వీడియోలను రహస్యంగా చిత్రీకరించి బ్లాక్ మెయిల్
- వీడియోలు బయటపెడతామని బెదిరించి డబ్బులు వసూలు
- మహిళలను లైంగికంగా వేధిస్తున్నట్లు ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Macharla: రక్షక భట నిలయాలే భక్షక నిలయాలుగా మారుతున్నాయా.? శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే కామపిశాచులుగా మారి అబలలపై పడుతున్నారా.? అంటే పల్నాడు జిల్లా మాచర్ల నుంచి వస్తున్న వార్తలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. మాచర్లలో ఒక ఏఎస్ఐ (ASI) సాగిస్తున్న దౌర్జన్యాలు, లైంగిక వేధింపుల ఉదంతం ఇప్పుడు స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది.
Home Minister Vangalapudi Anitha: ఆపరేషన్ ట్రేస్లో 900 పిల్లలను రక్షించాం..
Also Read
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
- Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
- Indian Player: మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. రూ. 95 లక్షల లంచం ఇస్తూ దొరికిపోయిన భారత ప్లేయర్..
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
అందిన సమాచారం ప్రకారం.. మాచర్లకు చెందిన ఒక ఏఎస్ఐ, ఏకాంతంగా గడుపుతున్న ప్రేమికులను లక్ష్యంగా చేసుకున్నాడు. ఇందుకోసం జమ్మలమడకకు చెందిన ఒక ఆటో డ్రైవర్ను తన ఇన్ఫార్మర్గా నియమించుకున్నాడు. ఎక్కడైనా జంటలు ఏకాంతంగా కనిపిస్తే, సదరు ఆటో డ్రైవర్ ద్వారా వారిని రహస్యంగా వీడియోలు తీయిస్తున్నాడు. ఆ వీడియోలను అడ్డం పెట్టుకుని సదరు ఏఎస్ఐ తన అసలు స్వరూపాన్ని బయటపెడుతున్నాడు.
వారి ఏకాంత వీడియోలు చూపిస్తూ ఆ జంటలను భయభ్రాంతులకు గురిచేయడం ఈ కిలేడి ఏఎస్ఐకి పరిపాటిగా మారింది. వీడియోలు బయటపెడతామని, కేసు పెడతామని బెదిరించి బాధితుల నుంచి భారీగా నగదు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కేవలం డబ్బుతోనే ఆగకుండా, తన వికృత కోరిక తీర్చాలంటూ యువతులు, మహిళలను వేధిస్తున్నట్లు తెలుస్తోంది. వీడియోలను సాకుగా చూపి లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తున్న ఈ అధికారి తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ అరాచకాల్లో సదరు ఏఎస్ఐ ఒక్కడే కాదు, మరో ఏఎస్ఐ మరియు ఒక కానిస్టేబుల్ కూడా భాగస్వాములుగా ఉన్నట్లు సమాచారం. వీరంతా ఇదే తరహాలో మహిళలను లోబర్చుకుంటూ, బ్లాక్ మెయిలింగ్కు పాల్పడుతున్నారని బాధితులు వాపోతున్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులే వేటగాళ్లుగా మారడంతో సామాన్య ప్రజలు భయం గుప్పిట్లో గడుపుతున్నారు.
తాజాగా అందిన సమాచారం మేరకు సదరు ఏఎస్ఐ శ్రీనివాస్ ను ఉన్నత అధికారులు సస్పెండ్ చేశారు.
తాజావార్తలు
-
Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
-
Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
-
Indian Player: మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. రూ. 95 లక్షల లంచం ఇస్తూ దొరికిపోయిన భారత ప్లేయర్..
-
EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
-
Rohit Replacement: రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు..? పరిశీలనలో ఈ ఐదుగురి పేర్లు..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?