Ragi Puri: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. రాగి పిండితో మెత్తటి పూరీలు.. ఇలా చేస్తే లొట్టలేయాల్సిందే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ragi Puri: సాధారణంగా పూరీ అంటేనే ఆయిలీ ఫుడ్ అని, అన్-హెల్తీ అని చాలా మంది దూరంగా ఉంటారు. కానీ అదే పూరీని ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే చిరుధాన్యాలతో చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. అద్భుతమైన రుచితో పాటు బోలెడంత ఆరోగ్యాన్ని ఇచ్చే ‘రాగి పూరీ’ ఇప్పుడు ట్రెండింగ్లోకి వచ్చింది. రాగి పిండితో చేసినా కూడా పూరీ పూరీలాగే చక్కగా పొంగుతూ, దూదిలా మెత్తగా రావాలంటే కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తే చాలు. దానికి తోడు నోరూరించే బొంబాయి చట్నీ ఉంటే ఆ మజానే వేరు. ఈ హెల్తీ రెసిపీని ఎలా చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రాగి పూరీ తయారీ విధానం..
రాగి పూరీలు నల్లగా రాకుండా, సాఫ్ట్గా రావడానికి రాగి పిండితో పాటు కొద్దిగా గోధుమ పిండిని కూడా కలపాలి. ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు రాగి పిండి, ఒక కప్పు గోధుమ పిండి, తగినంత ఉప్పు, కొద్దిగా నూనె వేసి బాగా కలపాలి. రాగి పిండి జిగురు తక్కువగా ఉంటుంది కాబట్టి, పిండిని కలిపేటప్పుడు గోరువెచ్చని నీటిని వాడితే పూరీలు విరిగిపోకుండా మెత్తగా వస్తాయి. తర్వాత ఆ పిండిని అరగంట పాటు నానబెట్టిన తర్వాత, చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పూరీల్లా ఒత్తుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత వేయిస్తే పూరీలు చక్కగా పొంగుతాయి.
Also Read
- Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
- Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే "పనీర్ భుర్జీ"తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
- Healthy Lifestyle: ఎక్కువ కాలం ఆరోగ్యంగా బతకాలని ఉందా.. ఈ టైమ్లోనే బ్రేక్ఫాస్ట్, డిన్నర్ చేయండి!
- Food Facts : పప్పులో తెల్లటి నురుగు.. మురికేనా.? అసలు నిజం ఇదే.!
కాంబినేషన్ ‘బొంబాయి చట్నీ’..
రాగి పూరీలకు బెస్ట్ కాంబినేషన్ బొంబాయి చట్నీ. ముందుగా ఒక బాణలిలో నూనె వేసి తాలింపు గింజలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఉల్లిపాయలు, కరివేపాకు వేసి వేయించాలి. తర్వాత ఒక గిన్నెలో రెండు స్పూన్ల శనగపిండిని నీళ్లలో ఉండలు లేకుండా కలిపి, వేగుతున్న ఉల్లిపాయ ముక్కల్లో వేయాలి. తగినంత ఉప్పు, పసుపు వేసి చిక్కబడే వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. అంతే మన బొంబాయి చట్నీ కంప్లీట్ అయిపోతుంది.
ప్రయోజనాలు ఇవే..
చిరుధాన్యాలన్నింటిలో రాగులలో క్యాల్షియం అత్యధికంగా ఉంటుంది. ఇది ఎముకలను బలంగా ఉంచడమే కాకుండా, చిన్న పిల్లల్లో ఎముకల పెరుగుదలకు, వృద్ధుల్లో వచ్చే ఆస్టియోపోరోసిస్ (ఎముకల బలహీనత) సమస్యను నివారించడానికి తోడ్పడుతుంది. రాగులలో ఐరన్ (ఇనుము) సమృద్ధిగా ఉంటుంది. రక్తహీనత సమస్యతో బాధపడేవారు రాగిని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. గోధుమ లేదా మైదా పిండితో పోలిస్తే రాగులలో గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగవు. చక్కెర వ్యాధి ఉన్నవారికి ఇది మంచి అల్పాహారంగా పని చేస్తుంది.
రాగులలో ఫైబర్ (పీచు పదార్థం) ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఈ పూరీలు తిన్న తర్వాత కడుపు నిండుగా అనిపించి, ఎక్కువ సేపు ఆకలి వేయదు. ఇది అతిగా తినడాన్ని తగ్గించి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే రాగులలో ఉండే అమైనో యాసిడ్స్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ను పెంచడంలో సహాయపడతాయి. దీంతో గుండె సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుతాయి. దీంట్లో అధిక పీచు పదార్థం ఉండటం వల్ల మలబద్ధకం సమస్య తొలగిపోయి, జీర్ణవ్యవస్థ సాఫీగా సాగుతుంది. వెరైటీ, హెల్తీ వంటకాల కోసం ప్రయత్నించే వారు ఈ రాగి పూరీలను తప్పకుండా టేస్ట్ చేయాల్సిందే.
తాజావార్తలు
-
Nepal Floods: 90 నిమిషాల్లో నేపాల్కు పెను ముప్పు.. మరో సరస్సు బద్ధలయ్యే ఛాన్స్..
-
Raviteja: ‘ఇరుముడి’ విధ్వంసం.. వివేక్ ఆత్రేయతో మాస్ మహారాజా క్రేజీ ప్రాజెక్ట్ ఖరారు!
-
Joe Root: రిక్కీ పాంటింగ్ రికార్డు చెల్లాచెదురు.. జో రూట్ అరుదైన ఘనత..
-
Dasara: క్రేజీ హీరోస్ అందరూ మూకుమ్మడిగా దసరా పండగకే ?
-
Nikitha Godishala: యూఎస్ లో మాజీ ప్రియురాలి హత్య కేసు.. ఆగ్రాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్
ట్రెండింగ్
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!