Kidney Stones: కిడ్నీలో రాళ్లున్నాయా.. ఇలా చేయండి తొందరగా కరిగిపోతాయి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kidney Stones: కిడ్ని సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారా..? కిడ్నిలో రాళ్లతో ఎటు తిరగలేకపోతున్నారా..? కిడ్నీలో స్టోన్ వచ్చిన వారి బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. ఎందుకంటే పొత్తి కడపులోంచి నొప్పి పొడుచుకొస్తుంది. అంతేకాకుండా యూరిన్ కు వెళ్తే.. మంటతో బాధపడుతారు. మహిళ కన్నా.. పురుషుల్లోనే కిడ్నీలో రాళ్ల సమస్య ఎక్కువగా ఉంటుంది. ఒకసారి కిడ్నీలో రాళ్లు వచ్చినవారు.. తగు జాగ్రత్తలు తీసుకోకపోతే మళ్లీ తిరగబెట్టొచ్చు. సుమారు 50శాతం మందికి ఏడేళ్లలోపే ఇవి రెండోసారి పుట్టుకు వచ్చే అవకాశముంది. నీళ్లు తక్కువ తాగడం, మాంసాహారం ఎక్కువగా తినడం, శరీరంలో విటమిన్ బి6, సి లోపం ఉన్నా, విటమిన్ డి అధికంగా ఉన్నప్పుడు, ఆల్కహాల్ ఎక్కువగా తాగే వారికి, కిడ్నీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా సోకుతున్నా, ఆలస్యంగా భోజనం చేసినా.. కిడ్నీలో రాళ్లు వస్తాయి.
Read Also: Draupadi Murmu : హైదరాబాద్కు చేరుకున్న ద్రౌపది ముర్ము.. స్వాగతం పలికిన సీఎం కేసీఆర్
Also Read
- Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
- Healthy Diet : షుగర్ ఉందా.? ఈ 6 ఫుడ్ మిస్టేక్స్ మీ కిడ్నీలను దెబ్బతీస్తున్నాయ్.!
- Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే "పచ్చిమిరపకాయ రోటి పచ్చడి" చేసేయండి ఇలా.!
- Blood Pressure Readings: బీపీ ఎక్కువా? తక్కువా?.. అసలు బీపీ రీడింగ్స్ అర్థం ఏమిటో తెలుసా..?
అయితే కిడ్నిలో రాళ్లు తొలగిపోవాలంటే నీరు ఎక్కువతాగాలి. పండ్ల రసాలు, ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి. నీరు ఎక్కుగా తాగితే.. రాళ్లు ఏర్పడటానికి దారితీసే పదార్థాలు పలుచగా అవుతాయి. దీంతో ఇవి మూత్రంతో పాటు తేలికగా బయటకు వచ్చేస్తాయి. రోజుకు కనీసం.. 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తాగితే మంచిది. అంతేకాకుండా మీరు తీసుకునే ఆహార పదార్థాలలో సరిపడా కాల్షియం తీసుకోండి. లేదంటే యూరిన్లో ఆక్జలేట్ స్థాయిలు పెరిగి రాళ్లు వస్తాయి. కాల్షియం పేగులలో ఆక్సలేట్ను బంధిస్తుంది, దాన్ని ఎక్కువగా గ్రహించకుండా నియంత్రిస్తుంది. కాబట్టి వయసుకు తగినట్టుగా క్యాల్షియం తీసుకునేలా చూసుకోవాలి.
Read Also: Salaar: సలార్ లో రాఖీ భాయ్.. కథ తెలిసిపోయింది..?
అంతేకాకుండా కిడ్నీలో రాళ్ల సమస్య ఉంటే నాన్ వెజ్ తినడం తగ్గించాలి. మాంసం, చికెన్, గుడ్లు, సముద్ర రొయ్యలు, చేపల వంటి నాన్వెజ్ ఆహారం నుంచి వచ్చే ప్రొటీన్లు మూత్రంలో యూరిక్ యాసిడ్ మోతాలను పెంచుతుంది. దీని వల్ల కిడ్నీలో రాళ్లకు దారి తీస్తుంది. ప్రోటీన్ను మరీ ఎక్కువగా తీసుకుంటే రాళ్లు ఏర్పడకుండా చూసే సిట్రేట్ స్థాయిలు కూడా పడిపోతాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని.. నాన్వెజ్ తక్కువగా తీసుకోవడం మంచిది. మనం రోజుతినే వంటల్లో ఉప్పును తగ్గిస్తే మంచిది. సోడియం ఎక్కువగా తీసుకుంటే యరిన్లో క్యాల్షియం స్థాయిలు పెరిగేలా చేస్తుంది. కాబట్టి ఉప్పు తక్కువగా తీసుకోవడం మంచిది.
- Tags
- Health
- kidney
- pain
- stones
- telugu news
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?