Curd In Winter: శీతాకాలంలో పెరుగు తినడం హానికరమా?.. అసలు నిజం ఏంటంటే?
- శీతాకాలంలో ఆహారం విషయంలో ఎన్నో ప్రశ్నలు
- పెరుగు తినడం వల్ల జలుబు, ఫ్లూ, గొంతు నొప్పి
- శీతాకాలంలో పెరుగు తినడం హానికరమా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం శీతాకాలం నడుస్తోంది. శీతాకాలంలో జనాలకు తమ ఆహారం విషయంలో చాలా ప్రశ్నలు మదిలో మెదులుతుంటాయి. అందులో ప్రదమైనది ‘పెరుగు’. వేసవిలో మనం పెరుగును తినడానికి ఎంతో ఇష్టపడతాము. కానీ శీతాకాలం వచ్చిన వెంటనే చాలా మంది పెరుగు తినడం మానేస్తారు. శీతాకాలంలో పెరుగు తినడం వల్ల జలుబు, ఫ్లూ, గొంతు నొప్పి వస్తుందని అనుకుంటున్నారు. మరి ఇందులో ఎంత నిజముంది, అది అపోహ మాత్రమేనా? అనే విషయం తెలుసుకుందాం.
కాల్షియం, భాస్వరం, పొటాషియం సహా బి విటమిన్లు పెరుగులో పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు ఎముకలు బలపడడానికి, నాడీ వ్యవస్థ మెరుగ్గా పనిచేసేందుకు, శక్తిని అందించడానికి సహాయపడతాయి. శీతాకాలంలో పెరుగు తినడం వల్ల శరీరం చురుకుగా పనిచేయడానికి సహాయపడుతుంది. పెరుగులో ప్రోబయోటిక్స్ అనే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. శీతాకాలంలో ఇన్ఫెక్షన్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. శరీరం అనారోగ్యాలతో పోరాడటానికి సహాయపడుతుంది. పెరుగులోని ప్రోబయోటిక్స్ పేగు బాక్టీరియా సమతుల్యతను కాపాడుతుంది. శీతాకాలపు అనారోగ్యాల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది.
Also Read
- Weight Loss Tablets: లావుగా ఉన్నవారికి గుడ్ న్యూస్.. వెయిట్ లాస్ డ్రగ్ అమ్మకాలు షూరు.. ఆ మ్యాజిక్ పిల్ కథేంటో చూడండి!
- Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?
- Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్తో మల్లెపూవులా వస్తుంది!
- Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే 'నేరేడు జామ్' ఇంట్లోనే చేయండి ఇలా.!
Also Read: T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ ట్రోఫీ కోసం.. న్యూజిలాండ్ సీక్రెట్ ప్లాన్!
పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి కూడా సహాయపడతాయి. శీతాకాలంలో జలుబు, ఫ్లూ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల రోగనిరోధక శక్తి బలంగా ఉంటుంది. రోజూ పెరుగు తినడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. అంతేకాదు కాలానుగుణ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. శీతాకాలంలో పెరుగును సరైన రీతి, పరిమాణంలో తీసుకుంటే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే మీరు ఎప్పుడూ పుల్లగా లేదా ఎక్కువ రోజులు నిల్వ ఉంచిన పెరుగును తినకూడదు. శీతాకాలంలో పెరుగును గది ఉష్ణోగ్రతలో ఉంచుకోవాలి. రిఫ్రిజిరేటర్ నుంచి తీసిన వెంటనే పెరుగు తినకూడదు. ఎందుకంటే చల్లని పెరుగు గొంతు నొప్పి, దగ్గును మరింత తీవ్రతరం చేస్తుంది. శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు సాయంత్రం 5 గంటల తర్వాత పెరుగును తీసుకోకూడదు.
గమనిక: ఈ న్యూస్ కేవలం సమాచారం కోసం మాత్రమే. మీ ఆహారంలో ఏవైనా మార్పులు చేసే ముందు వైద్యుడిని లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించండి.
తాజావార్తలు
-
Hrudayam Murali: ‘బాయ్స్’ తర్వాత మళ్లీ నటుడిగా తమన్.. ‘హృదయం మురళి’ ట్రైలర్ చూశారా?
-
Meta: సోషల్ మీడియా చరిత్రలోనే నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్! మెటాకు ఏకంగా రూ.120 లక్షల కోట్ల జరిమానా?
-
Bihar: ప్రశాంత్ కిషోర్కు పోటీగా బీజేపీ నుంచి అభిషేక్ కుమార్.. బంకీపూర్ బైపోల్స్లో టఫ్ ఫైట్
-
CM Revanth Reddy : కడియంపై కొండా సురేఖ ఫిర్యాదు.. సీఎం రేవంత్కు లేఖ.!
-
AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. భూములిచ్చేవారికి కౌలు రూ.40 వేలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్తో మల్లెపూవులా వస్తుంది!
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!