Pak Nuclear Sites: పాకిస్తాన్ అణు నిల్వలు ఉంచిన ప్రదేశంలో ప్రతి 3 గంటలకు ఒకసారి భూకంపం..?
- ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ ను దెబ్బకొట్టిన భారత్..
- పాక్ లోని కిరాణా హిల్స్ సమీపంలో భారత్ దాడి చేసినట్లు టాక్..
- పాక్ అణు నిల్వలు ఉంచిన ప్రదేశంలో ప్రతి 3 గంటలకు ఒకసారి భూకంపం..
- పాక్ అణు నిల్వలు ఉన్న ప్రదేశాల్లో జూన్ 1 నుంచి నేటి వరకు 19 సార్లు భూకంపాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pak Nuclear Sites: ఆపరేషన్ సింధూర్ సందర్భంగా పాకిస్తాన్ కు ఇండియన్ ఆర్మీ గట్టిగా కౌంటర్ ఇచ్చింది. ఈ సందర్భంగా పాక్ లోని అణు నిల్వలు ఉన్న కిరాణా హిల్స్ సమీపంలో భారత్ దాడులు చేసినట్లు సమాచారం. దీనిపై ఇప్పటి వరకు రెండు దేశాలు అధికారికంగా స్పందించినప్పటికీ.. అక్కడ జరిగిన దాడితో తరచుగా భూకంపాలు సంభవిస్తున్నాయని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్లోని కరాచీ నివాసితులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రతి మూడు గంటలకు ఒకసారి స్వల్ప భూకంపం వస్తుందని పేర్కొన్నారు. అయితే, ఇప్పటి వరకు 19 స్వల్ప భూకంపాలు సంభవించాయని వెల్లడించారు. అలాగే, ఈరోజు (మంగళవారం) ఉదయం 9:57 గంటలకు 2.8 తీవ్రతతో భూకంపం వచ్చిందని అన్నారు. ఈ భూకంపాలు ముఖ్యంగా పాకిస్తాన్ అణ్వాయుధ సామగ్రి నిల్వలకు సమీపంలో ఉన్న మాలిర్, లాంధి, క్వాయిదాబాద్ వంటి ప్రాంతాల్లోనే సంభవిస్తున్నాయని వెల్లడించారు.
Read Also: Ambati Rambabu: సీఎం చంద్రబాబుకు కాపులు అంటే ఎందుకంత కోపం..?
Also Read
- Solar Eclipse 2026: రేపే సంపూర్ణ సూర్యగ్రహణం.. ఎక్కడ కనిపిస్తుంది..? భారత్లో పరిస్థితి ఏంటి..? పూర్తి వివరాలు
- Iran VS America: అడుగు పెడితే త*ల తెగిపడుతుంది..అమెరికాకు ఇరాన్ మాస్ వార్నింగ్!
- Trump Secret Flight: ఇరాన్ ముప్పు.. క్యాటరింగ్ ట్రక్కులో ట్రంప్ తరలింపు.. అమెరికా రహస్య ఆపరేషన్..
- Crude Oil Prices: ఇరాన్కు ట్రంప్ ఊహించని షాక్.. ఆకాశాన్నంటిన క్రూడ్ ఆయిల్ ధరలు..
కాగా, పాకిస్తాన్ వాతావరణ శాస్త్రవేత్త అమీర్ హైదర్ తెలిపిన వివరాల ప్రకారం.. లంధి ఫాల్ట్ లైన్ క్రియాశీలతే ఈ భూకంపాలకు ప్రధాన కారణం అన్నారు. ఇది ప్రస్తుతం విస్తృత పరిస్థితులకు దారి తీసే ప్రమాదం ఉందన్నారు. ఈ ఫాల్ట్ లైన్లో పెద్ద భూకంపం రాలేదు.. ఇప్పుడు దానికి సంబంధించిన శక్తి నెమ్మదిగా బయటకు వస్తోందని పేర్కొన్నారు. దీని వల్ల చిన్న భూకంపాలు సంభవిస్తున్నాయని.. ఇవి భవిష్యత్తులో పెద్ద భూకంపాలుగా ఏర్పడే అవకాశాలను తగ్గించడంలో సహాయపడతాయని తెలిపారు. ఈ భూకంపాల కారణంగా ఎటువంటి పెద్ద నష్టం సంభవించదు.. కానీ, ప్రజల్లో భయాందోళనలు మాత్రం ఖచ్చితంగా పెరుగుతాయని చెప్పారు. ఈ భూకంపాల పరంపర వచ్చే వారం వరకు కొనసాగవచ్చని వాతావరణ శాస్త్రవేత్త అమీర్ హైదర్ సూచించారు.
తాజావార్తలు
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
International Credit Cards: భారతీయులకు క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న గ్లోబల్ బ్యాంక్స్.. ఎందుకంటే?
-
Ravi Teja -Vivek : రవితేజ – వివేక్ ఆత్రేయ సినిమాకు నిర్మాతగా దిల్ రాజు పాత స్నేహితుడు
-
Aroopi OTT Release: తరతరాల శాపం… బొమ్మలో బంధించిన యక్షిణి.. ఓటీటీని వణికించేందుకు వస్తున్న ‘అరూపి’!
ట్రెండింగ్
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!