Pak Nuclear Sites: పాకిస్తాన్ అణు నిల్వలు ఉంచిన ప్రదేశంలో ప్రతి 3 గంటలకు ఒకసారి భూకంపం..?
- ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ ను దెబ్బకొట్టిన భారత్..
- పాక్ లోని కిరాణా హిల్స్ సమీపంలో భారత్ దాడి చేసినట్లు టాక్..
- పాక్ అణు నిల్వలు ఉంచిన ప్రదేశంలో ప్రతి 3 గంటలకు ఒకసారి భూకంపం..
- పాక్ అణు నిల్వలు ఉన్న ప్రదేశాల్లో జూన్ 1 నుంచి నేటి వరకు 19 సార్లు భూకంపాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pak Nuclear Sites: ఆపరేషన్ సింధూర్ సందర్భంగా పాకిస్తాన్ కు ఇండియన్ ఆర్మీ గట్టిగా కౌంటర్ ఇచ్చింది. ఈ సందర్భంగా పాక్ లోని అణు నిల్వలు ఉన్న కిరాణా హిల్స్ సమీపంలో భారత్ దాడులు చేసినట్లు సమాచారం. దీనిపై ఇప్పటి వరకు రెండు దేశాలు అధికారికంగా స్పందించినప్పటికీ.. అక్కడ జరిగిన దాడితో తరచుగా భూకంపాలు సంభవిస్తున్నాయని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్లోని కరాచీ నివాసితులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రతి మూడు గంటలకు ఒకసారి స్వల్ప భూకంపం వస్తుందని పేర్కొన్నారు. అయితే, ఇప్పటి వరకు 19 స్వల్ప భూకంపాలు సంభవించాయని వెల్లడించారు. అలాగే, ఈరోజు (మంగళవారం) ఉదయం 9:57 గంటలకు 2.8 తీవ్రతతో భూకంపం వచ్చిందని అన్నారు. ఈ భూకంపాలు ముఖ్యంగా పాకిస్తాన్ అణ్వాయుధ సామగ్రి నిల్వలకు సమీపంలో ఉన్న మాలిర్, లాంధి, క్వాయిదాబాద్ వంటి ప్రాంతాల్లోనే సంభవిస్తున్నాయని వెల్లడించారు.
Read Also: Ambati Rambabu: సీఎం చంద్రబాబుకు కాపులు అంటే ఎందుకంత కోపం..?
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Thailand Train Crash: బ్యాంకాక్లో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి
- Trump China Visit: చైనాను అస్సలు నమ్మని ట్రంప్.. చెత్త బుట్టలోకి చైనీస్ గిఫ్ట్స్..
కాగా, పాకిస్తాన్ వాతావరణ శాస్త్రవేత్త అమీర్ హైదర్ తెలిపిన వివరాల ప్రకారం.. లంధి ఫాల్ట్ లైన్ క్రియాశీలతే ఈ భూకంపాలకు ప్రధాన కారణం అన్నారు. ఇది ప్రస్తుతం విస్తృత పరిస్థితులకు దారి తీసే ప్రమాదం ఉందన్నారు. ఈ ఫాల్ట్ లైన్లో పెద్ద భూకంపం రాలేదు.. ఇప్పుడు దానికి సంబంధించిన శక్తి నెమ్మదిగా బయటకు వస్తోందని పేర్కొన్నారు. దీని వల్ల చిన్న భూకంపాలు సంభవిస్తున్నాయని.. ఇవి భవిష్యత్తులో పెద్ద భూకంపాలుగా ఏర్పడే అవకాశాలను తగ్గించడంలో సహాయపడతాయని తెలిపారు. ఈ భూకంపాల కారణంగా ఎటువంటి పెద్ద నష్టం సంభవించదు.. కానీ, ప్రజల్లో భయాందోళనలు మాత్రం ఖచ్చితంగా పెరుగుతాయని చెప్పారు. ఈ భూకంపాల పరంపర వచ్చే వారం వరకు కొనసాగవచ్చని వాతావరణ శాస్త్రవేత్త అమీర్ హైదర్ సూచించారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..