Imran Khan: భారత్-పాకిస్తాన్ సంబంధాల మధ్య కాశ్మీర్ ప్రత్యేక హోదా రద్దు అడ్డంకి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wanted To Improve Strained Ties With India During My Tenure, says imran khan: తన హయాంలో భారత్తో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని తాను కోరుకున్నానని, అయితే కాశ్మీర్కు ప్రత్యేక హోదాను రద్దు చేయడం అడ్డంకిగా మారిందని పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోమవారం అన్నారు. అప్పటి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కమర్ జావేద్ బజ్వా కూడా భారత్ తో మెరుగైన సంబంధాలకు మొగ్గు చూపారని అన్నారు. అయితే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం, జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదా రద్దు అడ్డంకిగా మారిందని ఆయన అన్నారు. లాహోర్ లో జరిగిన విదేశీ జర్నలిస్టులతో సంభాషిస్తున్న సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Taj Mahal: తాజ్మహల్కు తొలిసారిగా ఇంటి పన్ను నోటీసులు.. రూ.1.4 లక్షలు కట్టాలని ఆదేశం
Also Read
- Modi - Meloni - Melody: జార్జియా మెలోనికి మోడీ స్పెషల్ గిఫ్ట్..! సోషల్ మీడియాను ఊపేస్తున్న వీడియో
- Broiler Chicken Facts: బ్రాయిలర్ కోళ్లకు నిజంగా హార్మోన్లు ఇస్తారా..? చికెన్పై ఉన్న అపోహల వెనుక అసలు నిజం ఇదే..
- Super Mileage Car: సంచలనం సృష్టించిన విద్యార్థులు.. లీటర్ పెట్రోల్తో 911 కి.మీ. నడిచే కారు ఆవిష్కరణ.!
- Modi-Meloni: ఇటలీలో ప్రధాని మోడీ.. నేటి చర్చల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.. మెలోని ఫొటోలు షేర్ చేసిన పీఎం..
2019లో భారత్ కాశ్మీర్ హోదాను, ఆర్టికల్ 370ని రద్దు చేసింది. ఆ తరువాత ప్రభుత్వం చర్చలకు ముందుకు రాలేదని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. భారత్ ముందుగా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుని శాంతి చర్చలు జరపాలని మేం కోరుకుంటున్నామని అన్నారు. అయితే భారతదేశం తరుపున విదేశాంగ విధానం ఎవరు నడుపుతున్నారని పీటీఐ ప్రశ్నించగా.. నేను బాస్ ను నేను విదేశాంగ విధానాన్ని నడుపుతున్నానని ఇమ్రాన్ అన్నారు.
భారత దేశంలో ఎన్నికల ముందు నరేంద్ర మోదీ గెలవాలని, కాశ్మీర్ సమస్యను పరిష్కరించాలని తను కోరానని ఇమ్రాన్ ఖాన్ గుర్తు చేసుకున్నారు. రైట్ వింగ్ నుంచి వచ్చిన నరేంద్రమోదీ ఈ సమస్యను పరిష్కరిస్తాడని ఇప్పటికీ నమ్ముతున్నానని అందుకే మళ్లీ ఆయన అధికారంలోకి రావాలని.. కాశ్మీర్ సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టోపై ఘాటుగా స్పందించారు. ఆయన విదేశాలు తిరగడం మానేసి ఆఫ్ఘనిస్తాన్ వెళ్లాలని అన్నారు. పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఘర్షణలు చెలరేగుతున్నాయని.. 2600 కిలోమీటర్ల సరిహద్దుల్లో ఉద్రికత్త నెలకొందని అన్నారు. భారతదేశం ఆగస్టు5, 2019న ఆర్టికల్ 370 రద్దు చేసింది. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
తాజావార్తలు
-
MS Dhoni: ఎంఎస్ ధోనీ క్రేజ్ చూసి పిచ్చెక్కిపోయింది.. మహీ చిరకాల ప్రత్యర్థి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
CM Vijay Anti Corruption Drive: అవినీతి ప్రక్షాళనకు సీఎం విజయ్ కీలక నిర్ణయం.. లంచంపై ఫిర్యాదుకు రూ.1 లక్ష బహుమతి..
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Chiru158: చిరు158కి థమన్ ఫిక్స్.. మెగా మాస్కి మ్యూజికల్ బ్లాస్ట్ రెడీ!
ట్రెండింగ్
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!
-
భారత్ లోకి Mini Cooper S GP Inspired Edition.. కేవలం 30 కార్లకే పరిమితం.!
-
బ్రిటన్ మార్కెట్లోకి హీరో XPulse 200 బైక్స్.. అడ్వెంచర్ రైడర్ల కోసం కొత్త శక్తి!