Imran Khan: భారత్-పాకిస్తాన్ సంబంధాల మధ్య కాశ్మీర్ ప్రత్యేక హోదా రద్దు అడ్డంకి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wanted To Improve Strained Ties With India During My Tenure, says imran khan: తన హయాంలో భారత్తో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని తాను కోరుకున్నానని, అయితే కాశ్మీర్కు ప్రత్యేక హోదాను రద్దు చేయడం అడ్డంకిగా మారిందని పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోమవారం అన్నారు. అప్పటి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కమర్ జావేద్ బజ్వా కూడా భారత్ తో మెరుగైన సంబంధాలకు మొగ్గు చూపారని అన్నారు. అయితే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం, జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదా రద్దు అడ్డంకిగా మారిందని ఆయన అన్నారు. లాహోర్ లో జరిగిన విదేశీ జర్నలిస్టులతో సంభాషిస్తున్న సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Taj Mahal: తాజ్మహల్కు తొలిసారిగా ఇంటి పన్ను నోటీసులు.. రూ.1.4 లక్షలు కట్టాలని ఆదేశం
Also Read
- Trump: ఈ రాత్రి ఇరాన్ను ఊహించలేని దెబ్బ కొడతాం.. ఖర్గ్ కూడా స్వాధీనం చేసుకుంటాం.. ట్రంప్ వార్నింగ్
- Nuclear Warheads: ప్రపంచాన్ని ఆలోచింపజేస్తున్న భారత్ నిర్ణయం.. ఆ 12 న్యూక్లియర్ వార్ హెడ్ల కథేంటి?
- Intelligent Bird : ప్రపంచంలోనే అత్యంత తెలివైన పక్షి! దీనికి 5 ఏళ్ల పిల్లాడి తెలివితేటలు...
- Israel-Shivaji statue: ఇజ్రాయెల్లో శివాజీ విగ్రహం..14మంది యూదులతో మొదలైన 2000ఏళ్ల చరిత్ర!
2019లో భారత్ కాశ్మీర్ హోదాను, ఆర్టికల్ 370ని రద్దు చేసింది. ఆ తరువాత ప్రభుత్వం చర్చలకు ముందుకు రాలేదని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. భారత్ ముందుగా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుని శాంతి చర్చలు జరపాలని మేం కోరుకుంటున్నామని అన్నారు. అయితే భారతదేశం తరుపున విదేశాంగ విధానం ఎవరు నడుపుతున్నారని పీటీఐ ప్రశ్నించగా.. నేను బాస్ ను నేను విదేశాంగ విధానాన్ని నడుపుతున్నానని ఇమ్రాన్ అన్నారు.
భారత దేశంలో ఎన్నికల ముందు నరేంద్ర మోదీ గెలవాలని, కాశ్మీర్ సమస్యను పరిష్కరించాలని తను కోరానని ఇమ్రాన్ ఖాన్ గుర్తు చేసుకున్నారు. రైట్ వింగ్ నుంచి వచ్చిన నరేంద్రమోదీ ఈ సమస్యను పరిష్కరిస్తాడని ఇప్పటికీ నమ్ముతున్నానని అందుకే మళ్లీ ఆయన అధికారంలోకి రావాలని.. కాశ్మీర్ సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టోపై ఘాటుగా స్పందించారు. ఆయన విదేశాలు తిరగడం మానేసి ఆఫ్ఘనిస్తాన్ వెళ్లాలని అన్నారు. పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఘర్షణలు చెలరేగుతున్నాయని.. 2600 కిలోమీటర్ల సరిహద్దుల్లో ఉద్రికత్త నెలకొందని అన్నారు. భారతదేశం ఆగస్టు5, 2019న ఆర్టికల్ 370 రద్దు చేసింది. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
తాజావార్తలు
-
Trump: ఈ రాత్రి ఇరాన్ను ఊహించలేని దెబ్బ కొడతాం.. ఖర్గ్ కూడా స్వాధీనం చేసుకుంటాం.. ట్రంప్ వార్నింగ్
-
Mandadi: సుహాస్, సూరిల ‘మండాడి’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
India Loss: ముక్కోణపు వన్డే సిరీస్.. 4 పరుగుల తేడాతో భారత్-ఎపై అఫ్గానిస్థాన్-ఎ విజయం
-
Isakapatnam : ఆమెజాన్ ఒరిజినల్ ‘ఇసకపట్నం’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
Indian Crew Tanker Incident: భారత్ నౌకపై దాడి.. మృతుల్లో విశాఖ వాసి
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!