Pakistan: హిందువులందరూ ఇస్లాంలోకి మారుతారని ఎదురుచూస్తున్నా.. పాక్ ప్రధాని పాత ట్వీట్ వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: ఒకే సమయంలో స్వాతంత్య్రం పొందిన ఇండియాలో లౌకికవాదం వెల్లివిరుస్తూ అభివృద్ధి వైపు దూసుకుపోతుంటే..పాకిస్తాన్ మతమౌఢ్యంతో నాశనమవుతోంది. పాకిస్తాన్ లో మైనారిటీలు ముఖ్యంగా హిందువులు తీవ్ర వివక్ష, వేధింపులను ఎదుర్కొంటున్నారు. అక్కడ నానాటికి హిందువుల జనాభా తగ్గిపోతోంది. సింధ్ ప్రావిన్సులో హిందూ బాలికల్ని బలవంతంగా కిడ్నాప్ చేసి, వివాహం చేసుకుని ఇస్లాంలోకి మారుస్తున్నారు. ఇలాంటి చరిత్ర కలిగిన పాకిస్తాన్లో రాజకీయ నాయకులు కూడా హిందువులను తుడిచివేయాలని చూస్తున్నారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం పాకిస్తాన్ ఆపద్ధర్మ ప్రధానిగా ఉన్న అన్వర్ ఉల్ హక్ కాకర్ గతంలో ఎక్స్(ట్విట్టర్)లో చేసిన ఓ పోస్టు ఇప్పుడు వైరల్ గా మారింది. హిందులందర్ని ఇస్లాంలోకి మార్చడానికి ముస్లింలు సహస్రాబ్ది వరకు వేచి ఉండటానికి సిద్ధంగా ఉన్నారంటూ రాసుకొచ్చారు. 2020లో ఆయన ఈ పోస్టు చేశారు. ఇస్లాం యొక్క జ్ఞానోదయ సత్యానికి హిందువులందరూ ఒప్పించబడాలని మేము ఎదురుచూస్తున్నాము అని ట్వీట్ చేశాడు.
Also Read
- China-Pakistan: ఆపరేషన్ సిందూర్లో పాకిస్తాన్కు చైనా ప్రత్యక్ష సహాయం..!
- Pakistan: ‘‘భారత సైన్యం ఎందుకు ఇంగ్లీష్లో మాట్లాడుతుంది.?’’.. పాక్ ఆర్మీ ప్రశ్నపై ట్రోల్స్..
- China: జిన్పింగ్ పీఠానికే ఎసరు? చైనా మాజీ రక్షణ మంత్రుల మరణశిక్ష వెనుక 'అసలు' మిస్టరీ ఇదేనా!
- Bangladesh: ‘‘మమతా బెనర్జీ వెంట 17 కోట్ల మంది ముస్లింలు’’.. బంగ్లాదేశ్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు..
పాకిస్తాన్ జాతిపిత మహ్మద్ అలీ జిన్నా ఒక కాఫిర్ అని భారతీయ నెటిజెన్ పోస్టు చేయగా.. దానికి ప్రతిస్పందనగా అన్వరుల్ హక్ కాకర్ ఈ ట్వీట్ చేశారు. ఇస్లాం యొక్క సత్యం వైపు హిందువులు ఆకర్షితులయ్యే వరకు వేచి ఉండటానికి తాను, ఇతర మతవాదులతో పాటు సిద్ధంగా ఉన్నానని పోస్ట్ చేశాడు.
Read Also: జాతీయ పార్లమెంటులలో మహిళా ప్రాతినిధ్యం ఎక్కువగా ఉన్న దేశాలు ఇవే..
అయితే హిందూ బాలికలను, అమ్మాయిలను కిడ్నాప్ చేయడం కొంత వరకు వారి ఇష్టప్రకారమే జరుగుతున్నాయని తక్కువ చేసి చూపే ప్రయత్నం చేశాడు. చాలా మంది అమ్మాయిలు, అబ్బాయిలు రహస్యంగా పారిపోయి వివాహం చేసుకోవాలని అనుకుంటున్నారని,వారి కుటుంబాలు వారి పెళ్లికి అంగీకరించకపోవడమే కారణమని కాకర్ అన్నాడు. ప్రస్తుతం అన్వర్ ఉల్ హక్ కాకర్ ప్రధాని కావడంతో ఆయన చేసిన పాత ట్వీట్ వైరల్ అయింది.
మైనారిటీలుగా ఉన్న హిందువులు, సిక్కుల, క్రైస్తవుల పట్ల పాకిస్తాన్ లో దారుణాలు జరుగుతున్నాయి. కరాచీ, లాహోర్ వంటి ప్రధాన నగరాల్లోని హిందూదేవాలయాలు, చర్చిలపై దాడులు చేస్తున్నారు. బాలికను, అమ్మాయిలను ఎత్తుకెళ్లి వివాహాలు చేసుకుంటున్నారు. ఈ నేరాల్లో అక్కడి అధికారులు కానీ, న్యాయస్థానాలు కానీ బాధితుల వైపు నిలబడటం లేదు.
We are waiting all Hindus to be persuaded to the enlighten truth of Islam will wait for a millennium no hurry
— Anwaar ul Haq Kakar (@anwaar_kakar) September 25, 2020
తాజావార్తలు
-
Rowdy Janardhana: విజయ్ బర్త్డే స్పెషల్..‘రౌడీ జనార్ధన’ నుండి రొమాంటిక్ పోస్టర్ రిలీజ్..
-
Kadai Roti Recipe: ఎప్పుడైనా కడాయి రోటీ రుచి చూశారా..? ఇంట్లోనే సింపుల్గా తయారుచేసుకోండి!
-
Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు
-
KKR Playoffs Scenario: అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్న కేకేఆర్.. ప్లేఆఫ్స్ సమీకరణాలు ఇవే!
-
Ameesha Patel: పీఆర్ టీమ్స్కు డబ్బులిస్తే స్టార్లు అయిపోరు..అమీషా పటేల్ మాస్ వార్నింగ్!