Vivek Ramaswamy: చైనాను అడ్డుకోవాలంటే భారత్తో బంధం బలపరుచుకోవాల్సిందే.. రిపబ్లికన్ నేత వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vivek Ramaswamy: చైనా గుత్తాధిపత్యం, సైనిక దూకుడు, విస్తరణవాదాన్ని అడ్డుకోవాలంటే భారతదేశం మాత్రమే సరైందని అమెరికాతో పాటు అన్ని యూరోపియన్ దేశాలు, జపాన్, ఆస్ట్రేలియా, ఆగ్నేయాసియా దేశాలు భావిస్తున్నాయి. దీంతో భారతదేశంతో చైనా వ్యతిరేక దేశాలు సఖ్యతతో వ్యవహరిస్తున్నాయి. ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న రిపబ్లికన్ నేత, ఇండో-అమెరికన్ వివేక్ రామస్వామి కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు.
తాను భారత్ వంటి దేశాలతో సంబంధాలను పెంపొందించుకోవాలని చూస్తున్నానని ఆయన అన్నారు. చైనా నుంచి అమెరికా వాణిజ్య స్వాతంత్య్రం పొందాలంటే భారత్, చిలీ, ఇజ్రాయిల్, బ్రెజిల్ వంటి దేశాలతో సంబంధాలను బలపరుచుకోవాలన్నారు. ఇందుకు తాను నాలుగు అంశాలతో ప్రణాళిక రూపొందించానని వెల్లడించారు. న్యూయార్క్ పోస్టు వివేక్ రామస్వామికి సంబంధించిన అభిప్రాయాలను ఓ కథనంలో పేర్కొంది. అమెరికా ఫార్మా రంగంలో చైనాపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు భారత్, ఇజ్రాయిల్ తో సంబంధాలు విస్తరించాలని చెప్పారు.
Also Read
- America vs Iran: కాస్కో ఇరాన్..! మీకు రెండే ఆప్షన్స్.. వినకపోతే లేపి పడేస్తాం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
- Tragedy: చూడ ముచ్చటైన జంట.. పెళ్లైన కొద్ది గంటల్లోనే విషాదం.. హెలికాప్టర్ ప్రమాదంలో భారత సంతతి పైలట్ మృతి
- Halloween: అర్థరాత్రి 12 దాటగానే వింత శబ్దాలు.. ఆ యూనివర్శిటీలో దెయ్యాలున్నాయా?
- US airstrikes on Iran: కొనసాగుతున్న ఉద్రిక్తతలు.. ఇరాన్ రాడార్, డ్రోన్ స్థావరాలపై అమెరికా దాడులు..
Read Also: Justin Trudeau: 50 ఏళ్లలో అత్యంత చెత్త కెనడా ప్రధాని ట్రూడో.. ప్రజామద్దతు ప్రతిపక్ష నేతకే..
కంప్యూటర్ చిప్స్ తయారీలో, ఈవీ ఎలక్ట్రిక్ బ్యాటరీల తయారీలో కీలమైన లిథియం కోసం అమెరికా, చైనాపై ఎక్కువగా ఆధారపడుతోందని అన్నారు. దీనికి బదులుగా ఈ ఖనిజం కోసం భారత్, బ్రెజిల్, చిలీ దేశాలను ఆశ్రయించాలని అన్నారు. ఈవీ వాహనాలపై అమెరికా అందించే సబ్సిడీలు పరోక్షంగా చైనాకు లబ్ధి చేకూరుస్తున్నాయని తెలిపారు. ఇలాంటి ఖనిజాలను భారత్, బ్రెజిల్, చిలీ నుంచి దిగుమతి చేసుకోవచ్చని సూచించారు. ఇక చిప్స్ తయారీలో చైనా ఆధిపత్యాన్ని తగ్గించుకోవడానికి జపాన్, దక్షిణ కొరియా దేశాలతో వాణిజ్య సంబంధాలు పెంచుకోవాలని కోరారు.
భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త వివేక్ రామస్వామి అధ్యక్ష అభ్యర్థిత్వం రేసులో దూసుకుపోతున్నారు. కొన్నాళ్ల వరకు మూడో స్థానంలో ఉన్న రామస్వామి ఇప్పుడు రెండోస్థానికి చేరారు. రిపబ్లిక్ పార్టీ నుంచి ప్రెసిడెంట్ అభ్యర్థిత్వం పోరాడుతున్న వారిలో డొనాల్డ్ ట్రంప్, వివేక్ రామస్వామి వరసగా మొదటి, రెండో స్థానాల్లో ఉన్నారు. డోనాల్డ్ ట్రంపుకు 39 శాతం మద్దతు ఉండగా.. రామస్వామికి 13 శాతం మద్దతు ఉంది.
తాజావార్తలు
-
Sajjala Ramakrishna Reddy: హామీలు గాలికొదిలేశారు.. సర్కార్పై సజ్జల తీవ్ర విమర్శలు..
-
RCB Fans: కప్ గెలిచిన ఆనందం కొన్ని క్షణాలు కూడా లేకపాయే.. ఆర్సీబీ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్..
-
Virat Kohli: నన్ను త్వరగా అవుట్ చేయాలని అందరూ చూస్తారు.. ఏం పర్లేదు, నా ప్లాన్స్ నాకుంటాయి!
-
Romantic Drama : తాగుబోతు ప్రేమకు ఇంత డిమాండా? ఐయండిబిలో 8.7 రేటింగ్
-
America vs Iran: కాస్కో ఇరాన్..! మీకు రెండే ఆప్షన్స్.. వినకపోతే లేపి పడేస్తాం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!