Vivek Ramaswamy: చైనాను అడ్డుకోవాలంటే భారత్తో బంధం బలపరుచుకోవాల్సిందే.. రిపబ్లికన్ నేత వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vivek Ramaswamy: చైనా గుత్తాధిపత్యం, సైనిక దూకుడు, విస్తరణవాదాన్ని అడ్డుకోవాలంటే భారతదేశం మాత్రమే సరైందని అమెరికాతో పాటు అన్ని యూరోపియన్ దేశాలు, జపాన్, ఆస్ట్రేలియా, ఆగ్నేయాసియా దేశాలు భావిస్తున్నాయి. దీంతో భారతదేశంతో చైనా వ్యతిరేక దేశాలు సఖ్యతతో వ్యవహరిస్తున్నాయి. ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న రిపబ్లికన్ నేత, ఇండో-అమెరికన్ వివేక్ రామస్వామి కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు.
తాను భారత్ వంటి దేశాలతో సంబంధాలను పెంపొందించుకోవాలని చూస్తున్నానని ఆయన అన్నారు. చైనా నుంచి అమెరికా వాణిజ్య స్వాతంత్య్రం పొందాలంటే భారత్, చిలీ, ఇజ్రాయిల్, బ్రెజిల్ వంటి దేశాలతో సంబంధాలను బలపరుచుకోవాలన్నారు. ఇందుకు తాను నాలుగు అంశాలతో ప్రణాళిక రూపొందించానని వెల్లడించారు. న్యూయార్క్ పోస్టు వివేక్ రామస్వామికి సంబంధించిన అభిప్రాయాలను ఓ కథనంలో పేర్కొంది. అమెరికా ఫార్మా రంగంలో చైనాపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు భారత్, ఇజ్రాయిల్ తో సంబంధాలు విస్తరించాలని చెప్పారు.
Also Read
- Russia-Ukraine War: నాలుగేళ్లుగా సాగుతున్న ఉక్రెయిన్ యుద్ధంపై.. రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన
- UFO Files: ఏలియన్ల గుట్టు రట్టు.. చరిత్రలో తొలిసారిగా 'UFO' రహస్య పత్రాలను బయటపెట్టిన అమెరికా!
- Kim Jong Un: కిమ్ జోంగ్ ఉన్ హత్యకు గురైతే, ప్రళయమే.. ఉత్తరకొరియా సంచలన నిర్ణయం..
- US: ‘‘ఇది ఇండియా కాదు’’.. టెక్సాస్ గవర్నర్ అభ్యర్థిని రెచ్చగొట్టే వ్యాఖ్యలు
Read Also: Justin Trudeau: 50 ఏళ్లలో అత్యంత చెత్త కెనడా ప్రధాని ట్రూడో.. ప్రజామద్దతు ప్రతిపక్ష నేతకే..
కంప్యూటర్ చిప్స్ తయారీలో, ఈవీ ఎలక్ట్రిక్ బ్యాటరీల తయారీలో కీలమైన లిథియం కోసం అమెరికా, చైనాపై ఎక్కువగా ఆధారపడుతోందని అన్నారు. దీనికి బదులుగా ఈ ఖనిజం కోసం భారత్, బ్రెజిల్, చిలీ దేశాలను ఆశ్రయించాలని అన్నారు. ఈవీ వాహనాలపై అమెరికా అందించే సబ్సిడీలు పరోక్షంగా చైనాకు లబ్ధి చేకూరుస్తున్నాయని తెలిపారు. ఇలాంటి ఖనిజాలను భారత్, బ్రెజిల్, చిలీ నుంచి దిగుమతి చేసుకోవచ్చని సూచించారు. ఇక చిప్స్ తయారీలో చైనా ఆధిపత్యాన్ని తగ్గించుకోవడానికి జపాన్, దక్షిణ కొరియా దేశాలతో వాణిజ్య సంబంధాలు పెంచుకోవాలని కోరారు.
భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త వివేక్ రామస్వామి అధ్యక్ష అభ్యర్థిత్వం రేసులో దూసుకుపోతున్నారు. కొన్నాళ్ల వరకు మూడో స్థానంలో ఉన్న రామస్వామి ఇప్పుడు రెండోస్థానికి చేరారు. రిపబ్లిక్ పార్టీ నుంచి ప్రెసిడెంట్ అభ్యర్థిత్వం పోరాడుతున్న వారిలో డొనాల్డ్ ట్రంప్, వివేక్ రామస్వామి వరసగా మొదటి, రెండో స్థానాల్లో ఉన్నారు. డోనాల్డ్ ట్రంపుకు 39 శాతం మద్దతు ఉండగా.. రామస్వామికి 13 శాతం మద్దతు ఉంది.
తాజావార్తలు
-
Shubman Gill: ఏబీ డి విలియర్స్ను వెనక్కి నెట్టి.. కోహ్లీ, రోహిత్ సైతం సాధించలేని రికార్డ్ క్రియేట్ చేసిన శుభ్మన్ గిల్
-
Trisha: నీలిరంగు పట్టుచీరలో మెరిసిపోయిన త్రిష.. విజయ్ ప్రమాణ స్వీకార వేడుకలో స్పెషల్ అట్రాక్షన్!
-
Pooja Hegde : పూజాహెగ్డే ‘డబుల్ స్టాండర్డ్స్’.. నెటిజన్స్ ట్రోలింగ్
-
Vaibhav Sooryavanshi: సిరాజ్ దెబ్బకు కుప్పకూలిన బుడ్డోడు.. నొప్పిని భరిస్తూనే వరల్డ్ రికార్డు బద్దలు..
-
Nithin: నితిన్తో ‘జాతిరత్నాలు’ దర్శకుడి నెక్స్ట్ మూవీ..