Twitter: ఇకపై ట్విట్టర్లో వీడియో కాల్ …. కొత్త ఫీచర్కు శ్రీకారం
Twitter: ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాను వాడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. సోషల్ మీడియాను ఉపయోగిస్తున్న వారిలో యువత ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారు. సోషల్ మీడియాలో వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్ వంటి వాటిని ఉపయోగిస్తున్నారు. వీటిలో వాట్సాప్లో వీడియో కాల్ చేసుకొనే అవకాశం ఉంటుంది. సోషల్ మీడియాను ఉపయోగిస్తున్న వారు ప్రపంచంలో కోట్లాది మంది ఉన్నారు. వినియోగదారుల సౌకర్యార్థం.. అలాగే వారి వ్యాపారార్థం కొన్ని సోషల్ మీడియా సంస్థలు కొత్త కొత్త ఫీచర్స్ ను తీసుకొస్తున్నాయి. ఫేస్బుక్లో లైవ్ వీడియోలు పెట్టే అవకాశం ఉంటుంది. అలాగే ఇకపై ట్విట్టర్లో కూడా వీడియో కాల్ చేసుకొనేలా కొత్త ఫీచర్ను తీసుకొస్తున్నారు. ట్విట్టర్లో యూజర్లకు వీడియో కాలింగ్ ఫీచర్ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ట్విట్టర్ సీఈవో లిండా యాకరినో ప్రకటించారు. సోషల్ మీడియా యాప్ స్థాయి నుంచి సూపర్ యాప్గా మారేందుకు ట్విట్టర్ (ప్రస్తుతం ఎక్స్) వేగంగా అడుగులు వేస్తోంది. ఎక్స్గా పేరు మార్చుకున్న తర్వాత కొత్త ఫీచర్లను యూజర్లకు పరిచయం చేసేందుకు సిద్ధమైంది. త్వరలో యూజర్లకు వీడియో కాలింగ్ ఫీచర్ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సంస్థ సీఈవో లిండా యాకరినో ప్రకటించారు. దాంతోపాటు ఎక్కువ నిడివి ఉన్న వీడియోలు పోస్ట్ చేయడం, కంటెంట్ క్రియేటర్ సబ్స్క్రిప్షన్, డిజిటల్ చెల్లింపులు వంటి ఫీచర్లను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్టు లిండా తెలిపారు.
Read also
Also Read
- Maulana Salman Azhar: భారత్ శత్రువులకు పాక్ గడ్డపై నూకలు చెల్లాయా? జైష్ టాప్ కమాండర్ సల్మాన్ అజార్ ఖతం!
- UAE OPEC Exit: యూఏఈ ఒపెక్ ఎగ్జిట్.. భారత్కు లాభం, పాకిస్తాన్కు నష్టం..
- Donald Trump: ట్రంప్ను రోస్ట్ చేసిన కింగ్ చార్లెస్.. మేము లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడేవారంటూ ఎగతాళి
- Ali Pervaiz Malik: పాక్ మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు.. మా దగ్గర ఒక్క రోజుకు కూడా పెట్రోల్ లేదు.. భారత్తో మనం పోల్చుకోలేము
అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో ఉన్న ట్విట్టర్ ప్రధాన కార్యాలయంలోని వస్తువులను వేలానికి ఉంచినట్టు ఎలాన్ మస్క్ ప్రకటించాడు. ట్విట్టర్ కార్యాలయంలోని కాఫీ టేబుల్స్, భారీ పక్షి పంజరాలు, వైరల్గా మారిన ఆయిల్ పెయింటింగ్స్, డెస్క్లు, డీజే బూత్, మ్యూజికల్ పరికరాలు మొత్తం 584 వస్తువులను వేలానికి ఉంచినట్లు ఆంగ్ల వార్తా సంస్థ కథనాల ప్రకారం తెలుస్తోంది. వేలంలో వస్తువుల ప్రారంభ ధర 25 డాలర్లుగా నిర్ణయించాడు. సెప్టెంబరు 12 నుంచి సెప్టెంబరు 14 వరకు ఈ వేలం ప్రక్రియ జరగనున్నట్టు ప్రకటించారు. ట్విట్టర్ను సూపర్ యాప్గా మార్చాలనే ఉద్దేశంతోనే ఎక్స్గా పేరు మార్చినట్లు మస్క్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే చైనా వీచాట్ తరహాలో సోషల్ మీడియా, ఆన్లైన్ షాపింగ్, ఫుడ్ డెలివరీ, గేమింగ్, ఎంటర్టైన్మెంట్, బ్యాంకింగ్, నగదు వ్యాలెట్లు, క్యాబ్ బుకింగ్, టికెట్ బుకింగ్ వంటి సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని మస్క్ తెలిపారు. అయితే వీడియో కాల్ ఫీచర్ ఎప్పటి నుంచి అందుబాటులోకి రానుందనేది స్పష్టంగా చెప్పకపోయినా.. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రకటించారు.
తాజావార్తలు
-
LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
-
Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?