Machado: నెలల తర్వాత పబ్లిక్గా కనిపించిన నోబెల్ శాంతి గ్రహీత మచాడో
- నెలల తర్వాత పబ్లిక్గా కనిపించిన నోబెల్ శాంతి గ్రహీత మచాడో
- ఈ ఏడాది మచాడోను వరించిన నోబెల్ శాంతి బహుమతి
- మచాడోపై ఆంక్షలు విధించిన వెనిజులా ప్రభుత్వం
- రహస్యంగా నార్వే చేరుకున్న వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చాలా రోజుల తర్వాత వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా మచాడో బహిరంగంగా కనిపించారు. బుధవారం అర్ధరాత్రి నార్వే రాజధాని ఓస్లోలోని గ్రాండ్ హోటల్ దగ్గర ప్రత్యక్షమయ్యారు. హోటల్లోని బాల్కనీ దగ్గర అందరికీ చేతులు ఊపుతూ.. అభివాదం చేస్తూ.. చేతులు ఎత్తి నమస్కరిస్తూ కనిపించారు. చాలా ఉల్లాసంగా.. ఉత్సాహంగా కనిపించారు. మద్దతుదారులతో కలిసి పాటలు కూడా పాడారు. ఈ ఏడాది జనవరిలో ప్రత్యక్షమైన ఆమె… తిరిగి ఇన్ని నెలల తర్వాత పబ్లిక్గా కనిపించారు.

Also Read
- US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
- Extra Marital Affair: భార్య అక్రమ సంబంధాన్ని రోబో వాక్యూమ్ కెమెరాతో పట్టుకున్న భర్త.. చివరికిలా..!
- Keir Starmer: ఇంగ్లండ్ మాజీ ప్రధాని మరో కీలక నిర్ణయం.. ఎంపీ పదవికి కూడా రాజీనామా
- Nepal Floods: నేపాల్లో వందలాది మృతదేహాలను ఎందుకు పూడ్చిపెడుతున్నారు..? అసలు కారణం ఇదే
ఈ ఏడాది అనూహ్యంగా నోబెల్ శాంతి బహుమతి మచాడోను వరించింది. బుధవారం నార్వేలో నోబెల్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి మచాడో గైర్హాజరయ్యారు. ఆమె చాలా రోజుల నుంచి అజ్ఞాతంలో ఉన్నారు. అయితే అవార్డు తీసుకునేందుకు దేశం దాటి వెళ్లకుండా ఆమెపై వెనిజులా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అవార్డు తీసుకునేందుకు దేశం దాటి వెళ్తే పరారీలో ఉన్న నేరస్థురాలిగా పరిగణిస్తామంటూ వెనిజులా అటార్నీ జనరల్ హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: Smriti Mandhana: పెళ్లికి ముందు రోజు రాత్రి.. ఆ మహిళా క్రికెటర్కు రెడ్ హ్యాండెడ్గా దొరికిన పలాశ్!
అయినా కూడా మచాడో అత్యంత రహస్యంగా నార్వేలోని ఓస్లోకు చేరుకున్నారు. గ్రాండ్ హోటల్లో హఠాత్తుగా ప్రత్యక్షమయ్యారు. బాల్కనీ నుంచి బయటకు వచ్చి అందరికీ అభివాదం చేశారు. నోబెల్ శాంతి బహుమతి తీసుకునేందుకు వెళ్తే ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయో తనకు తెలుసు అని మీడియాతో అన్నారు. అయినా కూడా రహస్యంగా నార్వే చేరుకున్నారు. తనను చూసేందుకు వచ్చిన మద్దతుదారులను కలిసేందుకు బారికేడ్లు దాటుకుంటూ వెళ్లారు. మరియా.. మరియా అంటూ పెద్ద పెద్దగా అరుపులు.. కేకలు వినిపించాయి.

ఇది కూడా చదవండి: PM Modi: పార్లమెంట్లో అమిత్ షా ప్రసంగంపై మోడీ ఫిదా.. శభాష్ అంటూ ప్రధాని ట్వీట్
మచాడో.. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. నియంతృత్వానికి వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు. చాలా కాలంగా ఆమె ప్రతిపక్ష నాయకురాలిగా ఉన్నారు. ఇక అధ్యక్ష ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండా నిషేధం విధించారు. మొత్తానికి శాంతియుతంగా పోరాటం చేస్తున్న ఆమెకు నోబెల్ శాంతి బహుమతి వరించింది.
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!