China Covid: చైనాపై కొవిడ్ పంజా.. ఏప్రిల్ నాటికి గరిష్ఠ స్థాయి కేసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US Institute Predicts China Could See Over A Million COVID Deaths Through 2023: కొంతకాలంగా చైనాలో కొవిడ్ కేసులు గణనీయంగా పెరగడంతో.. అక్కడి ప్రభుత్వం జీకో కొవిడ్ ఆంక్షల్ని అమలు చేసింది. అయితే.. ఆ ఆంక్షలు మరీ కఠినంగా ఉండటం, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడంతో.. వాటిని సడలించాల్సిందిగా కోరుతూ పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో మరో దారి లేక.. జీరో కొవిడ్ ఆంక్షల్ని ప్రభుత్వం సడలించింది. ఈ దెబ్బకు అక్కడ మళ్లీ కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిని ఇలాగే వదిలేస్తే.. వచ్చే ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నాటికి చైనాలో కొవిడ్ కేసులు గరిష్ఠ స్థాయికి చేరుకుంటాయని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్లోని ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్’ (ఐహెచ్ఎంఈ) అంచనా వేసింది. అలాగే మరణాల సంఖ్య 3 లక్షలకు పైనే నమోదు కావొచ్చని.. 2023 చివరి నాటికి ఆ మరణాల సంఖ్య 10 లక్షలకు పైన చేరుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని ఆ సంస్థ పేర్కొంది.
IRCTC Contractor Fined: రూ. 5 ఎక్కువగా వసూలు చేశాడు.. ఒక లక్ష ఫైన్ కట్టాడు
Also Read
- Shakib Al Hasan: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఇంటిపై.. పెట్రోల్ బాంబు దాడి!
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
- US Military: అమెరికా ఆయుధ బలం తగ్గిందా? ఇరాన్ యుద్ధం తర్వాత బయటపడిన షాకింగ్ నిజాలు ఇవే!
- North Korea: మీ కుక్కల మాంసంతో సూప్ చేసుకుని తాగండి.. ఉత్తర కొరియా విచిత్ర సలహా..
ఈ ఐహెచ్ఎంఈ డైరెక్టర్ క్రిస్ట్ఫర్ ముర్రే చైనా కొవిడ్ పరిస్థితి గురించి మాట్లాడుతూ.. వచ్చే ఏడాది ఏప్రిల్ 1వ తేదీ కల్లా చైనా జనాభాలో మూడింట ఒకవంతు ప్రజలు ఈ కరోనా వైరస్ బారిన పడతారని కుండబద్దలు కొట్టాడు. అంతేకాదు.. కేవలం జీరో కొవిడ్ విధానంతో ఈ వైరస్ వ్యాప్తిని అదుపు చేయలేరని, ఇతర వేరియెంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ అధికంగా వ్యాప్తి చెందుతోందని ఆయన పేర్కొన్నాడు. మరోవైపు.. చైనాలో 16.4 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని, దీంతో కొవిడ్ పర్యవసనాలు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్లో గ్లోబల్ హెల్త్ సీనియర్ ప్రతినిధి యాన్జోంగ్ హువాంగ్ బాంబ్ పేల్చాడు. అలాగే.. చైనాలో 80 ఏళ్లు, ఆపైబడిన వారు 8 మిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రజలున్నారని, వారికి ఇప్పటిదాకా టీకాలు వేయలేదని, వారిపై కూడా ఈ కొవిడ్ ప్రభావం చూపడం ఖాయమని చెప్పాడు. అటు.. చైనా జాతీయ కమిషన్ ఈ కరోనా పరిస్థితిని ఎదుర్కోవడం కోసం టీకాల ప్రక్రియను ముమ్మరం చేశామని.. వెంటిలేటర్లు, అవసరమైన మందులను కూడా నిల్వ ఉంచామని స్పష్టం చేసింది.
West Bengal Strange Lights: ఆకాశంలో వింత.. స్పేస్షిప్ అంటూ జనాలు గిలిగింత
తాజావార్తలు
-
Shakib Al Hasan: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఇంటిపై.. పెట్రోల్ బాంబు దాడి!
-
Dhanush-Kareena Kapoor: భన్సాలీ కొత్త ప్రాజెక్ట్లో ధనుష్ కి జోడీగా కరీనా? పౌరాణిక అడ్వెంచర్కు రంగం సిద్ధం!
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!