Donald Trump: హసీనాను దించేందుకు అమెరికా నిధులు.? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
- బంగ్లాదేశ్లో పేరు తెలియని సంస్థకు 29 మిలియన్ డాలర్ల నిధులు..
- డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
- ఈ నిధులను షేక్ హసీనాను దించేందుకు ఉపయోగించారా..?
- ఐఎస్ఐకి ఈ ప్లాన్లో సంబంధం ఉందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా నిధుల దుర్వినియోగం గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. భారతదేశ ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు 21 మిలియన్ డాలర్లను యూఎస్ఎయిడ్ ద్వారా అందించినట్లు ఇటీవల ఆరోపించారు. దీనిపై ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ ఒకరిపై ఒకరు రాజకీయ ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజాగా, USAID ద్వారా దక్షిణాసియాకు పంపిన నిధులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశ్నించారు. వైట్ హౌస్లో గవర్నర్ వర్కింగ్ సెషన్ను ఉద్దేశించి ప్రసంగించిన ట్రంప్, బంగ్లాదేశ్కు USAID $29 మిలియన్ల నిధుల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిధులను ‘‘ఎవరికి తెలియని సంస్థ’’కు ఇచ్చారని అన్నారు.
Read Also: US deports Indians: అక్రమ వలసదారుల బహిష్కరణ.. ఇండియా చేరిన 4వ బ్యాచ్..
Also Read
- Iran Political Crisis: ఇరాన్లో తిరుగుబాటు.. ఆ దేశ రాజకీయాల్లో కలకలం!
- Zohran Mamdani: నెతన్యాహూను అరెస్ట్ చేస్తాం.. న్యూయార్క్ మేయర్ హెచ్చరిక..
- Two US Soldiers Killed: ఇరాన్ దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు మృతి.. "మరచిపోలేని గుణపాఠం చెబుతాం" అంటూ ఖమేనీ హెచ్చరిక
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
హసీనాకు వ్యతిరేకంగా నిధులు వాడారా..?
గతేడాది ఆగస్టులో విద్యార్థి ఉద్యమం ముసుగులో షేక్ హసీనాను అధికారంలో నుంచి దించారు. ఆమె భారత్ పారిపోయి రావాల్సి వచ్చింది. ఆ తర్వాత అమెరికా డీప్ స్టేట్తో సంబంధాలు ఉన్న మహ్మద్ యూనస్ బంగ్లాదేశ్ దేశాధినేతగా అయ్యారు. అయితే, ప్రస్తుతం ట్రంప్ ఆరోపిస్తున్న ఈ నిధులను షేక్ హసీనాకు వ్యతిరేకంగా వాడారా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
నిజానికి ఈ మొత్తం వ్యూహంలో పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐకి కూడా సంబంధం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఐఎస్ఐతో సంబంధం ఉన్న జమాతే ఇస్లామీ సంస్థ ప్రస్తుతం మహ్మద్ యూనస్కి గట్టి మద్దతుదారుగా ఉంది. షేక్ హసీనా పతనం తర్వాత బంగ్లాదేశ్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే వాదన ఉంది. అయితే, ఈ పరిణామాలను ట్రంప్ లేదా భారత్ సహిస్తుందా.? అనేది తేలాల్సి ఉంది.
బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఐఎస్ఐ తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. భారత్-బంగ్లా సంబంధాలు దిగజారిన పరిస్థితుల్లో, ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మహ్మద్ ఆసిమ్ మాలిక్ నేతృత్వంలోని ఐఎస్ఐ బృందం బంగ్లాదేశ్ని సందర్శించింది. బంగ్లాదేశ్లోని కాక్స్ బజార్, ఉఖియా, టెక్నాఫ్, మౌల్వి జజార్, హబీ గంజ్, షేర్పూర్ ప్రాంతాలను సందర్శించారు.
తాజావార్తలు
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
-
H-FAST Raids: కల్తీగాళ్ల గుండెల్లో రైళ్లు.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో H-FAST భారీ దాడులు..
-
Rohit Sharma: ఎట్టకేలకు ఫామ్లోకి హిట్ మ్యాన్.. హాఫ్ సెంచరీ పూర్తి..
-
Vallabhaneni Anil: టాలీవుడ్లో యూనియన్ వివాదానికి ఫుల్స్టాప్.. జానీ మాస్టర్పై నాన్ కోఆపరేషన్ ఎత్తివేత!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!