America: గౌతమ్ అదానీపై యూఎస్లో విచారణ.. బైడెన్ సర్కార్పై రిపబ్లికన్ నేత ఫైర్!
- గౌతమ్ ఆదానీతో పాటు ఆయన కంపెనీలపై విచారణ చేయాలని అమెరికా సర్కార్ నిర్ణయం..
- జో బైడెన్ ప్రభుత్వ నిర్ణయంపై తీవ్రంగా మండిపడిన రిపబ్లికన్ పార్టీ నేత లాన్స్ గూడెన్..
- బైడెన్ పదవి నుంచి దిగిపోయే ముందు భారత్- అమెరికా మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు: గూడెన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
America: గౌతమ్ అదానీతో పాటు ఆయన కంపెనీలపై విచారణ చేయాలని ఇటీవల అమెరికా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముడుపుల చెల్లింపు కేసులో అమెరికా న్యాయస్థానం అదానీని నిలదీసింది. అయితే, భారతీయ వ్యాపారిపై అమెరికా కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని రిపబ్లికన్ నేత తీవ్రంగా ఖండించారు. ఎంపిక చేసుకుని ఓ వ్యక్తిని టార్గెట్ చేయడం వల్ల.. రెండు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందని అతడు పేర్కొన్నాడు. దీనిపై అమెరికా అటార్నీ జనరల్ మెర్రిక్ బీ గార్లాండ్కు లేఖ రాశారు రిపబ్లికన్ నేత లాన్స్ గూడెన్.
Read Also: AP Education: ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం.. ఇంటర్ పాఠ్యాంశాల్లో సమూల మార్పులు..!
Also Read
- Pakistan: చేతులెత్తేసిన పాకిస్థాన్ ప్రభుత్వం.. అవస్థలు పడుతున్న జనం! ఏం జరిగిందంటే..
- Russia: చమురు మార్కెట్ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
- US Tailor Income: గంటకు అన్ని వేలా ? అమెరికా టైలర్ గంట సంపాదన చూసి నెటిజన్లు షాక్! వైరల్ వీడియో..
- Donald Trump: గూగుల్, చాట్జీపీటీలకు షాక్.. కంపెనీల్లో వాటాలు అడుగుతున్న డొనాల్డ్ ట్రంప్!
ఇక, విదేశీ వ్యక్తులను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని అమెరికా కోర్టును రిపబ్లికన్ నేత లాన్స్ గూడెన్ డిమాండ్ చేశారు. అదానీ విచారణ వెనుక ఏదైనా లోగుట్టు ఉందా.. దీని వెనుక జార్జ్ సోరస్ లాంటి వ్యక్తి ఉన్నారా అని ప్రశ్నించారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో యూఎస్ కు బలమైన భాగస్వామిగా భారత్ ఉంది.. వారిని టార్గెట్ చేసి చర్యలు తీసుకోవడంతో భాగస్వామ్య కూటమిలో సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దేశంలోని చెడ్డవారిని అమెరికన్ కోర్టులు శిక్షించాలి.. విదేశీయులను కాదు అన్నాడు. వందల కోట్ల డాలర్లు పెట్టుబడి పెటి, అమెరికన్ల కోసం లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న వారిని టార్గెట్ చేయడం అమెరికాకే నష్టం కలుగుతుందని గూడెన్ ఆ లేఖలో తెలిపారు.
Read Also: Bandi Sanjay: కాంగ్రెస్ వాగ్దానం చేసిన భద్రత ఎక్కడ ఉంది?
అదానీ సంస్థ భారత్లో అక్కడి అధికారులకు లంచాలు ఇస్తే.. అందులో అమెరికా వ్యక్తుల ప్రమేయం లేనప్పుడు.. అతడ్ని విచారించేందుకు న్యాయశాఖ ఎందుకు ఉత్సాహాన్ని చూపిస్తుందో అర్థం కావడం లేదని రిపబ్లికన్ నేత లాన్స్ గూడెన్ తెలిపారు. భారత్ లో అవినీతి జరిగితే, అదానీపై అమెరికాలో కేసు ఎందుకు నమోదు చేశారని కోర్టును నిలదీశాడు. మీరేమైనా ఇండియాలో న్యాయం కోసం ఒత్తిడి తీసుకు వస్తున్నారా అని ప్రశ్నించారు. ఈ కేసులో నిమగ్నమైన అధికారులను అమెరికాకు రప్పించగలరా అని అడిగారు. ఒకవేళ అవినీతి అధికారుల్ని అప్పగించడానికి భారత్ నిరాకరిస్తే.. అప్పుడు యూఎస్ న్యాయశాఖ వద్ద ఎలాంటి ఆప్షన్ ఉందన్నాడు. జో బైడెన్ సర్కార్ పదవి నుంచి దిగిపోయే ముందు అమెరికా, భారత్ మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడని రిపబ్లికన్ నేత గూడెన్ ఆరోపించాడు.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!