America: గౌతమ్ అదానీపై యూఎస్లో విచారణ.. బైడెన్ సర్కార్పై రిపబ్లికన్ నేత ఫైర్!
- గౌతమ్ ఆదానీతో పాటు ఆయన కంపెనీలపై విచారణ చేయాలని అమెరికా సర్కార్ నిర్ణయం..
- జో బైడెన్ ప్రభుత్వ నిర్ణయంపై తీవ్రంగా మండిపడిన రిపబ్లికన్ పార్టీ నేత లాన్స్ గూడెన్..
- బైడెన్ పదవి నుంచి దిగిపోయే ముందు భారత్- అమెరికా మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు: గూడెన్
America: గౌతమ్ అదానీతో పాటు ఆయన కంపెనీలపై విచారణ చేయాలని ఇటీవల అమెరికా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముడుపుల చెల్లింపు కేసులో అమెరికా న్యాయస్థానం అదానీని నిలదీసింది. అయితే, భారతీయ వ్యాపారిపై అమెరికా కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని రిపబ్లికన్ నేత తీవ్రంగా ఖండించారు. ఎంపిక చేసుకుని ఓ వ్యక్తిని టార్గెట్ చేయడం వల్ల.. రెండు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందని అతడు పేర్కొన్నాడు. దీనిపై అమెరికా అటార్నీ జనరల్ మెర్రిక్ బీ గార్లాండ్కు లేఖ రాశారు రిపబ్లికన్ నేత లాన్స్ గూడెన్.
Read Also: AP Education: ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం.. ఇంటర్ పాఠ్యాంశాల్లో సమూల మార్పులు..!
Also Read
- Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
- Putin - Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్కు రష్యా 'ఫుల్' సపోర్ట్..!
- Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్పై ఇరాన్ దాడులు!
- Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
ఇక, విదేశీ వ్యక్తులను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని అమెరికా కోర్టును రిపబ్లికన్ నేత లాన్స్ గూడెన్ డిమాండ్ చేశారు. అదానీ విచారణ వెనుక ఏదైనా లోగుట్టు ఉందా.. దీని వెనుక జార్జ్ సోరస్ లాంటి వ్యక్తి ఉన్నారా అని ప్రశ్నించారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో యూఎస్ కు బలమైన భాగస్వామిగా భారత్ ఉంది.. వారిని టార్గెట్ చేసి చర్యలు తీసుకోవడంతో భాగస్వామ్య కూటమిలో సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దేశంలోని చెడ్డవారిని అమెరికన్ కోర్టులు శిక్షించాలి.. విదేశీయులను కాదు అన్నాడు. వందల కోట్ల డాలర్లు పెట్టుబడి పెటి, అమెరికన్ల కోసం లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న వారిని టార్గెట్ చేయడం అమెరికాకే నష్టం కలుగుతుందని గూడెన్ ఆ లేఖలో తెలిపారు.
Read Also: Bandi Sanjay: కాంగ్రెస్ వాగ్దానం చేసిన భద్రత ఎక్కడ ఉంది?
అదానీ సంస్థ భారత్లో అక్కడి అధికారులకు లంచాలు ఇస్తే.. అందులో అమెరికా వ్యక్తుల ప్రమేయం లేనప్పుడు.. అతడ్ని విచారించేందుకు న్యాయశాఖ ఎందుకు ఉత్సాహాన్ని చూపిస్తుందో అర్థం కావడం లేదని రిపబ్లికన్ నేత లాన్స్ గూడెన్ తెలిపారు. భారత్ లో అవినీతి జరిగితే, అదానీపై అమెరికాలో కేసు ఎందుకు నమోదు చేశారని కోర్టును నిలదీశాడు. మీరేమైనా ఇండియాలో న్యాయం కోసం ఒత్తిడి తీసుకు వస్తున్నారా అని ప్రశ్నించారు. ఈ కేసులో నిమగ్నమైన అధికారులను అమెరికాకు రప్పించగలరా అని అడిగారు. ఒకవేళ అవినీతి అధికారుల్ని అప్పగించడానికి భారత్ నిరాకరిస్తే.. అప్పుడు యూఎస్ న్యాయశాఖ వద్ద ఎలాంటి ఆప్షన్ ఉందన్నాడు. జో బైడెన్ సర్కార్ పదవి నుంచి దిగిపోయే ముందు అమెరికా, భారత్ మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడని రిపబ్లికన్ నేత గూడెన్ ఆరోపించాడు.
తాజావార్తలు
-
RCB vs DC: ఒక్క మ్యాచ్ కే ఇంత తేడానా.? అప్పుడేమో 264.. ఇప్పుడు 75కే ఖేల్ ఖతం..!
-
Good News : పోలీసులకు గుడ్ న్యూస్.. స్పెషల్ లీవ్ ప్రకటించిన డీజీపీ
-
Crane Accident : శంకర్పల్లిలో విషాదం.. క్రేన్ కూలి ముగ్గురు మృతి
-
DC Vs RCB: హమ్మయ్య.. ‘49’ తప్పించుకున్నాం.. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాపీ..
-
Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!