AP Education: ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం.. ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్ ఎత్తివేత..!
- ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కీలక నిర్ణయం..
- ఇంటర్మీడియట్ పాఠ్యాంశాల్లో సమూల మార్పులు..
- ఫస్టియర్ ఖచ్చితంగా పాస్ అవ్వాలన్న నిబంధనకు మినహాయింపు..
- ఇంటర్ లో సంస్కరణలపై అభిప్రాయాలు తీసుకుంటున్నాం..
- ఈ నెల 26 వరకు వెబ్ సైట్ లో అభిప్రాయం చెప్పొచ్చన్న ఇంటర్ బోర్డు కార్యదర్శి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Education: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.. ఇంటర్ విద్యలో ప్రభుత్వం కీలక సంస్కరణలు తీసుకు వస్తోంది.. ప్రధానంగా మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలను తొలగించి రెండో సంవత్సరం పరీక్షలను నిర్వహిస్తామని ఇంటర్ బోర్డ్ కార్యదర్శి కృతికా శుక్లా స్పష్టం చేశారు. మొదటి ఏడాది పరీక్షలు కాలేజీలో ఇంటర్నల్ గా నిర్వహిస్తామని.. రెండో సంవత్సరం మార్కులను పరిగణనలోకి తీసుకుంటాం అన్నారు.. చాలా రాష్ట్రాలు ఇంటర్ మొదటి ఏడాది పరీక్షలు నిర్వహించడం లేదన్నారు.. దీంతో పాటు ఇంటర్ లో సిలబస్ మార్చాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. CBSE సిలబస్ ప్రవేశ పెట్టె ప్రతిపాదనకు సంబంధించిన ప్రజాభిప్రాయాన్ని తీసుకుంటాం అన్నారు కృతికా శుక్లా..
Read Also: BJP: ప్రియాంక గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రమేష్ బిధూరిపై బీజేపీ సీరియస్..
Also Read
- YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
- CM Chandrababu : మార్కాపురం జిల్లా హామీని నిలబెట్టుకున్నాం.. రాష్ట్ర అభివృద్ధి కోసమే కూటమి ఏర్పాటు
- Pawan Kalyan: సంక్షేమ పథకాలపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. దానికి వైసీపీనే ఉదాహరణ..!
- Pawan Kalyan: వైసీపీకి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. మౌనం బలహీనత కాదు..!
గత కొన్నేళ్లుగా ఇంటర్ బోర్డ్ లో సంస్కరణలు జరగలేదు.. ప్రస్తుతం నాలుగు సంస్కరణలు ప్రధానంగా ఉన్నాయి అన్నారు కృతికా శుక్లా.. గత కొన్నేళ్లుగా పాఠ్య పుస్తకాల్లో మార్పులు జరగలేదు.. ఇంటర్ విద్యార్థులు పోటీ పరీక్షలకు హాజరు అవుతారు.. వీరికి తగ్గట్టుగా కొత్త సిలబస్ తీసుకు రాబోతున్నాం అన్నారు. ప్రస్తుతం ఇంటర్ మొదటి సంవత్సరం సిలబస్ మార్పుపై దృష్టి పెట్టాం.. ఇంటర్ మొదటి సంవత్సరం తెలుగు, ఇంగ్లీషు సిలబస్ మారుస్తున్నాం అన్నారు.. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కమిటీ ఈ సిలబస్పై దృష్టి పెట్టిందన్నారు. తెలుగు, సంస్కృతం, ఉర్దూ ఏదైనా అప్షన్ తీసుకునే అవకాశం విద్యార్థులకు ఉంది.. NCERT సిలబస్ వల్ల మాథ్స్.. కెమిస్ట్రీ లో ప్రస్తుతం ఉన్న సిలబస్ బాగా తగ్గుతుందన్నారు.. CBSE సిలబస్ ప్రకారం ప్రస్తుతం మార్పులు జరుగుతున్నాయని వెల్లడించారు.. ఇంటర్ లో ఇక నుంచి ఇంటర్నల్ ప్రాక్టికల్ మర్క్స్ ఉంటాయి. ప్రతి సబ్జెక్టుకు ఈ ఇంటర్నల్ మార్కులు ఉంటాయి.. 20 మార్కులు ఇంటర్నల్ గా ఉంటాయని వెల్లడించారు ఏపీ ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా.
తాజావార్తలు
-
RAPO23 : హీరో కమ్ దర్శకుడిగా రామ్ పోతినేని.. పూజ కార్యక్రమానికి టైమ్ ఫిక్స్
-
AA 23 : పూజా హెగ్డేకు లోకేశ్ కనగరాజ్ మరో ఛాన్స్.. కానీ?
-
Balan The Boy: 8 రోజుల్లో 24 కోట్ల వసూళ్లు.. మరో బ్లాక్ బస్టర్తో చిదంబరం మ్యాజిక్
-
Woman Litters In Train: రైలు కోచ్లో చెత్త విసిరి, సీటు పక్కనే చేతులు కడిగిన మహిళ.. సివిక్ సెన్స్పై దేశవ్యాప్తంగా చర్చ
-
Sourav Ganguly: అతడు ఓ మూర్ఖుడు.. ఒకసారి మోసపోయా, రెండోసారి మోసపోను!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!