US: అమెరికా అధికారి కండకావరం.. తెలుగు బిడ్డకు రూ.262 కోట్లు పరిహారం
- అమెరికా అధికారి కండకావరం
- 2023 రోడ్డు ప్రమాదం కేసులో సంచలన తీర్పు
- తెలుగు బిడ్డకు రూ.262 కోట్లు పరిహారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ అమెరికా అధికారి కండకావరానికి తెలుగు బిడ్డ అర్ధాంతరంగా తనువు చాలించింది. 23 ఏళ్లకే నిండు నూరేళ్లు నిండిపోయాయి. ఓ కన్నపేగు తల్లడిల్లింది. న్యాయం కోసం గుండె ఘోషించింది. చివరికి బాధితురాలి పక్షాన్నే న్యాయదేవత నిలిచింది. అగ్ర రాజ్యంలో ఓ తెలుగు బిడ్డ ఘన విజయం సాధించింది.

Also Read
జాహ్నవి కందుల(23).. భారతీయ విద్యార్థిని. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా వాసి. అమెరికాలోని సియాటిల్లోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్లో మాస్టర్స్ డిగ్రీ చదువుతోంది. 2023, జనవరిలో రోడ్డు దాటుతుండగా సియాటిల్లోని ఆఫీసర్ కెవిన్ డేవ్ కారు ఢీకొట్టింది. 119 కిలోమీటర్ల వేగంతో వచ్చి ఢీకొట్టాడు. దీంతో అక్కడికక్కడే జాహ్నవి ప్రాణాలు కోల్పోయింది.

అయితే కారుతో ఢీకొట్టిన తర్వాత అధికారి చాలా దుర్మార్గంగా వ్యవహరించాడు. కండకావరమో.. లేదంటే గర్వమో తెలియదు గానీ.. పశ్చాత్తాపం లేకుండా అమానుషంగా మాట్లాడాడు. ‘‘ఆమె చనిపోయింది. ఆమె చాలా మామూలు మనిషి. 11 వేల డాలర్లు ఇస్తే సరిపోతుంది హహహ..’’ అంటూ వెకిలి నవ్వుతూ అపహాస్యం చేశాడు. ఇందుకు సంబంధించిన వ్యాఖ్యలు మరో అధికారి బాడీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ మాటలు భారతీయుల హృదయాలను కదిలించేశాయి. ఇంత దుర్మార్గమా? అంటూ న్యాయపోరాటానికి దిగారు.
ఇక ఈ కేసులో గత శుక్రవారం కింగ్ కౌంటీ సుపీరియర్ కోర్టులో ఇరుపక్షాలు పరిష్కార నోటీసు దాఖలు చేశాయి. బాధిత కుటుంబానికి 29 మిలియన్ డాలర్లు నష్టపరిహారం చెల్లించేందుకు సియాటిల్ నగరం ఒప్పందం చేసుకుంది.
తాజాగా ఈ కేసులో సియాటిల్ నగర న్యాయవాది ఎరికా ఎవాన్స్ కీలక ప్రకటన వెలువరించారు. కందుల జాహ్నవి మృతిపై విచారం వ్యక్తం చేస్తూ నష్ట పరిహారంగా సియాటిల్ నగరం 29 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 262 కోట్లు) చెల్లిస్తామని ప్రకటించారు. ‘‘జాహ్నవి కందుల మరణం హృదయ విదారకమైనది. ఈ ఆర్థిక పరిష్కారం కందుల కుటుంబానికి కొంత ప్రశాంతతను తెస్తుందని నగరం ఆశిస్తోంది.’’ అని ఒక ప్రకటనలో తెలిపారు. ‘‘జాహ్నవి కందుల జీవితం ముఖ్యమైనది. ఇది ఆమె కుటుంబానికి, ఆమె స్నేహితులకు, మా సమాజానికి ముఖ్యమైనది..’’ అని పేర్కొన్నారు. మొత్తానికి రెండేళ్ల తర్వాత ఓ తెలుగు బిడ్డ ఘన విజయం సాధించింది.
తాజావార్తలు
-
Mecca Pact Explained: పాకిస్థాన్ పాచికలు చెల్లవు.. మక్కా ఒప్పందం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
-
Explainer: టాటా నానో రీఎంట్రీ..!? ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మరో అద్భుతం!
-
Tabu AI Deepfake Case: ఏఐ వీడియోలపై కోర్టుకెక్కిన టబు.. 150 లింకులపై కీలక ఆదేశాలు!
-
Explainer: రెస్టారెంట్ కిచెన్లో బొద్దింకల కాపురం..ఈగల సంసారం.. మీరు తింటున్నది ఇదే!
-
Toxic – Ramayana : సినిమా ఎలా ఉన్నా హైప్ మాత్రం భారీగా ఉండాలి.. ఇప్పుడిదే ట్రెండ్
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!