Pakistan: పాకిస్తాన్ చిరకాల మిత్రులు చైనా మరోసారి భారత్కి వ్యతిరేకంగా కుట్రలకు తెర తీసింది. ‘‘ఆపరేషన్ సిందూర్’’ తర్వాత చావు దెబ్బ తిన్న పాకిస్తాన్ ఆర్మీకి శాటిలైట్ సపోర్ట్ అందించేందు డ్రాగన్ కంట్రీ ముందుకు వచ్చింది. దీనిపై ఇరు దేశాల మధ్య గత వారం చర్చలు కూడా జరిగినట్లు తెలుస్తోంది. చైనా తన బీడౌ ఉపగ్రహ వ్యవస్థలను పాకిస్తాన్ సైన్యం యాక్సెస్ చేయడానికి మే 16న చైనా, పాకిస్తాన్ సైనిక అధికారుల మధ్య వ్యూహాత్మక సమావేశం జరిగింది.
Pakistan: పాకిస్తాన్ని వణికిస్తున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ)పై సైనిక చర్యలకు ఆ దేశం సిద్ధమైంది. పాకిస్తాన్లో అత్యంత పెద్దదైన బలూచిస్తాన్ ప్రావిన్సుని స్వతంత్ర దేశంగా మార్చాలని బీఎల్ఏ పోరాడుతోంది. ఈ వేర్పాటువాద గ్రూపుపై సైనిక దాడిని ప్రారంభించే ప్రణాళికను పాకిస్తాన్ అధికారులు ప్రకటించారు.
చైనా ప్రధాని లీ కియాంగ్కు పాకిస్థాన్ కొత్త గిఫ్ట్ ఇచ్చింది. ఈ రోజు ఉదయం, చైనా ఇంజనీర్లను చంపిన ఇద్దరు ఉగ్రవాదులను పాకిస్థాన్కు రాకముందే జైలుకు తరలించే పేరుతో..పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ సినిమా శైలిలో వారిని హతమార్చింది.