Ukraine Russia War: అసహనంతో రష్యా.. దాడులు తీవ్రం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై వరుస బాంబు దాడులతో విరుచుకుపడింది రష్యా. కీవ్ షాపింగ్ సెంటర్ పై దాడి చేసింది. ఈ ఘటనలో దాదాపు 8 మంది చనిపోయారు. కీవ్ లో కర్ఫ్యూ విధిస్తున్నట్టు మేయర్ ప్రకటించారు. కీలక బ్లాక్ సీ పోర్ట్ శివారులోనూ రెచ్చిపోయాయి మాస్కో బలగాలు. కొన్ని చోట్ల ఉక్రెయిన్ సామాన్య ప్రజలు రష్యా సైన్యానికి ఎదురునిలిచి దాడులు ఆపాలని నిరసనలు తెలుపుతున్నా తగ్గడం లేదు. సుమారు 2,389 మంది ఉక్రెయిన్ దేశ చిన్నారులను రష్యా కిడ్నాప్ చేసినట్లు ఉక్రెయిన్ విదేశాంగ శాఖ ఆరోపించడం సంచలనం సృష్టిస్తోంది. మరోవైపు రష్యా బీకర దాడిలో ధ్వంసమైన మారియుపోల్ శిథిలాల నుంచి 170మందిని పైగా బయటకు తీశారు రెస్క్యూ సిబ్బంది. మరోవైపు పుతిన్ ను వార్ క్రిమినల్ గా అభివర్ణించిన బైడెన్ వ్యాఖ్యలకు నిరసనగా, రష్యాలో అమెరికా రాయబారికి సమన్లు పంపింది మాస్కో. అమెరికా, రష్యా బంధాలను మరింత విచ్చిన్నం చేసేలా కామెంట్స్ వున్నాయని నిరసన వ్యక్తం చేసింది.
Read Also: Jagga Reddy: రేవంత్ చర్చలను బయటపెట్టిన జగ్గారెడ్డి..
Also Read
- Makkah: ఉద్రిక్తతల వేళ మక్కా ఒప్పందంలోకి ఇరాన్కు ఆహ్వానం! ఏదో జరుగుతోంది!
- Iran-US Tensions Escalate: అమెరికా ఆర్థిక ఆంక్షలకు మద్దతిస్తే ‘యుద్ధ చర్య’గానే చూస్తాం.. దేశాలకు ఇరాన్ హెచ్చరిక
- Modi-Trump: మోడీ–ట్రంప్ భేటీలో ట్విస్ట్.. ‘ప్రశ్నలు వద్దు’ అన్న భారత్, ట్రంప్ మాత్రం అడిగేశారు!
- Bangladesh: బంగ్లాదేశ్లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
ఇజ్రాయెల్ ఎటువైపో తేల్చుకోవాల్సిన తరుణమిదేనని, అధ్యక్షుడు జెలెన్ స్కీ అన్నారు. ఇజ్రాయెల్ పార్లమెంట్ ను ఉద్దేశించి ప్రసంగించిన జెలెన్ స్కీ, ఉక్రెయిన్ కు బాసటగా నిలవాలని విజ్ణప్తి చేశారు. స్వయంగా యూదుడైన జెలెన్ స్కీ, యూదు దేశమైన ఇజ్రాయెల్, ఉక్రెయిన్ పక్షాన వుండాలని కోరారు. అటు కీవ్, ఖార్కివ్, మరియూపోల్ ను స్వాధీనం చెయ్యాలన్న రష్యా అల్టిమేటంపై స్పందించిన జెలెన్ స్కీ, ఎట్టి పరిస్తితుల్లోనూ సరెండరయ్యే పరిస్థితేలేదన్నారు. మరోవైపు పశ్చిమ దేశాల మద్దతుతో ఉక్రెయిన్ నుంచి ప్రతిఘటన పెరిగేకొద్దీ రష్యా మరింత పట్టుదలతో దాడులు పెంచుతోంది. ఇప్పటికే కింజల్ హైపర్ సోనిక్ క్షిపణులను కూడా బరిలోకి దించడంతో.. భవిష్యత్తులో వ్యూహాత్మక అణ్వాయుధాలు కూడా వాడే ప్రమాదం ఉందన్న ఆందోళన కలిగిస్తోంది. మొత్తానికి 26 రోజులకు పైగా సాగుతున్న యుద్ధం అంతేలేకుండా సాగుతోంది. పట్టూవిడుపుల్లేకపోవడంతో, ఇరువర్గాల చర్చల్లో పురోగతి కనిపించడం లేదు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఇది ఫెడరల్ స్ఫూర్తిపై దెబ్బ.. పార్లమెంట్లో పంచాయితీ ఖాయం
-
Tamil Nadu: చెన్నైలో పరందూర్ ఎయిర్పోర్టును రద్దు చేసిన ప్రభుత్వం.. మండిపడ్డ స్టాలిన్
-
CM Revanth Reddy : కేంద్రంపై సీఎం రేవంత్ ఫైర్.. నన్ను కాదు.. తెలంగాణ ప్రజలనే తిరస్కరించారు
-
Pydithalli Ammavari Jatara 2026: విజయనగరం పైడితల్లి జాతర షెడ్యూల్ ఇదే.. సిరిమాను ఉత్సవం ఎప్పుడంటే?
-
Hyderabad Traffic : హైదరాబాద్ ట్రాఫిక్కు అసలు విలన్ ఎవరు.?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!