UK: మాంచెస్టర్లో దుండగుడు కత్తితో వీరంగం.. ఇద్దరు మృతి
- మాంచెస్టర్లో యూదుల ప్రార్థనా మందిరం దగ్గర కత్తితో దాడి
- ఇద్దరు మృతి.. నలుగురికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూకేలోని మాంచెస్టర్ సినాగోగ్లో ఓ దుండగుడు వీరంగం సృష్టించాడు. యూదుల ప్రార్థనా మందిరం వెలుపల ఉన్న వారిని వాహనంతో ఢీకొట్టి.. అనంతరం కత్తితో వీరంగం సృష్టించాడు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా.. నలుగురు గాయపడ్డారు.
గురువారం ఉదయం ఉత్తర మాంచెస్టర్లోని యుదుల ప్రార్థనా మందిరం వెలుపల వాహనంతో ఢీకొట్టి అనంతరం కత్తితో దుండగుడు దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా.. నలుగురు గాయపడ్డారని బ్రిటిష్ పోలీసులు తెలిపారు. సంఘటనాస్థలిలోనే నిందితుడిని పోలీసులు కాల్చి చంపినట్లు తెలుస్తోంది.
Also Read
- Trump China Visit: చైనా భయంతో అమెరికాకు రాగానే వాటిని చెత్తబుట్టల్లో పడేసిన ట్రంప్ సిబ్బంది.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే!
- Pakistan: అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం..
- Iran-US Mediation: పాక్పై నమ్మకం లేదు.. ఇరాన్ యుద్ధంలో భారత్నే నమ్ముతున్న రష్యా
- PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
ఇది కూడా చదవండి: Rajnath Singh: భారత్ బలమేంటో ఆపరేషన్ సిందూర్తో పాక్ రుచిచూసింది
ప్రత్యక్ష సాక్షి ప్రకారం.. కారు నడుపుతున్న వ్యక్తి పాదచారులపైకి వాహనాన్ని పోనిచ్చాడని.. అనంతరం కత్తితో దాడి చేశాడని తెలిపారు. గురువారం ఉదయం 9:30 గంటలకు ఈ సంఘటన జరిగినట్లుగా పేర్కొన్నారు. పోలీసులు నిమిషాల వ్యవధిలోనే హంతకుడ్ని కాల్చి చంపినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Ram Talluri: జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా టాప్ ప్రొడ్యూసర్..!
హంతకుడి శరీరంపై అనుమానాస్పద వస్తువులు ఉండటంతో బాంబ్ స్క్వాడ్ మోహరించి నిర్వీర్యం చేశారు. భద్రతా సమస్యల కారణంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. ఇంకా బాధితులు, హంతకుడి వివరాలు పోలీసులు ఇంకా వెల్లడించలేదు. ప్రస్తుతం దర్యాప్తు సాగుతోంది. ప్రాథమిక విచారణ పూర్తయ్యాక వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
అయితే ఈ దాడిని యూకే ప్రధాని కీర్ స్టార్మర్ ఖండించారు. ఇది దారుణ సంఘటనగా అభివర్ణించారు. ప్రార్థనా మందిరం దగ్గర జరిగిన దాడి తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పారు. ఆప్తులను కోల్పోయిన వారికి సానుభూతి తెలియజేస్తున్నట్లు తెలిపారు. అలాగే బాధితులు కూడా త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
గ్రేటర్ మాంచెస్టర్ మేయర్ ఆండీ బర్న్హామ్ స్పందిస్తూ.. యూదుల మందిరం దగ్గర జరిగిన సంఘటన తీవ్రమైన సంఘటనగా అభివర్ణించారు. అందరూ ప్రశాంతంగా ఉండాలని కోరారు. పోలీసులు వేగంగా స్పందించింది సమస్యను పరిష్కరించారని పేర్కొన్నారు. ప్రజలు ఆ ప్రాంతానికి దూరంగా ఉండాలని కోరారు.
❗️'Four People' Injured In Car Ramming & Stabbing Attack At Synagogue In Manchester, 🇬🇧 During Jewish Holiday Yom Kippur – Officials
The suspect was reportedly shot, but is believed to be alive following the attack at the Heaton Park synagogue in Crumpsall.
📹: Social Media pic.twitter.com/CHUwEY4XTL
— RT_India (@RT_India_news) October 2, 2025
❗️'Four People' Injured In Car Ramming & Stabbing Attack At Synagogue In Manchester, 🇬🇧 During Jewish Holiday Yom Kippur – Officials
The suspect was reportedly shot, but is believed to be alive following the attack at the Heaton Park synagogue in Crumpsall.
📹: Social Media pic.twitter.com/CHUwEY4XTL
— RT_India (@RT_India_news) October 2, 2025
తాజావార్తలు
-
Virat Kohli: “ప్రతి సీజన్ను నరకంలా అనుభవించాను”.. 18 ఏళ్లుగా తన గుండెల్లోని బాధను బయటపెట్టిన కోహ్లీ..
-
PM Modi: విదేశీ ప్రయాణాలపై పన్ను విధింపులంటూ వార్తలు.. ప్రధాని మోడీ కీలక ప్రకటన
-
Video Viral: నాలుగు సిక్సర్ల తుఫాన్.. పూరన్కు వంగి సెల్యూట్ చేసిన ముకుల్.!
-
AP Horror: మాఫియాలో చేరాలని ప్లాన్.. స్నేహితుడితో కలిసి తల్లిని హత్య చేసిన కొడుకు.. బంగారంతో పరారీ
-
Dubai: విమానంలో ఫోటోలు తీస్తే 10 ఏళ్ల జైలా? దుబాయ్ కోర్టు సంచలన తీర్పు..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..