UK: మాంచెస్టర్లో దుండగుడు కత్తితో వీరంగం.. ఇద్దరు మృతి
- మాంచెస్టర్లో యూదుల ప్రార్థనా మందిరం దగ్గర కత్తితో దాడి
- ఇద్దరు మృతి.. నలుగురికి గాయాలు
యూకేలోని మాంచెస్టర్ సినాగోగ్లో ఓ దుండగుడు వీరంగం సృష్టించాడు. యూదుల ప్రార్థనా మందిరం వెలుపల ఉన్న వారిని వాహనంతో ఢీకొట్టి.. అనంతరం కత్తితో వీరంగం సృష్టించాడు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా.. నలుగురు గాయపడ్డారు.
గురువారం ఉదయం ఉత్తర మాంచెస్టర్లోని యుదుల ప్రార్థనా మందిరం వెలుపల వాహనంతో ఢీకొట్టి అనంతరం కత్తితో దుండగుడు దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా.. నలుగురు గాయపడ్డారని బ్రిటిష్ పోలీసులు తెలిపారు. సంఘటనాస్థలిలోనే నిందితుడిని పోలీసులు కాల్చి చంపినట్లు తెలుస్తోంది.
Also Read
- Trump: ‘‘ఆ..చెత్తంతా చదవొద్దు’’.. జర్నలిస్ట్పై ట్రంప్ ఆగ్రహం
- Sheikh Yusuf Afridi: ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో దుండగుల కాల్పులు.. లష్కర్-ఎ-తోయిబా అగ్ర కమాండర్ షేక్ అఫ్రిది హతం
- Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఆరోగ్యంపై సస్పెన్స్ వీడినట్టేనా!? కుడ్యచిత్రం ఆవిష్కరణ
- WHCD Shooter: నిందితుడి హిట్ లిస్ట్ నుంచి అతనొక్కడే మినహాయింపు.. కారణమేంటో..! సర్వత్రా చర్చ
ఇది కూడా చదవండి: Rajnath Singh: భారత్ బలమేంటో ఆపరేషన్ సిందూర్తో పాక్ రుచిచూసింది
ప్రత్యక్ష సాక్షి ప్రకారం.. కారు నడుపుతున్న వ్యక్తి పాదచారులపైకి వాహనాన్ని పోనిచ్చాడని.. అనంతరం కత్తితో దాడి చేశాడని తెలిపారు. గురువారం ఉదయం 9:30 గంటలకు ఈ సంఘటన జరిగినట్లుగా పేర్కొన్నారు. పోలీసులు నిమిషాల వ్యవధిలోనే హంతకుడ్ని కాల్చి చంపినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Ram Talluri: జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా టాప్ ప్రొడ్యూసర్..!
హంతకుడి శరీరంపై అనుమానాస్పద వస్తువులు ఉండటంతో బాంబ్ స్క్వాడ్ మోహరించి నిర్వీర్యం చేశారు. భద్రతా సమస్యల కారణంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. ఇంకా బాధితులు, హంతకుడి వివరాలు పోలీసులు ఇంకా వెల్లడించలేదు. ప్రస్తుతం దర్యాప్తు సాగుతోంది. ప్రాథమిక విచారణ పూర్తయ్యాక వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
అయితే ఈ దాడిని యూకే ప్రధాని కీర్ స్టార్మర్ ఖండించారు. ఇది దారుణ సంఘటనగా అభివర్ణించారు. ప్రార్థనా మందిరం దగ్గర జరిగిన దాడి తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పారు. ఆప్తులను కోల్పోయిన వారికి సానుభూతి తెలియజేస్తున్నట్లు తెలిపారు. అలాగే బాధితులు కూడా త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
గ్రేటర్ మాంచెస్టర్ మేయర్ ఆండీ బర్న్హామ్ స్పందిస్తూ.. యూదుల మందిరం దగ్గర జరిగిన సంఘటన తీవ్రమైన సంఘటనగా అభివర్ణించారు. అందరూ ప్రశాంతంగా ఉండాలని కోరారు. పోలీసులు వేగంగా స్పందించింది సమస్యను పరిష్కరించారని పేర్కొన్నారు. ప్రజలు ఆ ప్రాంతానికి దూరంగా ఉండాలని కోరారు.
❗️'Four People' Injured In Car Ramming & Stabbing Attack At Synagogue In Manchester, 🇬🇧 During Jewish Holiday Yom Kippur – Officials
The suspect was reportedly shot, but is believed to be alive following the attack at the Heaton Park synagogue in Crumpsall.
📹: Social Media pic.twitter.com/CHUwEY4XTL
— RT_India (@RT_India_news) October 2, 2025
❗️'Four People' Injured In Car Ramming & Stabbing Attack At Synagogue In Manchester, 🇬🇧 During Jewish Holiday Yom Kippur – Officials
The suspect was reportedly shot, but is believed to be alive following the attack at the Heaton Park synagogue in Crumpsall.
📹: Social Media pic.twitter.com/CHUwEY4XTL
— RT_India (@RT_India_news) October 2, 2025
తాజావార్తలు
-
రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
-
Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
-
Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
-
MS. Subbalakshmi : ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ పుకార్లపై క్లారిటీ ఇచ్చిన బన్ని వాస్
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!