Rajnath Singh: భారత్ బలమేంటో ఆపరేషన్ సిందూర్తో పాక్ రుచిచూసింది
- భారత్ బలమేంటో ఆపరేషన్ సిందూర్తో పాక్ రుచిచూసింది
- సర్ క్రీక్ విషయంలో హద్దులు దాటితే తీవ్ర పరిణామాలుంటాయని రాజ్నాథ్సింగ్ హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ బలమేంటో ఆపరేషన్ సిందూర్తో మన దళాలు పాకిస్థాన్కు రుచిచూపించాయని రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ అన్నారు. దసరా సందర్భంగా భుజ్లో సైనిక దళాలతో కలిసి రాజ్నాథ్సింగ్ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాకిస్థాన్కు రాజ్నాథ్సింగ్ హెచ్చరికలు జారీ చేశారు. స్వాతంత్య్రం వచ్చి 78 సంవత్సరాల తర్వాత కూడా సర్ క్రీక్ ప్రాంతంలో సరిహద్దు వివాదం రేగుతోందని.. చర్చల ద్వారా పరిష్కరించడానికి భారతదేశం అనేక ప్రయత్నాలు చేసిందని తెలిపారు. కానీ పాకిస్థాన్ ఉద్దేశాలు మాత్రం స్పష్టంగా కనిపించడం లేదని చెప్పారు. ప్రస్తుతం సర్క్రీక్ ప్రాంతంలో పాక్ దళాలు మోహరించే ప్రయత్నం చేస్తోందని.. రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తోందని పేర్కొన్నారు. ఒకవేళ ఏదైనా దురాక్రమణకు పాల్పడితే మాత్రం బలమైన ప్రతిస్పందన ఉంటుందని.. పాకిస్థాన్కు రాజ్నాథ్సింగ్ గట్టి వార్నింగ్ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Singer Zubeen Garg: జుబీన్ గార్గ్ భార్య సంచలన ఆరోపణలు
Also Read
- Modi-Trump: మోడీ–ట్రంప్ భేటీలో ట్విస్ట్.. ‘ప్రశ్నలు వద్దు’ అన్న భారత్, ట్రంప్ మాత్రం అడిగేశారు!
- AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
- Uttar Pradesh: కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో రాజకీయ చిచ్చు.. కుమార్తెపై అల్లుడి దాడి!
- Bangladesh: హసీనా ఎఫెక్ట్.. బంగ్లా ప్రధాని భారత్ పర్యటనపై తర్జనభర్జన!
భారత బలానికి సైన్యం, వైమానిక దళం, నావికాదళం మూడు స్తంభాలుగా రాజ్నాథ్సింగ్ అభివర్ణించారు. ఈ మూడు సేవలు కలిసి పనిచేసినప్పుడు మాత్రమే మనం ప్రతి సవాలును సమర్థవంతంగా ఎదుర్కోగలం అని తెలిపారు. ఆయుధాలు ధర్మాన్ని స్థాపించడానికి ఒక సాధనమని నమ్ముతున్నట్లు చెప్పారు. ఉగ్రవాదాన్నైనా.. మరే ఇతర సమస్య అయినా ఎదుర్కోవడానికి… ఓడించడానికి భారత్కు సామర్థ్యం ఉందని స్పష్టం చేశారు. ఇప్పటికే ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ సత్తా ఏంటో పాకిస్థాన్ రుచి చూసిందని పేర్కొన్నారు. భారత్ దళాలు పాకిస్థాన్పై ఎప్పుడు, ఎక్కడైనా, ఎలా కావాలంటే అప్పుడు భారీ నష్టాన్ని కలిగించగలవని ప్రపంచానికి ఒక సందేశం పంపించిందని తెలిపారు. పరిస్థితిని తీవ్రతరం చేయడం ఆపరేషన్ సిందూర్ లక్ష్యం కాదన్నారు. ఉగ్రవాదంపై పోరాటం మాత్రం కొనసాగుతుందని రాజ్నాథ్సింగ్ చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: PM Modi: కాంగ్రెస్ చీఫ్ ఖర్గేకు మోడీ ఫోన్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
భారత్ సైన్యం, బీఎస్ఎఫ్ సంయుక్తంగా భారత సరిహద్దులను కాపాడుతున్నాయని తెలిపారు. ఒకవేళ సర్ క్రీక్ ప్రాంతంలో పాకిస్థాన్ వైపు నుంచి మాత్రం ఏదైనా దుస్సాహసం జరిగితే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ సందర్భంగా 1965 యుద్ధాన్ని గుర్తుచేశారు. అప్పుడు భారత బలగాలు లాహోర్కు వెళ్లగలిగే సత్తాను ప్రదర్శించాయన్నారు. ఇప్పుడిది 2025 అని గుర్తుపెట్టుకోవాలని రాజ్నాథ్ చురకలు అంటించారు.
సర్ క్రీక్ అనేది గుజరాత్లోని కచ్-పాకిస్థాన్లోని సింధ్ ప్రావిన్స్ మధ్య ఉన్న 96 కి.మీల నదీముఖద్వారం. ఈ నదీ ముఖద్వారం మధ్యలో సరిహద్దు ఉండాలని భారతదేశం చెబుతోంది. పాకిస్థాన్ మాత్రం భారతదేశానికి సరిహద్దు తూర్పు ఒడ్డున ఉండాలని వాదిస్తోంది.
తాజావార్తలు
-
Modi-Trump: మోడీ–ట్రంప్ భేటీలో ట్విస్ట్.. ‘ప్రశ్నలు వద్దు’ అన్న భారత్, ట్రంప్ మాత్రం అడిగేశారు!
-
Hollywood: హాలీవుడ్ దెబ్బకు బాలీవుడ్ బెంబేలు .. ‘స్పైడర్ మ్యాన్’ దూకుడుతో మారుతున్న బాక్సాఫీస్ లెక్కలు
-
Yashasvi Jaiswal: ‘అలా ప్రవర్తించకూడదు’.. జైస్వాల్పై ఐసీసీ చర్యలు తప్పవు?
-
Karn Sharma Retirement: నాలుగు ఐపీఎల్ టైటిళ్ల హీరో రిటైర్మెంట్.. భారత్, ఐపీఎల్, దేశవాళీ క్రికెట్కు గుడ్బై!
-
Rahul Ramakrishna: అలాంటి పాత్రలు చేయడం ఇష్టం లేదు.. విజయ్ దేవరకొండ నా కాల్స్ తీసుకోవడం మానేశాడు..
ట్రెండింగ్
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క