Pakistan: టర్కీ నుంచి భారీగా ఆయుధాలు.. పాక్ ఏదో పెద్ద స్కెచ్ వేస్తోందా?
- భారత్కు వ్యతిరేకంగా భారీ వ్యూహం తయారు చేస్తున్న పాక్..?
- టర్కీ నుంచి భారీగా ఆయుధాలు, డ్రోన్ల దిగుమతి..
- అంతర్గత సమస్యల నుంచి తప్పించుకునేందు యుద్ధం..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ ఏదో భారీగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతర్గతంగా ఉన్న సమస్యల్ని పక్కదారి పట్టించేందుకు భారత్పై యుద్ధం చేయాలని భావిస్తుందా.? అనే అనుమానాలు కలుగుతున్నాయి. పాకిస్తాన్ టర్కీ నుంచి భారీగా ఆయుధాలు దిగుమతి చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్లో కీలక వైమానిక స్థావరమైన నూర్ ఖాన్ ఎయిర్ బేస్కు టర్కీ సైనిక విమానాల రాకపోకలు పెరిగినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా సీ-130 హెర్క్యులెస్ విమానాలు రావల్పిండిలోని నూర్ ఖాన్, కరాచీలోని మసూర్ వైమానిక స్థావరాలకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఆగస్టు 19 నుంచి 21 వరకు టర్కీకి చెందిన C-130 విమానాలు పాకిస్తాన్కు వచ్చి వెళ్లాయి. దీనిని భారత నిఘా వర్గాలు అసాధారణ పరిణామంగా గుర్తించింది. ఈ విమానాల ద్వారా పాకిస్తాన్ డ్రోన్లు, డ్రోన్ సంబంధిత పరికరాలు, ఇతర సైనిక సామాగ్రి తరలించి ఉండొచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. ఇదే కాకుండా చైనా నుంచి కూడా భారీగా ఆయుధాల దిగుమతి జరుగుతోందని తెలుస్తోంది. ముఖ్యంగా పాకిస్తాన్ HQ సిరీస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ పొందిందనే వాదన కూడా ఉంది. అయితే, ఈ ఆయుధాలు లేదా డ్రోన్ల సరఫరాపై పాకిస్తాన్ లేదా టర్కీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ రాలేదు.
Also Read
- Putin: జూడోలో బ్లాక్ బెల్ట్.. KGB గూఢచారి.. చివరికి రష్యా అధ్యక్షుడు.. పుతిన్ జీవితం ఆసక్తికరం!
- China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
- Saudi-Trump: హౌతీలపై దాడులు చేయాలని ట్రంప్కు సౌదీ విజ్ఞప్తి.. అధ్యక్షుడు షాకింగ్ రియాక్షన్
- Putin Car: బుల్లెట్లు, బాంబులు ఏం చేయలేవు.. పుతిన్ ‘‘ఆరస్ సెనాట్’’ కారు ప్రత్యేకతలు ఇవే..
అయితే, టర్కీ డ్రోన్లపై పాక్ ఎప్పటి నుంచో ఆసక్తి చూపిస్తోంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ టర్కీ డ్రోన్లను భారత్పై వాడింది. వీటన్నింటిని భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఇప్పటికే బైరక్టర్ టీబీ2 డ్రోన్లు పాక్ వద్ద ఉన్నాయి. గతంలో భారత్ తో సైనిక ఘర్షణ సమయంలో టర్కీ తన డ్రోన్ ఆపరేటర్లను కూడా పాకిస్తాన్లో మోహరించింది. ప్రస్తుతం పాక్ తన మానవరహిత వైమానిక సామర్థ్యాలను (UAV) పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా ఎక్కువసేపు గాల్లో ఉండగల డ్రోన్లు, లాయిటరింగ్ మ్యునిషన్ వంటి వ్యవస్థల్ని సమకూర్చుకుంటోంది.
తాజావార్తలు
-
Army Camp Arms Theft: బొల్లారం ఆర్మీ క్యాంప్లో ఆయుధాల చోరీ.. మాజీ సైనికుడి అరెస్ట్
-
Andhra Pradesh: గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్.. మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Modi-Putin: పుతిన్కు మోదీ ‘తమిళ వేదం’.. తిరుక్కురళ్ బహూకరణ
-
Allahabad High Court: దంతాలు, వెంట్రుకలతో బాలికగా తేల్చలేం.. అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
-
Bhatti Vikramarka : దేశానికే ఆదర్శం తెలంగాణ కులగణన మోడల్..
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?