Trump: భారత్లో పెట్టుబడులు ఆపండి.. వైట్హౌస్ విందులో ఆపిల్ సీఈవోకు ట్రంప్ సూచన
- భారత్లో పెట్టుబడులు ఆపండి
- వైట్హౌస్ విందులో ఆపిల్ సీఈవోకు ట్రంప్ సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్పై ట్రంప్ కక్ష కట్టినట్లుగా మరోసారి రుజువైంది. ఇప్పటికే సుంకాల పేరుతో భారీ బాదుడు బాదుతున్నారు. తాజాగా వైట్హౌస్ వేదికగా టెక్ సీఈవోలకు ప్రత్యేక విందు ఇచ్చారు. ఈ విందు సందర్భంగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. భారత్లో పెట్టుబడులు ఆపి.. స్వదేశంలో పెట్టుబడులు పెట్టాలంటూ ఆపిల్ సీఈవోతో ట్రంప్ సంభాషించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Modi-Trump: మోడీ-ట్రంప్ స్నేహం ముగిసింది.. అమెరికా మాజీ సలహాదారు జాన్ బోల్టన్ వ్యాఖ్య
Also Read
- Trump: నెతన్యాహు నేను చెప్పిందే చేస్తారు.. ఇజ్రాయెల్లో నేనే ప్రధాని కావొచ్చన్న ట్రంప్
- PM Modi: ఇటలీలో మోడీకి అత్యున్నత గౌరవం.. అగ్రికోలా మెడల్తో సత్కారం
- Modi-Meloni: హైలెట్గా ఇటలీ టూర్.. మోడీ-మెలోని ఫొటోలు వైరల్
- Modi-Meloni: గంటల్లోనే కోట్లలో వ్యూస్.. ఇంటర్నెట్లో ప్రకంపనలు రేపుతున్న మెలోడీ వీడియో
గురువారం వైట్హౌస్లో టెక్ సీఈవోలకు ట్రంప్ ప్రత్యేక విందు ఇచ్చారు. ఒక పొడవాటి టేబుల్పై ట్రంప్ దంపతులు, సీఈవోలంతా కూర్చున్నారు. ఈ సందర్భంగా గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ సీఈవోలతో ట్రంప్ సంభాషిస్తూ ఇతర దేశాల్లో పెట్టుబడులు ఆపి యూఎస్లో పెట్టుబడులు పెట్టాలని సూచించారు. గత మే నెలలో ఆపిల్ సీఈవో టిమ్ కుక్తో ట్రంప్ మాట్లాడుతూ.. ఆపిల్ ఉత్పత్తులను భారత్లో నిలిపివేయాలని చెప్పారు. తాజాగా మరోసారి అదే విషయాన్ని మళ్లీ లేవనెత్తారు.

కుక్తో ఇలా..
అమెరికాలో ఎంత డబ్బు పెట్టుబడి పెడుతున్నారు? అని కుక్ను అడిగారు. చాలా మొత్తంలో పెట్టుబడి పెడుతున్నట్లు తనకు తెలుసు అన్నారు. ఇప్పటి వరకు వేరే చోట ఉన్నారని.. ఇప్పుడు సొంతింటికి వచ్చేస్తున్నారని.. ఎంత పెట్టుబడి పెడుతున్నారని టిమ్ కుక్ను ట్రంప్ అడిగారు. దీనికి కుక్ సమాధానం ఇస్తూ.. 600 బిలియన్లు అని బదులిచ్చారు. దీంతో ట్రంప్ ప్రశంసించారు. భారతదేశంలో పెట్టుబడులు పెట్టడం ఏ మాత్రం తనకు ఇష్టం లేదని ట్రంప్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అమెరికాలో బాగా చూసుకుంటామని.. ఇకపై భారత్లో పెట్టుబడులు పెట్టొద్దని సూచించారు.
ఇది కూడా చదవండి: Ajit Pawar-IPS: నీకెంత ధైర్యం? మా వాళ్లనే అడ్డుకుంటావా? ఐపీఎస్పై డిప్యూటీ సీఎం చిందులు
ఇక విందులో కుడివైపున కూర్చున్న మెటా సీఈవో జుకర్బర్గ్ను కూడా ట్రంప్ ప్రశ్నించారు. అమెరికాలో మీరెంత పెట్టుబడి పెడుతున్నారని అడిగారు. తాను కూడా 600 బిలియన్లు అని సమాధానం ఇచ్చారు. తదుపరి ప్రశ్న గూగుల్ సీఈవోను అడిగారు. దీనికి ప్రస్తుతతం 100 బిలియన్లకు దగ్గరగా ఉన్నామని.. రాబోయే రెండేళ్లలో 250 బిలియన్లకు చేరుకుంటుందని వెల్లడించారు. ఇక మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల మాట్లాడుతూ.. ప్రస్తుతం 75 నుంచి 80 బిలియన్లకు దగ్గరలో ఉన్నట్లు పేర్కొన్నారు. చాలా బాగుంది.. మిమ్మల్ని చూస్తుంటే గర్వగా ఉందని.. మీ అందరికీ ధన్యవాదాలు అంటూ ట్రంప్ ముగించారు.
.@Apple CEO @tim_cook: "I want to thank you for setting the tone such that we could make a major [$600 billion] investment in the United States… That says a lot about your focus and your leadership and your focus on innovation." pic.twitter.com/289vkiB6vy
— Rapid Response 47 (@RapidResponse47) September 5, 2025
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!