Modi-Trump: మోడీ-ట్రంప్ స్నేహం ముగిసింది.. అమెరికా మాజీ సలహాదారు జాన్ బోల్టన్ వ్యాఖ్య
- మోడీ-ట్రంప్ స్నేహం ముగిసింది
- అమెరికా మాజీ సలహాదారు జాన్ బోల్టన్ వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ-అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య స్నేహం ముగిసినట్లుగా భావిస్తున్నట్లు అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ స్పష్టం చేశారు. బ్రిటిష్ మీడియా పోర్టల్ ఎల్బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బోల్టన్ మాట్లాడారు. ట్రంప్ సుంకాలు కారణంగానే దశాబ్దాలు నాటి అమెరికా-భారత్ బంధాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ఒకప్పుడు ట్రంప్-మోడీ మధ్య బలమైన సంబంధాలు ఉండేవని.. ఇప్పుడు కనుమరుగైపోయిందని తెలిపారు. సుంకాలు కారణంగా దశాబ్దాలుగా రెండు దేశాల మధ్య ఉన్న బంధం ఒక్కసారిగా వెనక్కి పోయిందని చెప్పుకొచ్చారు. ఒకప్పుడైతే ఇద్దరి మధ్య వ్యక్తిగతంగా చాలా మంచి సంబంధం ఉండేదని.. ప్రస్తుతం అయితే ఆ బంధం లేదనే భావిస్తున్నట్లు తెలిపారు. ఇది అందరికీ ఒక పాఠం అని చెప్పారు. ఇక చైనాలో జరిగిన ఎస్సీవో శిఖరాగ్ర సమావేశంలో రష్యా, చైనా నాయకులతో ప్రధాని మోదీ కూడా ఉండటంపై ఆయన స్పందిస్తూ.. ప్రపంచ క్రమం మారుతున్నట్లుగా కనిపిస్తుందన్నారు. సుంకాలు కారణంగానే ఇదంతా జరుగుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉక్రెయిన్-రష్యా వార్లోకి భారత్ను లాగడంతోనే ఈ తంటాలు వచ్చాయని అభిప్రాయపడ్డారు.
ఇది కూడా చదవండి: Ajit Pawar-IPS: నీకెంత ధైర్యం? మా వాళ్లనే అడ్డుకుంటావా? ఐపీఎస్పై డిప్యూటీ సీఎం చిందులు
Also Read
- Trump: ఇరాన్పై ట్రంప్ సరికొత్త యుద్ధం.. సముద్రం నుంచి భూమి వరకు పన్నిన భారీ వ్యూహం ఇదే!
- Pakistan: ఇద్దరు భారతీయులకు పాక్ అత్యున్నత పురస్కారం.. ఎందుకు ఇస్తోంది? జిన్నాతో సంబంధం ఏమిటి?
- Bangladesh: బంగ్లాదేశ్లో ఒకే హిందూ కుటుంబానికి చెందిన నలుగురు దారుణ హత్య?
- Japan Earthquake: జపాన్లో 5.9 తీవ్రతతో భూకంపం.. 20 మందికి గాయాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం
ఏప్రిల్ 2018-సెప్టెంబర్ 2019 వరకు ట్రంప్ జాతీయ భద్రతా సలహాదారుగా బోల్టన్ ఉన్నారు. ప్రస్తుతం ట్రంప్ తీసుకున్న నిర్ణయాలను బోల్టన్ బహిరంగంగా తప్పుపట్టారు. ట్రంప్ దగ్గర పని చేసిన వ్యక్తే వ్యతిరేకించారు.
ఇది కూడా చదవండి: Sri Lanka: శ్రీలంకలో ఘోర విషాదం.. లోయలో పడ్డ బస్సు.. 15 మంది మృతి
భారత్పై తొలుత ట్రంప్ 25 శాతం సుంకం విధించారు. అనంతరం రష్యాతో సంబంధాలు పెట్టుకున్నందుకు జరిమానా విధిస్తున్నట్లు మరో బాంబ్ పేల్చారు. అన్నట్టుగానే జరిమానాగా మరో 25 శాతం సుంకం విధించారు. దీంతో భారత్పై 50 శాతం సుంకం అమల్లోకి వచ్చింది. అయితే రైతుల కోసం ఎంత భారమైనా భరిస్తామంటూ మోడీ బదులిచ్చారు. రాజీపడబోమని తేల్చి చెప్పారు.
తాజావార్తలు
-
Irumudi Break: ఒకటిన్నర రోజులోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’తో రవితేజ బాక్సాఫీస్ విధ్వంసం! ట్రేడ్ రిపోర్ట్ ఇదే..
-
Shah Jahan Daughters: షాజహాన్ తన ముగ్గురు కుమార్తెలకు ఎందుకు పెళ్లిళ్లు చేయలేదు.? అసలు కారణం ఇదేనా.?
-
Karumuri Nageswara Rao : ఏపీ లిక్కర్ రవాణా స్కామ్లో మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్
-
Cricket Betting :ప్రియురాలికి ప్రాంక్.. పోలీసులకు జాక్పాట్.. రూ.30 లక్షల బెట్టింగ్ గుట్టురట్టు
-
Nijjar Killing: ఖలిస్తానీ నిజ్జర్ను చంపింది మేమే.. గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్ సంచలనం..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!