Modi-Trump: మోడీ-ట్రంప్ స్నేహం ముగిసింది.. అమెరికా మాజీ సలహాదారు జాన్ బోల్టన్ వ్యాఖ్య
- మోడీ-ట్రంప్ స్నేహం ముగిసింది
- అమెరికా మాజీ సలహాదారు జాన్ బోల్టన్ వ్యాఖ్య
ప్రధాని మోడీ-అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య స్నేహం ముగిసినట్లుగా భావిస్తున్నట్లు అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ స్పష్టం చేశారు. బ్రిటిష్ మీడియా పోర్టల్ ఎల్బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బోల్టన్ మాట్లాడారు. ట్రంప్ సుంకాలు కారణంగానే దశాబ్దాలు నాటి అమెరికా-భారత్ బంధాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ఒకప్పుడు ట్రంప్-మోడీ మధ్య బలమైన సంబంధాలు ఉండేవని.. ఇప్పుడు కనుమరుగైపోయిందని తెలిపారు. సుంకాలు కారణంగా దశాబ్దాలుగా రెండు దేశాల మధ్య ఉన్న బంధం ఒక్కసారిగా వెనక్కి పోయిందని చెప్పుకొచ్చారు. ఒకప్పుడైతే ఇద్దరి మధ్య వ్యక్తిగతంగా చాలా మంచి సంబంధం ఉండేదని.. ప్రస్తుతం అయితే ఆ బంధం లేదనే భావిస్తున్నట్లు తెలిపారు. ఇది అందరికీ ఒక పాఠం అని చెప్పారు. ఇక చైనాలో జరిగిన ఎస్సీవో శిఖరాగ్ర సమావేశంలో రష్యా, చైనా నాయకులతో ప్రధాని మోదీ కూడా ఉండటంపై ఆయన స్పందిస్తూ.. ప్రపంచ క్రమం మారుతున్నట్లుగా కనిపిస్తుందన్నారు. సుంకాలు కారణంగానే ఇదంతా జరుగుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉక్రెయిన్-రష్యా వార్లోకి భారత్ను లాగడంతోనే ఈ తంటాలు వచ్చాయని అభిప్రాయపడ్డారు.
ఇది కూడా చదవండి: Ajit Pawar-IPS: నీకెంత ధైర్యం? మా వాళ్లనే అడ్డుకుంటావా? ఐపీఎస్పై డిప్యూటీ సీఎం చిందులు
Also Read
- Ukraine: ట్రంప్ను ప్రసన్నం చేసుకునేందుకు ఉక్రెయిన్ మాస్టర్ ప్లాన్!
- Titanic Life Jacket: 114 ఏళ్ల కిందటి విషాదానికి సాక్ష్యం.. వేలంలో రూ.8 కోట్లు పలికిన టైటానిక్ లైఫ్ జాకెట్!
- Donald Trump: గుడ్న్యూస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్.. ఈ శుక్రవారంతో అంతా ఫైనల్..
- Condom Prices: బెడ్రూమ్లో అమెరికా - ఇరాన్ 'వార్' సెగ! కండోమ్ ధరలకు రెక్కలు!
ఏప్రిల్ 2018-సెప్టెంబర్ 2019 వరకు ట్రంప్ జాతీయ భద్రతా సలహాదారుగా బోల్టన్ ఉన్నారు. ప్రస్తుతం ట్రంప్ తీసుకున్న నిర్ణయాలను బోల్టన్ బహిరంగంగా తప్పుపట్టారు. ట్రంప్ దగ్గర పని చేసిన వ్యక్తే వ్యతిరేకించారు.
ఇది కూడా చదవండి: Sri Lanka: శ్రీలంకలో ఘోర విషాదం.. లోయలో పడ్డ బస్సు.. 15 మంది మృతి
భారత్పై తొలుత ట్రంప్ 25 శాతం సుంకం విధించారు. అనంతరం రష్యాతో సంబంధాలు పెట్టుకున్నందుకు జరిమానా విధిస్తున్నట్లు మరో బాంబ్ పేల్చారు. అన్నట్టుగానే జరిమానాగా మరో 25 శాతం సుంకం విధించారు. దీంతో భారత్పై 50 శాతం సుంకం అమల్లోకి వచ్చింది. అయితే రైతుల కోసం ఎంత భారమైనా భరిస్తామంటూ మోడీ బదులిచ్చారు. రాజీపడబోమని తేల్చి చెప్పారు.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?