ప్రధాని మోడీ-అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య స్నేహం ముగిసినట్లుగా భావిస్తున్నట్లు అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ స్పష్టం చేశారు. బ్రిటిష్ మీడియా పోర్టల్ ఎల్బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బోల్టన్ మాట్లాడారు. ట్రంప్ సుంకాలు కారణంగానే దశాబ్దాలు నాటి అమెరికా-భారత్ బంధాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ఒకప్పుడు ట్రంప్-మోడీ మధ్య బలమైన సంబంధాలు ఉండేవని.. ఇప్పుడు కనుమరుగైపోయిందని తెలిపారు. సుంకాలు కారణంగా దశాబ్దాలుగా రెండు దేశాల మధ్య ఉన్న బంధం ఒక్కసారిగా వెనక్కి పోయిందని చెప్పుకొచ్చారు. ఒకప్పుడైతే ఇద్దరి మధ్య వ్యక్తిగతంగా చాలా మంచి సంబంధం ఉండేదని.. ప్రస్తుతం అయితే ఆ బంధం లేదనే భావిస్తున్నట్లు తెలిపారు. ఇది అందరికీ ఒక పాఠం అని చెప్పారు. ఇక చైనాలో జరిగిన ఎస్సీవో శిఖరాగ్ర సమావేశంలో రష్యా, చైనా నాయకులతో ప్రధాని మోదీ కూడా ఉండటంపై ఆయన స్పందిస్తూ.. ప్రపంచ క్రమం మారుతున్నట్లుగా కనిపిస్తుందన్నారు. సుంకాలు కారణంగానే ఇదంతా జరుగుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉక్రెయిన్-రష్యా వార్లోకి భారత్ను లాగడంతోనే ఈ తంటాలు వచ్చాయని అభిప్రాయపడ్డారు.
ఇది కూడా చదవండి: Ajit Pawar-IPS: నీకెంత ధైర్యం? మా వాళ్లనే అడ్డుకుంటావా? ఐపీఎస్పై డిప్యూటీ సీఎం చిందులు
ఏప్రిల్ 2018-సెప్టెంబర్ 2019 వరకు ట్రంప్ జాతీయ భద్రతా సలహాదారుగా బోల్టన్ ఉన్నారు. ప్రస్తుతం ట్రంప్ తీసుకున్న నిర్ణయాలను బోల్టన్ బహిరంగంగా తప్పుపట్టారు. ట్రంప్ దగ్గర పని చేసిన వ్యక్తే వ్యతిరేకించారు.
ఇది కూడా చదవండి: Sri Lanka: శ్రీలంకలో ఘోర విషాదం.. లోయలో పడ్డ బస్సు.. 15 మంది మృతి
భారత్పై తొలుత ట్రంప్ 25 శాతం సుంకం విధించారు. అనంతరం రష్యాతో సంబంధాలు పెట్టుకున్నందుకు జరిమానా విధిస్తున్నట్లు మరో బాంబ్ పేల్చారు. అన్నట్టుగానే జరిమానాగా మరో 25 శాతం సుంకం విధించారు. దీంతో భారత్పై 50 శాతం సుంకం అమల్లోకి వచ్చింది. అయితే రైతుల కోసం ఎంత భారమైనా భరిస్తామంటూ మోడీ బదులిచ్చారు. రాజీపడబోమని తేల్చి చెప్పారు.