Trump-Iran: ఇంకా ఎవరైనా చనిపోతే ఖబడ్దార్.. ఖమేనీకి ట్రంప్ గట్టి వార్నింగ్
- ఇరాన్లో ఆర్థిక సంక్షోభంపై నిరసనలు
- భద్రతా దళాల కాల్పుల్లో 16 మంది మృతి
- ఇంకా ఎవరైనా చనిపోతే ఖబడ్దార్
- ఖమేనీకి ట్రంప్ గట్టి వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్లో సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. టెహ్రాన్లో పరిపాలనా భవనం దగ్గరకు నిరసనకారులు రావడంతో భద్రతా దళాలు కాల్పులకు తెగబడ్డారు. దీంతో 16 మంది ఆందోళనకారులు మృతిచెందారు. దీనిపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమేనీకి ట్రంప్ తాజాగా గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇకపై నిరసనకారులు చనిపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జనవరి 5, 2026న ఎయిర్ఫోర్స్ వన్లో ట్రంప్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: Gold Rates: అంతర్జాతీయ సంక్షోభం.. మరోసారి భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
Also Read
- Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- Pakistan Medicine Crisis: పిండి, గ్యాస్ తర్వాత పాకిస్తాన్లో మరో సంక్షోభం.. ప్రజల ప్రాణాలకు ముప్పు..
- Bangladesh: బెంగాల్లో బీజేపీ గెలుపుతో సంతోషంలో బంగ్లాదేశ్ ప్రధాని.. కారణం ఇదే..
- Project Freedom: అమెరికా, ఇరాన్ల మధ్య వివాదంలో కీలక మలుపు.. 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్'కు ట్రంప్ బ్రేక్
ఇరాన్లోని నిరసనలను నిశితంగా గమనిస్తున్నామని.. ఇలానే నిరసనకారులను చంపుకుంటూ పోతే మాత్రం ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. చాలా బలమైన ప్రతిస్పందన ఉంటుందని తేల్చిచెప్పారు. గత శుక్రవారం కూడా ఇదే మాదిరిగా ట్రంప్ హెచ్చరించారు. నిరసనకారులపై జులుం ప్రదర్శిస్తే అమెరికా జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని సూచించారు. తాజాగా మరోసారి తీవ్ర వార్నింగ్లు ఇచ్చారు.
ఇరాన్ స్పందన..
అమెరికా, ఇజ్రాయెల్ వార్నింగ్లపై ఖమేనీ సీనియర్ సలహాదారు అలీ లారిజాని సోషల్ మీడియాలో స్పందించారు. ‘‘ఇజ్రాయెల్, ట్రంప్ ప్రకటనలు వెనుక ఏం జరుగుతుందో స్పష్టం చేస్తున్నాయి. నిజమైన నిరసనకాలు-విధ్వంసక శక్తుల మధ్య మేము స్పష్టమైన వ్యత్యాసాన్ని గుర్తించాం. ఈ దేశం విషయంలో అమెరికా జోక్యం ఈ ప్రాంతం మొత్తాన్ని అస్థిరపరుస్తుంది. అంతేకాకుండా అమెరికా ప్రయోజనాలకు హాని కలిగిస్తుంది. వారు తమ సైనికుల భద్రతను జాగ్రత్తగా చూసుకోవాలి.’’ అని పేర్కొన్నారు.
ఇటీవల ఇరాన్లో ఆర్థిక సంక్షోభం నెలకొంది. పెరిగిపోతున్న ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా.. ఖమేనీ తీరుకు నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. రెండు వారాల నుంచి ఘర్షణలు జరుగుతున్నాయి. దీంతో భద్రతా దళాలు కాల్పులకు తెగబడడంతో 16 మంది నిరసనకారులు చనిపోయారు. అయితే ఈ నిరసనల వెనుక ఇజ్రాయెల్, అమెరికా ఉందని ఇరాన్ ఆరోపిస్తోంది.
ఇది కూడా చదవండి: Trump: నేను సంతోషంగా లేనని మోడీకి తెలుసు.. రష్యా చమురుపై ట్రంప్ వ్యాఖ్య
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!