SCO Summit: నేడే మోడీ-పుతిన్ కీలక భేటీ.. కీలకంగా మారనున్న అమెరికా టారిఫ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SCO Summit: చైనాలో జరుగుతున్న SCO సమ్మిట్ రెండో రోజు కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ సమ్మిట్లో భాగంగా ముందుగా నేతలతో ప్రత్యేక సమావేశం జరుగనుంది. అనంతరం అన్ని దేశాధినేతలు సంయుక్తంగా మీడియాను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇకపోతే, ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ ఉదయం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఈ సమావేశం చైనాలోని టియాంజిన్లో ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం తర్వాత, అమెరికా రష్యా నుంచి చమురు దిగుమతులపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ భారత్, తన ఇంధన అవసరాల దృష్ట్యా రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగించింది. ఈ నేపథ్యంలో మోడీ–పుతిన్ భేటీ అత్యంత ప్రాధాన్యంగా మారింది.
Afghanistan Earthquake: ఆఫ్ఘనిస్తాన్లో 6.0 తీవ్రతతో భూకంపం.. 9 మంది మృతి.. ఢిల్లీలో కూడా ప్రకంపనలు
Also Read
రష్యా నుంచి చమురు కొనుగోలు కొనసాగించిందనే కారణంతో అమెరికా, భారత్పై 25 శాతం అదనపు సుంకం (టారిఫ్) విధించింది. ఈ పరిణామం నేపథ్యంలో మోడీ–పుతిన్ భేటీపై అమెరికా ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న “టారిఫ్ వార్” నిర్ణయం తర్వాత తొలిసారిగా ఈ స్థాయి సమావేశం జరగడం గమనార్హం.
ఈసారి SCO వేదికపై చైనా, రష్యా, భారత్ నేతలు ఒకే వేదిక నుంచి తమ అభిప్రాయాలను వ్యక్తం చేయనున్నారు. ముఖ్యంగా చమురు, వాణిజ్యం, భద్రతా అంశాలపై ఒకే తీర్మానం తీసుకునే అవకాశముందని అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి. రష్యా నుంచి భారత్, చైనా ఎక్కువగా చమురు దిగుమతి చేస్తుండటంతో అమెరికా ఆంక్షలు తక్కువ ప్రభావం చూపించాయి.
బీచ్ బ్యూటీగా మెరిసిన నేహా శెట్టి.. ఫ్యాన్స్ క్రేజ్ అంత ఇంత కాదు…
విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ప్రకారం.. ప్రధాని మోడీ ముందుగా SCO ప్లీనరీ సెషన్లో ప్రసంగించి, భారతదేశం ప్రాంతీయ సహకారంపై తీసుకున్న దృక్పథాన్ని వివరించనున్నారు. ఆ తరువాత పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు ముగించుకుని భారత్కి తిరుగు ప్రయాణం కానున్నారు. ఇకపోతే, భారత్ తన విదేశాంగ విధానంలో మార్పు ఉండదని స్పష్టంగా ప్రకటించింది. రష్యా నుంచి చమురు కొనుగోలు కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అంతేకాకుండా రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ద్వారా ఒక పెద్ద గ్లోబల్ సంక్షోభాన్ని భారత్ తప్పించిందని తాజాగా వెలువడిన నివేదికలు సూచిస్తున్నాయి. మొత్తానికి, SCO వేదికపై మోడీ–పుతిన్ సమావేశం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.
తాజావార్తలు
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
-
Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్పై పోరాటం!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!