అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మాజీ అధ్యక్షుడి మరణంపై అనుచితంగా మాట్లాడారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ పరిపాలన గురించి మాట్లాడుతూ ఇటీవల మరణించిన మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ మరణంపై ట్రంప్ అవహేళనగా మాట్లాడారు. జో బైడెన్ తన కంటే ‘చెత్త’ అధ్యక్షుడు అని తెలుసుకుని జిమ్మీ కార్టర్ సంతోషంగా కన్నుమూశారని వ్యాఖ్యానించారు. గురువారం ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో కలిసి ఓవల్ ఆఫీసులో విలేకర్లతో మాట్లాడుతూ ట్రంప్ ఈ అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: Pawan Kalyan : పవర్ ఆఫ్ మ్యానరిజమ్స్.. ‘బద్రి’ రీరిలీజ్ ప్లానింగ్
జో బైడెన్ పరిపాలన చాలా భయంకరమైందన్నారు. ఎన్నికల్లో ప్రజలను మోసం చేయడంలో సమర్థులని వ్యాఖ్యానించారు. ఆ అసమర్థులు ప్రజలకు ఏమీ చేయలేకపోయారని ధ్వజమెత్తారు. అమెరికా చరిత్రలోనే బైడెన్ది చెత్త పరిపాలన అంటూ మండిపడ్డారు. జమ్మీ కార్టర్ కంటే బైడెన్ అధ్వానంగా పరిపాలించారని.. ఈ విషయం తెలుసుకుని కార్టర్ సంతోషంగా కన్నుమూశారని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా 39వ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ బాధ్యతలు నిర్వర్తించారు. గతేడాది డిసెంబరు 29న ఆయన మరణించారు. జనవరిలో జరిగిన అంత్యక్రియలకు ట్రంప్తో సహా పలువురు మాజీ అధ్యక్షుల దంపతులు హాజరయ్యారు.
ఇది కూడా చదవండి: Sanju Samson vs Rahul Dravid: సంజు శాంసన్, ద్రవిడ్ల మధ్య లడాయి.. సీఎస్కేకు వచ్చేయ్ అంటూ కామెంట్స్..